కమలానికి కాదేదీ అనర్హం.. కరోనా వ్యాక్సిన్ సైతం!

Publish Date:Oct 24, 2020

Advertisement

ఇంతకూ వ్యాక్సిన్ ఉచితమా? కాదా?

 

బీహార్ మేనిఫెస్టోతో కొత్త సందేహాలు

 

భారతీయ జనతా పార్టీ అంటే గంగానది అంత స్వచ్ఛమైనది. ఇంకా ఎక్కువ మాట్లాడితే గంగ కంటే స్వచ్ఛమైనది. దానికి రాజకీయాలు-అధికారం కంటే సిద్ధాంతం ముఖ్యం. రాజకీయ అవకాశవానికి అల్లంత దూరంలో ఉంటుంది. తుచ్ఛమైన రాజకీయ ప్రయోజనాల కోసం, అవసరార్ధ రాజకీయాలు చేయదు. వాజపాయ్ మాదిరిగా, అవసరమైతే అధికారమయినా వదులుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. అది.. అవసరార్ధ రాజకీయాలు, పూటకో మాట, రాష్ర్టానికో హామీ ఇచ్చే కాంగ్రెస్ పార్టీలా కాదు. కాంగ్రెస్ అనే రాజకీయభూతం, దేశంలో సృష్టించిన పుండాకోరు సంస్కృతిని కూకటివేళ్లతో పెకలించి, దాని భ్రష్ఠాచార-అవకాశ వాద రాజకీయాలకు.. చరమగీతం పలికేందుకు పుట్టిన పార్టీ బీజేపీ!

 

అంత పవిత్రమైన, అంత మంది పులుకడిగిన ముత్యాలున్న పార్టీ.. ఒక ఓటుతో అధికారాన్నే కాదనుకున్న పార్టీ... కేవలం ఒక్క రాష్ట్రంలో ఓట్ల కోసం అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతుందా? అసాధ్యం.. నెవ్వర్.. అసంభవ్.. కండిత ముడియాదు.. ఆగోదిల్ల.. హైలీ ఇంపాజిబిల్!!! అవును కదా?.. నిన్నటి వరకూ అంతా అలాగే ఫీలయ్యారు. కానీ కేంద్రమంత్రి నిర్మలమ్మ ప్రకటించిన, బీహార్ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో చూసిన తర్వాత.. అవకాశవాద రాజకీయాలు, అనుచిత హామీల తీరు చదివిన తర్వాత.. రాజకీయ జేజెమ్మ కాంగ్రెస్‌కే, కమలం పువ్వు పార్టీ దగ్గులు నేర్పుతుందనిపించక మానదు.
ప్రపంచం అంతా కరోనా వైరస్‌తో గజగజలాడుతోంది. శ్వేత సౌదాధిపతి, ప్రపంచపెద్దన్న ట్రంపు నుంచి.. భారత రెండవ పౌరుడయిన మన నెల్లూరు నాయుడు గారి వరకూ, కరోనా ఎవరినీ విడిచిపెట్టలేదు. పాపం దానికి కులాలు-మతాలు-హోదాలు-పదవులతో పనిలేదు.  ప్రపంచం మీదకు చైనా వదిలిన ఆ మహమ్మారికి,  ఇప్పటికీ కోట్ల మంది బలవుతూనే ఉన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు, వ్యాక్సిన్ తయారుచేసే పనిలో పెద్ద దేశాలు బిజీగా ఉన్నాయి. మనదేశంలో కూడా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ వస్తే తొలి విడత 25 కోట్ల మందికి ఇచ్చే విధంగా ఏర్పాటుచేస్తామని, అందులో ముందుగా కరోనా వారియర్స్, వృద్ధులు, పిల్లలకు ఇస్తామని కేంద్రం కూడా ప్రకటించింది. ఇంతవరకూ బాగానే ఉంది.

