ర్యాంకుల కోసం లంచాలు.. అడ్డంగా బుక్కైన కేఎల్ యూనివ‌ర్శిటీ

Publish Date:Feb 2, 2025

Advertisement


అత్యున్న‌త ప్ర‌మాణాలు పాటిస్తూ పోటీ ప్ర‌పంచంలో నిల‌బ‌డ‌టం ముఖ్య‌మా.. లేదంటే.. ఆ రేటింగ్స్ ను కొనుక్కోవ‌టం ముఖ్య‌మా.. అయితే, మెజార్టీ విద్యా సంస్థ‌లు మొద‌టి సూత్రాన్నే న‌మ్ముకొని ముందుకెళ్తాయి. కానీ, కొన్ని కంత్రీ విద్యా సంస్థ‌లు మాత్రం  ఈ రెండో లైన్ నే ఫాలో అవుతున్నాయి. ఇలా అడ్డ‌దారుల‌ను ఎంచుకున్న‌వాళ్లు ఇప్పుడు సీబీఐ కేసుల్లో అరెస్ట్ అవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ బ్యాచ్ లో గుంటూరు జిల్లా వ‌డ్డేశ్వ‌రంలోని కేఎల్ విశ్వ‌విద్యాల‌యం కూడా ఉండ‌టం విశేషం. ఏ ప్ల‌స్ ప్ల‌స్ గుర్తింపు పొందేందుకు న్యాక్ బృందానికి  కేఎల్ యాజ‌మాన్యం లంచాలు ఇచ్చింది. దేశ వ్యాప్తంగా 20 చోట్ల విద్యా సంస్థ‌ల్లో సీబీఐ సోదాలు చేయ‌గా.. న్యాక్ ఏ ప్ల‌స్ ప్ల‌స్ అక్రిడేష‌న్ కోసం విద్యా సంస్థ‌ల ప్ర‌తినిధులు త‌నిఖీ బృందానికి లంచాలు ఇచ్చిన‌ట్లు సీబీఐ గుర్తించింది. దీంతో లంచాలు ఇచ్చిన వారిని, లంచాలు తీసుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 14 మందిపై కేసులు న‌మోదు చేయ‌గా.. 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.  న్యాక్ ప‌రిశీల‌న బృందానికి బంగారు నాణేలు, న‌గ‌దు, మొబైల్ పోన్లు, ల్యాప్ టాప్ లు లంచంగా ఇచ్చిన‌ట్లు ఇప్ప‌టికే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ గుర్తించింది. నిందితులు కేఎల్ ఎడ్యుకేష‌న‌ల్ ఫౌండేష‌న్ వైస్ ఛాన్స‌ల‌ర్ జేపీ సార‌థి వ‌ర్మ‌, ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్‌ కోనేరు రాజా, హైద‌రాబాద్ క్యాంప‌స్ డైరెక్ట‌ర్ ఎ. రామ‌కృష్ణ తో పాటు న్యాక్ ప‌రిశీల‌న క‌మిటీ చైర్మ‌న్ స‌మ‌రేంద్ర నాథ్ సాహా, ప‌లువురు క‌మిటీ స‌భ్యుల‌ను సీబీఐ అరెస్ట్ చేసి విజ‌య‌వాడ జిల్లా జైలుకు త‌ర‌లించింది. చెన్నై, బెంగ‌ళూరు, విజ‌య‌వాడ‌, భోపాల్‌, ఢిల్లీలో సోదాలు చేసిన త‌రువాత సీబీఐ వారిని  అరెస్టు చేసింది. ఈ సోదాల్లో 37ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు, ఆరు ల్యాప్ టాప్ , సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ( న్యాక్‌) అనేది భారతదేశంలోని ఉన్నత విద్యా సంస్థలను అంచనా వేసి, గుర్తింపునిచ్చే ఒక పబ్లిక్ అటానమస్ బాడీ. దీనికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులు సమకూరుస్తుంది. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. విద్యా సంస్థ‌ల్లో అన్ని ప్ర‌మాణాలు పాటిస్తున్నారా..? నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డానికి ఎలాంటి  విధానాలు అమ‌లు చేస్తున్నారు అనేదాన్ని బేస్ చేసుకొని న్యాక్ రేటింగ్ ఇస్తుంది. వ‌ర్సిటీలు, కాలేజీలు ఈ రేటింగ్ ను చాలా కీల‌కంగా భావిస్తుంటాయి. న్యాక్ రేటింగ్ లో ఏ ప్ల‌స్ ప్ల‌స్ అంటే టాప్ అన్న‌ట్లు లెక్క‌. ఆ త‌రువాత ఏ ప్ల‌స్‌, ఏ,  బి ప్ల‌స్ ప్ల‌స్, బీ ఇలా ఎనిమిది గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్‌- డీ అంటే న్యాక్ గుర్తింపు పొంద‌లేద‌ని అర్ధం. యూనివ‌ర్శిటీలు పాటిస్తున్న ప్ర‌మాణాల‌ను బ‌ట్టి ఈ రేటింగ్ ఇస్తుంటారు. కొన్ని వ‌ర్శిటీల్లో ల్యాబ్ లు, టీచింగ్ స్టాప్ లాంటి విష‌యాల్లో అర‌కొర ప్ర‌మాణాలు పాటిస్తూ అడ్డ‌దారుల్లో రేటింగ్ పొందుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కొంద‌రు అడ్డ‌దారిలో అక్రిడిటేష‌న్ రేటింగ్ కోసం లంచాలు ఇస్తూ ఉంటారు. గ‌తంలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు వెలుగు చూశాయి. కానీ, ఈసారి న్యాక్ ప‌రిశీల‌న బృందం చైర్మ‌న్ స‌హా ఆ బృందంలో ఉన్న ఏడుగురు స‌భ్యులు అరెస్ట్ అవ్వ‌డ‌మే సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌మాణాల‌కు తిలోద‌కాలిస్తూ లంచాలు ఇస్తే రేటింగ్ ఇస్తున్నార‌న్న వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ కేసులో ప్ర‌స్తుతం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన ప‌ది మందిని కోర్టులో హాజ‌రు ప‌ర్చారు. కోర్టు వారికి  రిమాండ్ విధించింది. అయితే, సీబీఐ అధికారులు ఎలాంటి ఛార్జిషీట్ దాఖ‌లు చేయ‌బోతున్నారు. ఎలాంటి కేసులు న‌మోదు చేశార‌నేది తెలియాల్సి ఉంది. 

