Publish Date:Oct 14, 2022
తండ్రికి చికిత్స చేయించాలని హీరో తన స్నేహితులతో పాటు ఆయన్ను పక్క ఊర్లో ఆస్పత్రికి తీసికెళు తూంటాడు. కనుచూపు మేరలో చిన్న కాలవవంతెన దాటాలి. కానీ అక్కడ విలన్ గ్యాంగ్ వెయిట్ చేస్తుం టుంది. కారు, రెండు ఆటోలూ ఆపేసి ఏటి కనుక్కోరా అని హీరో అసిస్టెంట్ని పురమాయిస్తాడు. వాడు తన్నులు తిని వస్తాడు. కార్లు, జీపులు, ఆటోలు ఇయాల ఎల్లేందుకు పర్మిసన్ ఇవ్వరంట విలన్ మాటగా చెప్పాడు. హీరోగారు తండ్రి పరిస్థితి చూసి కాస్తంత తగ్గి ఒక మైలు వెనక్కి వెళ్లి మరో మార్గంలో ఆస్పత్రికి తీసికెళతాడు. కానీ జగన్ మాత్రం రైతుల పాదయాత్రను సరిగ్గా ధవిళేశ్వరాన్ని దాటనీయకుండా చేయడా నికే కంకణం కట్టుకున్నారు.
గోదావరి నది మీద రాజమండ్రి కొవ్వూరు మధ్య రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వారం రోజుల పాటు మూసివేశారు. రోడ్డు మరమ్మత్తులు ఉన్నాయని మూసేస్టున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. కొన్ని మరమ్మతులను ఆర్ అండ్బి, రైల్వేశాఖ చేపట్టనున్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర శనివారం కొవ్వూరు చేరాలి. అదీ ఈ బ్రిడ్జ్ మీదుగానే యాత్ర కొనసాగాలి. కానీ మరమ్మత్తు పనులు జరుగుతున్నపుడు రైతుల పాదయాత్ర ఎలా వెళుతుంది.
పాదయాత్రతో ప్రభుత్వానికి జరిగే మేలు లేదు. అందుకే వంతెన మరమ్మతు సంగతి హఠాత్తుగా గుర్తొ చ్చింది. ఇటీవలి భారీ వర్షాలు, వరదల్లో జనం ఇబ్బందులు పడినపుడు మాత్రం దాన్ని గురించి ఆలోచనే లేదు. ఇపుడు రైల్వేవారితో కలిసి మరమతు కుట్రకి పాల్పడ్డారన్నది పరిశీలకుల మాట. రైతుల పాదయాత్రలో వెయ్యిమందే పాల్గొంటున్నారు. వెయ్యిమంది నడిచి వెళతారు. అంతేగాని టూవీ లర్లకి పార్టీ జెండాలు కట్టుకుని గోల చేస్తూ, చెవులు చిల్లులు పడేలా నినాదాలు చేస్తూ వెళ్లరు. పాద యాత్రకి వంతెన మరీ దెబ్బతింటుందనే ఆలోచనే అయితే సర్కారు వారి ప్రచారహోరుకి వెళ్లిన దారులన్నీ నాశనమయ్యాయి గదా వాటి సంగతేమిటని జనం ప్రశ్నిస్తున్నారు.
రిపేరు అయితే వాహనాలు రివ్వున వెళతాయిగదా! వాహనాలు వెళ్లడం కంటే పాదయాత్రలో వెళ్లై రైతు లకు పెద్దగా ప్రాధాన్యతనీయనవసరం లేదను కున్నారనే అనుకోవాలి. రైతు ఉద్యమం, పాద యాత్రలు తమ ప్రతిష్ట ను మరింత దెబ్బతీస్తున్నా యన్న అక్కసుతోనే జగన్ సర్కార్ ఊహించని చర్యలకు దిగు తోంద న్నది పరిశీలకుల మాట. అమరావతి రైతుల పాదయాత్రను ఈ విధంగా అడ్డుకోవడం నీచమని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ ఈ చర్యలు రైతుల నిర్ణయాన్ని వేగాన్ని ఆపలేవ న్నది, తగ్గించ లేవని జగన్ సర్కార్ తెలుసుకోవాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bridge-rapairs-nothing-but-to-stop-farmaerspadayatra-39-145421.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.