ప్రజాకాంక్షలను విస్మరించడంలో కాషాయ దళం.. గులాబి దండు.. దొందూ దొందే..

Publish Date:Jul 4, 2022

Advertisement

 బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్బంగా రెండు రోజుల పాటు ఇటు బీజేపీ, అటు తెరాస హైదరాబాద్ వేదికగా రాజకీయ సర్కర్ చేశాయి. ప్రజలతో సంబంధం లేని విన్యాసాలెన్నో చేశాయి. ప్లెక్సీల యుద్ధం నుంచీ కేంద్రం సహాయం వరకూ ఇరు పార్టీలూ పరస్పర విమర్శలలో పోటీ పడ్డాయి.  కాషాయ దళం మొత్తం రావడం చుస్తే  గులాబి కోటని ఆక్రమించుకోవడానికి రాజు తన బలం తో సైన్యం తో వచ్చి తన బలం ఏమిటో చూపించి  నట్టు వుంది.

ఆదివారం  హైదరాబాద్ లో  జరిగిన భారతియ జనతా పార్టీ విజయ సంకల్పసభ లో ప్రధాన మంత్రి నరేంద్రమోడి మాటలమయజాలం తో అందర్నీమాయలో పడేసారు .మిణుగురు పురుగులు రాత్రి ఎగురుతూ  సూర్యుడిని కమ్మేసాం  అని ఆనంద పడతాయి, కానీ వాటికీ తెలియనిది ఏమిటంటే అవి సుర్యుని ముందు నిలబడలేవని అన్నటు సాగింది మోడీ ప్రసంగం, ఎవర్ని విమర్శించకుండా కేవలం 
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న,చేసిన,చేయబోయే  అభివృద్ధిపైనే మాట్లాడి తన మార్కు చతురత చూపించారు. తనపై ఎ న్ని విమర్శలు చేసినా ప్రధాని స్పందించకుండా తన దృష్టిలో కేసీఆర్ స్థాయి ఏమిలో చెప్పకనే చెప్పారు.   ఆదివారం  జరిగిన సభ మొత్తం లో కూడా ఎ క్కడా కేసీఆర్ గురించిగాని, గులాబి పార్టీ గురించి గాని   మాట్లాడకుండా,విమర్శలు చేయకుండా 
 తన ప్రసంగాన్ని ముగించారు.  సబ్ కా సాత్,సబ్ క వికాస్ నినాదం తో తెలంగాణా అభివృధి చేస్తాం అన్నారు. ఎనిమిదేళ్ల  పాలనలో అందరి సంక్షే మం కోసం కృషి చేస్తున్నాం,అభివృధి దేశం నలుమూలలా అందాలని చూస్తున్నాం.తెలంగాణాని అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీ అన్ని  విధాలా కృషి చేస్తోందన్నారు. డైనమిక్ తెలంగాణ అభివృద్ధికిక సదా కేంద్రం చేయూత ఉందని, ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఫ్లై ఓవర్లు, నీటి పారుదల ప్రాజెక్టులలో కేంద్రం సహాయం, సహకారం ఉందని స్పష్టం చేశారు.

 హైదరాబాద్ మహానగరం లో 1500 కోట్లతో 6  లేన్ల రహదార్లు  నాలుగు నిర్మిస్తున్నామని మోడీ చెప్పారు.  అలాగే ట్రాఫిక్ ఇబ్బందిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 350 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్ నిర్మింనుందన్నారు.  .తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అని ,అలా ఐతే నే వేగంగ అభివృధి జరుగుతుందని చెప్పారు. ఐతే  ఎంతసేపు ఏం చేస్తామో చెప్పారు. ఇంత వరకూ బానే ఉంది కానీ,   ప్రస్తుతం దేశం లో వున్న పరిస్థితులపై ఆయన మాట్లాడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరల పెరుగుదల, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పేదల నడ్డి విరిగేలా  ఇందనం దరలు,గ్యాస్ సిలండర్, నిత్యావసర వస్తువల ధరల  బాదుడుపై మోడీ పన్నెత్తి మాట్లాడలేదు. దీనిపై గులాబి శ్రేణులే కాకుండా సామాన్య జనం కూడా విమర్శిస్తున్నారు.  ఇదిలా ఉంచితే.. మోడీ ప్రసంగం ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెంప పెట్టుగా ఉందని, తనను తాను అతిగా ఊహించుకుని ఆకాసంలో విహరిస్తున్న కేసీఆర్ ను నేల మీదకు దింపి వాస్తవాన్ని ఎరుకపరిచిందని కాషాయదళం సంబర పడుతోంది. ఏకంగా ప్రధానికే ప్రసంగ అజెండా నిర్దేశించానంటూ తన భుజాలు తానే చరుచుకుని విర్రవీగిన సీఎం.. ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి అందించిన సహాయాన్ని, సహకారాన్ని అంగీకరించక తప్పని పరిస్థితుల్లో పడ్డారని కాషాయ శ్రేణులు అంటున్నాయి.

మరో వైపు మోడీ ప్రసంగం పలాయన వారి సంధి మంత్రంగా ఉందని గులాబి శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. కే సీ ఆర్ ప్రశ్నలకి సమధానం చెప్పలేక పోవడం వల్లే.. కాదు కాదు కేసీఆర్ ప్రశ్నలకు మోడీ వద్ద సమాధానం లేనందువల్లే ఆయన తన ప్రసంగంలో వాటి గురించి ప్రస్తావించలేదని  గులాబి శ్రేణులు అంటున్నాయి.  దేశం లో తెలంగాణా పోలీస్ వ్యవస్థ పటిష్టంగా  ఉంది కనుకనే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ను వేదిక చేసుకున్న కమల నాథుుల రాష్ట్రంలో శాంతి భద్రతలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నాయి.

 దేశ  ప్రధాని మోడీ కాదు మోళీ అని తెరాస శ్రేణులు సెటైర్లు విసురుతున్నాయి.  మొత్తం మీద బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో  బీజేపీ ఆడంబరం, టీఆర్ఎస్ దూకుడు రెండూ కూడా  కూడా ప్రజాకాంక్షలను ప్రతిబింబించడంలో విఫలమయ్యాయి. మొత్తం వ్యవహారాన్నంతా ఆధిపత్య ప్రదర్శనా పోరుగా మార్చేశాయి. సందట్లో సడేమియాలా కాంగ్రెస్ ఈ మొత్తం వివాదానికి దూరంగా మౌనంగా ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు అనివార్యం అనుకుంటున్న పరిస్థితుల్లో తెరాస నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతుండటం జనం బీజేపీ, తెరాసలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదా అన్న అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు. 
 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.