కమలానికి కాదేదీ అనర్హం.. కరోనా వ్యాక్సిన్ సైతం!

Publish Date:Oct 24, 2020

Advertisement

ఇంతకూ వ్యాక్సిన్ ఉచితమా? కాదా?

 

బీహార్ మేనిఫెస్టోతో కొత్త సందేహాలు

 

భారతీయ జనతా పార్టీ అంటే గంగానది అంత స్వచ్ఛమైనది. ఇంకా ఎక్కువ మాట్లాడితే గంగ కంటే స్వచ్ఛమైనది. దానికి రాజకీయాలు-అధికారం కంటే సిద్ధాంతం ముఖ్యం. రాజకీయ అవకాశవానికి అల్లంత దూరంలో ఉంటుంది. తుచ్ఛమైన రాజకీయ ప్రయోజనాల కోసం, అవసరార్ధ రాజకీయాలు చేయదు. వాజపాయ్ మాదిరిగా, అవసరమైతే అధికారమయినా వదులుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. అది.. అవసరార్ధ రాజకీయాలు, పూటకో మాట, రాష్ర్టానికో హామీ ఇచ్చే కాంగ్రెస్ పార్టీలా కాదు. కాంగ్రెస్ అనే రాజకీయభూతం, దేశంలో సృష్టించిన పుండాకోరు సంస్కృతిని కూకటివేళ్లతో పెకలించి, దాని భ్రష్ఠాచార-అవకాశ వాద రాజకీయాలకు.. చరమగీతం పలికేందుకు పుట్టిన పార్టీ బీజేపీ!

 

అంత పవిత్రమైన, అంత మంది పులుకడిగిన ముత్యాలున్న పార్టీ.. ఒక ఓటుతో అధికారాన్నే కాదనుకున్న పార్టీ... కేవలం ఒక్క రాష్ట్రంలో ఓట్ల కోసం అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతుందా? అసాధ్యం.. నెవ్వర్.. అసంభవ్.. కండిత ముడియాదు.. ఆగోదిల్ల.. హైలీ ఇంపాజిబిల్!!! అవును కదా?.. నిన్నటి వరకూ అంతా అలాగే ఫీలయ్యారు. కానీ కేంద్రమంత్రి నిర్మలమ్మ ప్రకటించిన, బీహార్ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో చూసిన తర్వాత.. అవకాశవాద రాజకీయాలు, అనుచిత హామీల తీరు చదివిన తర్వాత.. రాజకీయ జేజెమ్మ కాంగ్రెస్‌కే, కమలం పువ్వు పార్టీ దగ్గులు నేర్పుతుందనిపించక మానదు.
ప్రపంచం అంతా కరోనా వైరస్‌తో గజగజలాడుతోంది. శ్వేత సౌదాధిపతి, ప్రపంచపెద్దన్న ట్రంపు నుంచి.. భారత రెండవ పౌరుడయిన మన నెల్లూరు నాయుడు గారి వరకూ, కరోనా ఎవరినీ విడిచిపెట్టలేదు. పాపం దానికి కులాలు-మతాలు-హోదాలు-పదవులతో పనిలేదు.  ప్రపంచం మీదకు చైనా వదిలిన ఆ మహమ్మారికి,  ఇప్పటికీ కోట్ల మంది బలవుతూనే ఉన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు, వ్యాక్సిన్ తయారుచేసే పనిలో పెద్ద దేశాలు బిజీగా ఉన్నాయి. మనదేశంలో కూడా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ వస్తే తొలి విడత 25 కోట్ల మందికి ఇచ్చే విధంగా ఏర్పాటుచేస్తామని, అందులో ముందుగా కరోనా వారియర్స్, వృద్ధులు, పిల్లలకు ఇస్తామని కేంద్రం కూడా ప్రకటించింది. ఇంతవరకూ బాగానే ఉంది.

