వై దిస్ కోల వెర్రి బొత్స, లగడపాటి?

Publish Date:Nov 1, 2013

Advertisement

 

ప్రస్తుతం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమైక్యాంధ్రతో పోరాటంతో పాటు వారిలో వారు కూడా  పోరాటాలు చేసుకొంటూ చాలా బిజీగా ఉన్నారు. అయితే ఆ పోరాటాలు దేనికోసం?

 

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కొన్ని వారాల క్రితం విజయనగరంలో తన ఆస్తులపై సమైక్యవాదులు దాడులు చేస్తునప్పుడు “రాష్ట్ర విభజన విషయంలో కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ పెద్దలే తనను తప్పు ద్రోవ పట్టించారని, మళ్ళీ వారే తాను ముఖ్యమంత్రి పదవి కోసం అర్రులు చాస్తూ విభజనకు కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రోత్సహించానని ప్రచారం చేస్తూ తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు. వారు తన రాజకీయ భవిష్యత్ దెబ్బతీయాలనే ఆవిధంగా కుట్రలు పన్నుతున్నారని తీవ్ర ఆరోపణలు చేసారు. అయితే ఎవరు కుట్రలు పన్నుతున్నారో మాత్రం చెప్పలేదు.

 

కానీ దివాకర్ రెడ్డి విషయంలో బొత్స వ్యవహరించిన తీరుని తప్పు పడుతూ లగడపాటి అన్న మాటలతో కనపడని ఈ యుద్ధం వారిద్దరి మధ్యేజరుగుతోందని స్పష్టం అయిపోయింది.

 

లగడపాటి మీడియాతో మాట్లాడుతూ "కొందరు మమ్మల్ని పార్టీ నుండి బయటకి పొమ్మంటున్నారు. ఎందుకంటే మేము క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నామని చెపుతున్నారు. వ్యక్తులు తమ అభిప్రాయాలను చెప్పడం పార్టీ వ్యతిరేఖం కాదు. అది మన ప్రజాస్వామ్య పద్ధతని తెలుసుకోవాలి. జేసీ దివాకర్ రెడ్డి తాత ముత్తాతల కాలం నుండి అంటే దాదాపు నాలుగు దశాబ్దాల నుండి వారి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తోంది. అటువంటి కుటుంబానికి చెందిన ఒక సీనియర్ నేతను బయటకి పొమ్మని చెపితే, ముందుగా సదరు వ్యక్తులకే వ్యక్తిగతంగా, రాజకీయంగా కూడా ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారు," అని హెచ్చరించారు.

 

అయితే వీరిరువురి మధ్య ఈ జగడానికి కారణమేమిటని ఆలోచిస్తే రాష్ట్రం విడిపోయిన తరువాత ముఖ్యమంత్రి పదవి చెప్పట్టేందుకు జరుగుతున్నా పోటీగా కనబడుతోంది.

 

లగడపాటి మొదటి నుండి సమైక్యవాదిగా ప్రజలలో మంచి గుర్తింపు పొందారు. కానీ రాష్ట్ర విభజన అనివార్యమని బహుశః అందరికంటే ఎక్కువ బాగా తెలుసు. గనుక ఆయన దూరదృష్టితో గట్టిగా సమైక్యవాదం పట్టుకొని ముందుకు సాగుతూ నిత్యం మీడియాలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ముఖ్యమంత్రి పదవికి పరిశీలనకు వచ్చే పేర్లలో అప్పుడు ఆయన పేరే మొదట ఉండే అవకాశం ఉంటుందనే ఈ తాపత్రయమంతా.

 

ఇక బొత్స తనకి ముఖ్యమంత్రి పదవిపై ఆశ పెట్టుకోవడంలో తప్పేమీ లేదని అందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ఏనాడో చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తరువాతయినా తన కల నెరవేర్చుకోవాలనుకోవడం సహజం గనుక తన ప్రయత్నాలు తను చేసుకొంటూ ఉండవచ్చును. అటువంటప్పుడు పోటీ దారుల మధ్య ఇటువంటి యుద్దాలు జరగడం కూడా సహజమే.

 

అయితే కాంగ్రెస్ అధిష్టానం గత కొన్నేళ్లుగా ఎవరూ ఊహించని వ్యక్తులనే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడుతోంది. అంటే ఆ ఎవరూ ఊహించలేని వ్యక్తి ఎవరు? పురందేశ్వరా? చిరంజీవా? లేక జగనా? ఊహిస్తూనే ఉండండి.

By
en-us Political News

  
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.