ఈ ప్రభుత్వాలకు జ్ఞానోదయం కలిగేదెప్పుడో

Publish Date:Jul 8, 2013

Advertisement

 

బీహార్ రాష్ట్రం భోధగయలో గల ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైన మహాబోధి ఆలయ పరిసరాలలో ఆదివారం తెల్లవారు జామున 5.30-6.00గంటల మధ్య తొమ్మిది వరుస బాంబు ప్రేలుళ్ళు జరిగాయి. కానీ అవి అంత శక్తివంతమయినవి కాకపోవడంతో ఆలయానికి గానీ, బుద్ధుడు తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన భోదీ వృక్షానికి గానీ ఎటువంటి హానీ జరుగలేదు. ఈ ఘటనలో ఇద్దరు బొద్ద సాధువులు మాత్రం తీవ్ర గాయాల పాలయ్యారు. దీనికి ఇండియన్ ముజాహుద్దీన్ తీవ్రవాద సంస్థే కారణం అయిఉండవచ్చునని హోంశాఖ భావిస్తోంది.

 

విచారకరమయిన విషయం ఏమిటంటే, ఇద్దరు తీవ్రవాదులు బౌద్ధ గయలో ప్రవేశించారని వారం రోజుల క్రితమే ఇంటలిజన్స్ విభాగం బీహార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పోలీసులు వారి ఆచూకి కనిపెట్టేందుకు ప్రయత్నించారు కానీ సఫలం కాకపోవడంతో వారు ఆలయ అధికారులకు హెచ్చరికలు జారీ చేసి చేతులు దులుపుకొన్నారు. ఇది జరిగిన వారం రోజులకే ఇంటలిజన్స్ హెచ్చరికలను నిజం చేస్తూ ఆలయంలో ప్రేలుళ్ళు జరిగాయి.

 

దీనిని బట్టి ప్రభుత్వాలు, మన పోలీసు వ్యవస్థలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్ధం అవుతోంది. ఇటువంటి సంఘటనలలో మనుషులు ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ ప్రభుత్వాలు, రక్షణ వ్యవస్థలు ఉదాసీనంగా వ్యవహరించడం, ఘటన జరిగిన తరువాత కూడా అంతే ఉదాసీనంగా వ్యవహరించడం చాలా అమానుషం. ప్రజాసేవే తమ జీవిత పరమావధి అన్నట్లు మాట్లాడే రాజకీయ నేతలు, పార్టీలు, ప్రభుత్వాలు ఎన్నికలలో ప్రజల ఓట్లు నొల్లుకొనేందుకు అనేక పధకాలు, వరాలు ప్రకటిస్తుంటాయి. కానీ, ఇటువంటి ఘటనలు జరుగకుండా నివారించి వారి ప్రాణాలు కాపాడాలని మాత్రం ఎన్నడూ ఆలోచించకపోవడం చాల అమానుషం.

 

ఇటువంటి ఉగ్రవాద దాడులు దేశంలో ఎన్నిసార్లు జరుగుతున్నా, ఎంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా కూడా చలించని జడత్వ స్థితికి చేరుకొన్నాయి మన వ్యవస్థలు. కనీసం వాటి నుండి పాఠాలు నేర్చుకోనప్పుడు, ఇటువంటి ఘటనలను నివారించాలనే ధృడ సంకల్పం అవి కలిగి ఉండాలని ఆశించడం కూడా అడియాసే అవుతుంది.

 

మన దేశంలో ఉగ్రవాదులు జొరబడి విచ్చలవిడిగా విద్వంసానికి పాల్పడుతుంటే దానిని సమర్ధంగా అడ్డుకోవలసిన ప్రభుత్వాలు, వారిని, వారి ఉగ్రవాద చర్యలను కూడా రాజకీయ కోణంలోంచే చూడటం వల్లనే ఇటువంటివి పునరావృతమవుతున్నాయి. దేశంలో ఉగ్రవాదులు జొరబడటం అంటే మనింట్లో దొంగలు జొరబడినట్లేనని ఈ ప్రభుత్వాలు గ్రహించనంత కాలం ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి.

By
en-us Political News

  
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.