 

కానీ, తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. బీహార్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రకటించిన, వ్యాక్సిన్ తాయిలమే దేశ ప్రజలలో కొత్త సందేహాలు రేపింది. తమ పార్టీకి ఓటు వేసి, ఆ పీఠమేదో తమకు అప్పగిస్తే.. కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామన్నది, నిర్మలమ్మ హామీల వరదలో వినిపించిన ఓ మహాప్రసాదం. అంటే ఆ ప్రకారంగా.. కేవలం బీహార్ ప్రజలకే, అది కూడా తన్మయత్వంతో కమలం పువ్వును వికసింపచేస్తేనే, ఆ రాష్ట్ర ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ప్రసాద భాగ్యం దక్కుతుందన్నమాట! లేకపోతే లేనట్లే లెక్క. మరి ఇతర రాష్ట్ర ప్రజలకు ఆ భాగ్యం లేదా?.. అన్న ప్రశ్నకు,  బీజేపీ మోతుబరి భూపీందర్ యాదవ్ చేసిన మరికొన్ని అమృతవాక్కులు, దేశ ప్రజలను మరింత గందరగోళానికి గురిచేశాయి.

 

వ్యాక్సిన్ అనేది ఉచితం కాదని, నామమాత్రపు ధరకు లభిస్తుందని, రాష్ర్టాలే ఈ ఖర్చును భరించాలని సదరు బీజేపీ మహా మంత్రి సెలవిచ్చారు. ఆ ప్రకారంగా బీహార్‌లో తాము అధికారంలోకి వస్తేనే, వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామన్నది కమలదళాల కవిహృదయమన్న మాట. అంటే.. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తారేమోనని,  భ్రమిస్తూ వచ్చిన వెర్రి వెంగళప్పల కళ్లను, కమలనేత్రాలు ఆ విధంగా తెరిపించాయన్నమాట. మరి ఇన్నాళ్లూ టీవీలో నరేంద్రుల వారిచ్చిన గంభీర ఉపన్యాసాలు. కొట్టిన చప్పట్లు.. వెలిగించిన కొవ్వొత్తుల మాటేమిటి? అంతా తూచ్చేనా?

 

కేంద్రం తీరు చూస్తే అదే డౌటనుమానం వస్తోంది మరి! రాదా మరి..? ఎందుకంటే.. కరోనా సీజన్‌లో మోదీ భయ్యా చప్పట్లు కొట్టమంటే, జనం గంటలు మోగించారు. కొవ్వుత్తులు వెలిగించమంటే, ఏకంగా దివిటీలే వెలిగించారు. మరి నరేంద్ర భయ్యా చెబితే ఇంత చేసిన జనాలకు, కమలం పార్టీ ఇచ్చే బహుమతి ఇదేనా? ఇప్పుడు కమలం పార్టీ ఇచ్చే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా  కావాలంటే, మళ్లీ ఎన్నికలు రావలసిందేనా? అప్పటివరకూ వ్యాక్సినుకు తెరవు లేదా? ఎన్నికలొచ్చే వరకూ కళ్లలో వత్తులేసుకుని, దేభ్యమొహాలతో ఎదురుచూడాల్సిందేనా?

 

ప్రజారోగ్యం బాధ్యత ప్రభుత్వానిదే అయినప్పుడు, మరి ఎవరి ఖర్మకు వారిని విడిచిపెట్టడం భావ్యమా? మరోపక్క.. వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని, కేంద్ర ఆరోగ్యమంత్రి సెలవిస్తున్నారు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? పార్టీ నేతదా? కేంద్రమంత్రిదా? హేమిటో.. ఈ కమలం కంగాళీయం! అయినా అవకాశవాద రాజకీయాలకు ఆమడదూరం.. ఇంకా చెప్పాలంటే వేల కిలోమీటర్ల దూరం ఉంటుందనుకునే,  భారతీయ జనతా భిన్నమైన పార్టీ అనే కడిగిన ముత్యానికి.. ఈ రాజకీయ పైత్యమేమిటన్నది దేశప్రజల ప్రశ్న.

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.