 

కానీ, తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. బీహార్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రకటించిన, వ్యాక్సిన్ తాయిలమే దేశ ప్రజలలో కొత్త సందేహాలు రేపింది. తమ పార్టీకి ఓటు వేసి, ఆ పీఠమేదో తమకు అప్పగిస్తే.. కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామన్నది, నిర్మలమ్మ హామీల వరదలో వినిపించిన ఓ మహాప్రసాదం. అంటే ఆ ప్రకారంగా.. కేవలం బీహార్ ప్రజలకే, అది కూడా తన్మయత్వంతో కమలం పువ్వును వికసింపచేస్తేనే, ఆ రాష్ట్ర ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ప్రసాద భాగ్యం దక్కుతుందన్నమాట! లేకపోతే లేనట్లే లెక్క. మరి ఇతర రాష్ట్ర ప్రజలకు ఆ భాగ్యం లేదా?.. అన్న ప్రశ్నకు,  బీజేపీ మోతుబరి భూపీందర్ యాదవ్ చేసిన మరికొన్ని అమృతవాక్కులు, దేశ ప్రజలను మరింత గందరగోళానికి గురిచేశాయి.

 

వ్యాక్సిన్ అనేది ఉచితం కాదని, నామమాత్రపు ధరకు లభిస్తుందని, రాష్ర్టాలే ఈ ఖర్చును భరించాలని సదరు బీజేపీ మహా మంత్రి సెలవిచ్చారు. ఆ ప్రకారంగా బీహార్‌లో తాము అధికారంలోకి వస్తేనే, వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామన్నది కమలదళాల కవిహృదయమన్న మాట. అంటే.. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తారేమోనని,  భ్రమిస్తూ వచ్చిన వెర్రి వెంగళప్పల కళ్లను, కమలనేత్రాలు ఆ విధంగా తెరిపించాయన్నమాట. మరి ఇన్నాళ్లూ టీవీలో నరేంద్రుల వారిచ్చిన గంభీర ఉపన్యాసాలు. కొట్టిన చప్పట్లు.. వెలిగించిన కొవ్వొత్తుల మాటేమిటి? అంతా తూచ్చేనా?

 

కేంద్రం తీరు చూస్తే అదే డౌటనుమానం వస్తోంది మరి! రాదా మరి..? ఎందుకంటే.. కరోనా సీజన్‌లో మోదీ భయ్యా చప్పట్లు కొట్టమంటే, జనం గంటలు మోగించారు. కొవ్వుత్తులు వెలిగించమంటే, ఏకంగా దివిటీలే వెలిగించారు. మరి నరేంద్ర భయ్యా చెబితే ఇంత చేసిన జనాలకు, కమలం పార్టీ ఇచ్చే బహుమతి ఇదేనా? ఇప్పుడు కమలం పార్టీ ఇచ్చే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా  కావాలంటే, మళ్లీ ఎన్నికలు రావలసిందేనా? అప్పటివరకూ వ్యాక్సినుకు తెరవు లేదా? ఎన్నికలొచ్చే వరకూ కళ్లలో వత్తులేసుకుని, దేభ్యమొహాలతో ఎదురుచూడాల్సిందేనా?

 

ప్రజారోగ్యం బాధ్యత ప్రభుత్వానిదే అయినప్పుడు, మరి ఎవరి ఖర్మకు వారిని విడిచిపెట్టడం భావ్యమా? మరోపక్క.. వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని, కేంద్ర ఆరోగ్యమంత్రి సెలవిస్తున్నారు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? పార్టీ నేతదా? కేంద్రమంత్రిదా? హేమిటో.. ఈ కమలం కంగాళీయం! అయినా అవకాశవాద రాజకీయాలకు ఆమడదూరం.. ఇంకా చెప్పాలంటే వేల కిలోమీటర్ల దూరం ఉంటుందనుకునే,  భారతీయ జనతా భిన్నమైన పార్టీ అనే కడిగిన ముత్యానికి.. ఈ రాజకీయ పైత్యమేమిటన్నది దేశప్రజల ప్రశ్న.

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.