పార్టీ ఫిరాయించేవాళ్లకే పదవులా?

Publish Date:Jun 10, 2015

Advertisement

అనేక అనుమానాలు, ఊహాగానాల మధ్య బొత్సా సత్యనారాయణ ఎట్టకేలకు వైకాపాలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన బొత్సకు ఆయన కుటుంబసభ్యులకు రాష్ట్ర విభజన జరిగిన తరువాత కాంగ్రెస్ కు ప్రజలలో అంత ఆదరణ లేకపోయేసరికి ఏ ఒక్కరికీ ఒక్క డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే బొత్సా ఖాళీగా ఉండలేక ఆఖరికి పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో ఆయన కాంగ్రెస్ ను వీడి అటు బీజేపీ లోకో ఇటు వైకాపా లోకో చేరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగింది. కానీ బొత్సా ఈ వార్తలకు ఫులుస్టాప్ పెట్టి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. అసలు ఎప్పుడో వైకాపాలో చేరాల్సిన బొత్సా అప్పట్లో బేర సారాలు కుదరక పార్టీ మారలేదు. అప్పట్లో 8 ఎమ్మెల్సీ సీట్లు డిమాండ్ చేసిన బొత్సా దానికి వైకాపా అధ్యక్షుడు జగన్ అంగీకరించకపోవటం.. తరువాత 4 సీట్లతో పాటు బొత్సాను ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ ను చేసేలా ఒప్పందం కుదుర్చుకొని ఫార్టీ ఫిరాయించారు. మరోవైపు గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖజిల్లాలో అనుకున్న ఫలితాలు రాకపోయేసరికి అక్కడ ఓ బలమైన నాయకుడిని నిలబెట్టాలని జగన్ చూస్తున్న నేపథ్యంలో బొత్స ఇదే అదను చూసుకొని వైకాపాలోకి జంప్ చేశారు. కానీ బొత్సా రాక వైకాపా అధ్యక్షుడు జగన్ కు ఆనందాన్నిచ్చినా ఆపార్టీలో కొంత మంది ఆసంతృప్తిగా ఉన్నారన్న దానిలో ఎటువంటి సందేహం లేదు.

 

మరోవైపు బొబ్బిలి రాజవంశానికి చెందిన సుజయ్ రంగారావు సోదరులు విజయనగరంజిల్లా నుండి వైకాపా పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీకోసమే పనిచేసి ఎంతో సేవ చేసిన నాయకులు. వైకాపా లో బొత్సా చేరుతున్నారు అన్న వార్త తెలిసినప్పటి నుండే అలకపాన్పుకెక్కారు ఈ సుజయ్ సోదరులు. మరి ఒకే ఒరలో రెండు కత్తులు ఉండగలవా.. అసలే గతం నుండే బొత్సా, సుజయ్ రంగారావు సోదరుల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి... ఈ నేపథ్యంలో బొత్స చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. బొత్స పార్టీలో చేరటంతో జగన్ మీద పూర్తి వ్యతిరేక భావంతో ఉన్నారు సుజయ్ సోదరులు. పార్టీ లో ఉండి పార్టీకి పనిచేసిన వారికి పదవులు ఇవ్వలేదుకాని, బయటి పార్టీ నుండి వచ్చిన వాళ్లకు పదవులు కట్టబెడతారని వారికి మంటెక్కి వైకాపా నుండి తెలుగుదేశం పార్టీకి మారే యోచనలో ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ సుజనా రంగారావు సోదరుడికి ఎమ్మెల్సీ సీటుకూడా కేటాయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

 

మొత్తానికి రాజకీయాలు ఎలా మారిపోయాయంటే ఎవరు ఏ పదవి ఇస్తానంటే ఆ పార్టీలోకి చేరిపోయి ప్రజల కోసం కాకుండా తమ స్వార్థం కోసం ఉపయోగించుకునేలా తయారయాయి. పార్టీ అధ్యక్షులు కూడా ఎంతోకాలం పార్టీలో నమ్మకంగా ఉండి పార్టీ అభివృద్ధికి పాటుపడి ఉన్నవారికి మాత్రం పదవులు ఇవ్వకుండా పార్టీలు జంప్ చేసేవారికి ఇవ్వడం కూడా ఆశ్చర్యకరం. అసలు జగన్ పార్టీ స్థాపించినప్పుడు దోచుకున్నదే దోచుకోవడానికి పార్టీ పెడుతున్నాడని జగన్ ను విమర్శించిన బొత్సా.. ఇప్పుడు అదే పార్టీలో చేరడం.. జగన్ బొత్సాకు ఆహ్వానం పలకడం చూస్తుంటే రాజకీయమంటే ఇదేనేమో అనిపిస్తుంది. మరోవైపు బలమైన సామాజిక వర్గానికి చెందిన సుజయ్ పార్టీని వీడితే, తమకు భారీ నష్టం తప్పదని కూడా ఆ పార్టీ వర్గాలు అంచనా వేసి సుజయ్‌ని శాంతపరిచేందుకు ఆ పార్టీ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు.

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.