సంకట స్థితిలో దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతలు

Publish Date:Mar 15, 2025

Advertisement

మామూలుగానే దక్షిణాదిలో బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరమీదకు వచ్చిన క్షణం నుంచీ దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ నేతల పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. డీలిమిటేషన్ తో పాటు.. త్రిభాషా సూత్రాన్ని బీజేపీ హై కమాండ్ చర్చలోకి తీసుకురావడంతో దక్షిణాదిలో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఆ పార్టీ నేతలకు ప్రజలనుంచి ముఖం చాటేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.  

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ డీలిమిటేషన్, త్రిభాషా సూత్రాలకు వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా మోడీకి వ్యతిరేకంగా ఆందోళనకు నాయకత్వం వహించేందుకు ముందుకు వచ్చారు. దక్షిణాది రాష్ట్రాల తరఫున తన గొంతును బలంగా వినిపిస్తున్నారు. దక్షిణాది రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దక్షిణాది పార్టీలను కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఏకం చేయడానికి నడుంబిగించారు. ఇప్పటికే ఆ పార్టీ ప్రతినిథులు తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నాయకులను చెన్నై వేదికగా ఈ నెల 22న జరిగే అఖిల పక్ష భేటీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. చెన్నై వేదికగా డీఎంకే నేతృత్వంలో జరగనున్న అఖిలపక్ష భేటీలో కేంద్రం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రయత్నాలకు, కసరత్తుకు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. కేంద్రం ప్రతిపాదించిన విధంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లుతుంది.

డీఎంకే నేతలు ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కర్నాటక సీఎం సిద్దరామయ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిలను అఖిలపక్ష భేటీకి ఆహ్వానించారు. త్రిభాషా సూత్రం విషయంలో దక్షిణాది రాష్ట్రాల నాయకులలో, పార్టీలలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంలో మాత్రం దక్షిణాది రాష్ట్రాల నేతలందరిలో ఏకాభిప్రాయమే వ్యక్తం అవుతోంది. పార్టీలకు అతీతంగా నేతలంతా డీలిమిటైజేషన్ ను వ్యతిరేకిస్తున్నారు.  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాదిరిగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మోడీ సర్కార్ డీలిమిటేషన్ కసరత్తును బహిరంగంగా విమర్శించారు.  దక్షిణాదికి చెందిన రాజకీయ నేతలంతా డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఒకే వేదికపైకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.

అదే సమయంలో దక్షిణాదికి చెందిన బీజేపీ నేతలు మాత్రం ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో పడ్డారని పరిశీలకులు అంటున్నారు.  ఇష్టం ఉన్నా లేకున్నా డీలిమిటేషన్ కు అనుకూలంగా తప్ప వ్యతిరేకంగా నోరెత్తలేని సంక్లిష్ట స్థితిలో వారు మిగిలిపోయారు. ఎందుకంటే పార్టీ లైన్ కు వ్యతిరేకంగా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నోరెత్తలేరు.. అలాగని దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం చేకూర్చే నియోజకవర్గాల పునర్విభజనకు అనుకూలంగా మాట్లాడే ధైర్యం చేయలేదు. డిలిమిటేషన్ పేరిట కాంగ్రెస్, డీఎంకేలు విభజన రాజకీయాలకు తెరతీస్తున్నారని బీజేపీ ఓబీసీ విభాగం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండి పడ్డారు. దక్షిణాది బీజేపీ నేతలు డిలిమిటేషన్ పై ఈ విమర్శ మాత్రమే చేయగలరనీ, అయితే ఇదేమీ వారికి పెద్దగా ప్రయోజనం చేకూర్చే అవకాశం లేదనీ పరిశీలకలు విశ్లేషిస్తున్నారు.  దక్షిణాదిలో కర్నాటక మినహా మరే రాష్ట్రంలోనూ బీజేపీకి చెప్పుకోదగ్గ బలం లేదు. కర్నాటక వినా మరే దక్షిణాది రాష్ట్రంలోనూ బీజేపీ ఇంత వరకూ ఒక్కటంటే ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఒకింత బలపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ డిమిలిటేషన్ వ్యవహారం తెలంగాణలో కూడా ఆ పార్టీ పరిస్థితిని మళ్లీ మెదటికి తీసుకువస్తుందన్న భావన రాజకీయవర్గాలలోనే కాదు, బీజేపీ శ్రేణులలో సైతం వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.