న్యాక్ నుంచి ఏ ప్ల‌స్ ప్ల‌స్ ర్యాంకులో కొన‌సాగుతూ దేశంలోనే అత్యున్న‌త యూనివ‌ర్శిటీల్లో 22వ ర్యాంకులో కేఎల్ యూనివ‌ర్శిటీ ఉంది. అయితే, తాజాగా సీబీఐ అధికారుల త‌నిఖీల్లో కేఎల్ యూనివ‌ర్శిటీ బండారం బ‌య‌ట‌ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు విద్యా ప్ర‌మాణాల విష‌యంలోనూ, టీచింగ్ స్టాప్ తోపాటు కాలేజీలోని మౌలిక వ‌స‌తులు.. త‌దిత‌ర అంశాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి న్యాక్ బృందం ర్యాంకింగ్ ఇస్తుంద‌ని అంద‌రూ భావిస్తూ వ‌చ్చారు. కానీ, ప్ర‌స్తుతం కేఎల్ విశ్వ‌విద్యాల‌యం బండారం బ‌య‌ట‌ప‌డటంతో దేశ వ్యాప్తంగా యూనివ‌ర్శిటీల్లో న్యాక్ ఇచ్చిన ర్యాంకింగ్స్ పై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేఎల్ యూనివ‌ర్శిటీలో  50 కోర్సులకుపైగా ఉన్నాయి.. సుమారు 20వేల మంది విద్యార్థులు ఇందులో విద్య‌న‌భ్య‌సిస్తున్నారు. ర్యాంకును బూచిగా చూపిస్తూ డీమ్డ్ యూనివ‌ర్శిటీగా కేఎల్ యూనివ‌ర్శిటీ కొన‌సాగుతుంది. గ‌తంలో కేఎల్ యూనివ‌ర్శిటీలో  అనేక సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇక్క‌డ చ‌దువుకునే విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.. విద్యార్థుల మ‌ధ్య వ‌ర్గ‌పోరు వంటి విష‌యాల‌ను బ‌య‌ట‌కు పొక్కకుండా యూనివ‌ర్శిటీ యాజ‌మాన్యం జాగ్ర‌త్త‌ప‌డుతూ వ‌చ్చింది. అయితే, ప్ర‌స్తుతం ఏకంగా న్యాక్ బృందం స‌భ్యుల‌కే డ‌బ్బులు ఇచ్చిన‌ట్లు తేల‌డంతో ఆ యూనివ‌ర్శిటీలో త‌మ విద్యార్థుల‌ను చేర్పించిన త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

న్యాక్ ఇచ్చిన ఏ ప్ల‌స్ ప్ల‌స్ ర్యాంక్ ను చూపించి త‌మ‌ది డీమ్డ్ యూనివ‌ర్శిటీ అంటూ విద్యార్థుల‌ను వారి త‌ల్లిదండ్రుల‌ను ఇన్నాళ్లు కేఎల్ యూనివ‌ర్శిటీ మ‌భ్య‌పెట్టిన‌ట్లు ప్ర‌స్తుతం తేట‌తెల్లం అయ్యింది. ఈ యూనివ‌ర్శిటీలో తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులే కాకుండా చెన్నై, క‌ర్ణాట‌క‌, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా విద్య‌న‌భ్య‌సిస్తున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో యూనివ‌ర్శిటీలో స‌రియైన స‌దుపాయాలు కూడా లేవ‌న్న వాద‌న వినిపిస్తున్నది. అయితే, సీబీఐ విచార‌ణ పూర్త‌యిన త‌రువాత న్యాక్‌, కేంద్ర హైయ‌ర్ ఎడ్యుకేష‌న్  కేఎల్ యూనివ‌ర్శిటీపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌నే చూడాలి.

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.