తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారా! తిరుపతిలో ఏం చేయబోతోంది?

Publish Date:Oct 1, 2020

Advertisement

తిరుపతి లోక్ సభకు త్వరలో జరగనున్న ఉప ఎన్నిక  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఢిల్లీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీ ఎంపీ మరణంతో జరగబోతున్న ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవచ్చని, బిజెపికి ఆ సీటును ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ హాట్ గా మారింది. నిజంగా టీడీపీ తిరుపతిలో పోటీ చేయకూడదని నిర్ణయించిందా.. బీజేపీకి మద్దతు ఇవ్వబోతుందా అన్న చర్చ రాజకీయ పార్టీలతో పాటు టీడీపీలోనూ జోరుగా జరుగుతోంది. తిరుపతిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పోటీ చేయకపోతే  అది సంచలనమే కాబోతోంది. ఏపీలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. 

 

తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయకుంటే.. అది ఆ పార్టీ చేసిన పెద్ద తప్పిదమవుతుందనే చర్చ రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. చంద్రబాబు అలాంటి నిర్ణయం తీసుకుంటే టీడీపీ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీడీపీ నేతలు సైలెంట్ అయి పోయారు. పార్టీలో, ప్రభుత్వంలో పదవులు అనుభవించిన నేతలు సైతం కనిపించకుండా పోయారు. దశాబ్దాల పాటు మంత్రులు చేసిన సీనియర్లు కూడా ప్రజలకు, టీడీపీ కేడర్ కు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఏపీలో టీడీపీ కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదు. అటు బీజేపీ మాత్రం పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అందివచ్చే అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటుంది. అలయాలపై దాడులు, టీటీడీ డిక్లరేషన్ వంటి విషయాల్లో దూకుడుగా వెళ్లారు కమలనాధులు. టీడీపీ నేతలు మాత్రం ప్రకటనలు, ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. 

 

టీడీపీలో నెలకొన్న స్థబ్దతతో  ఏపీలో ప్రస్తుతం రెండే పార్టీలు యాక్టివ్ గా ఉన్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబుకు వయసు మీద పడిందనే టాక్ కూడా వినిపిస్తోంది. టీడీపీ నేతలు ఎక్కడున్నారనే  డౌట్స్ కూడా ప్రజల నుంచి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ పోటీ చేయకపోతే.. ఆ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. తిరుపతి సీటును బీజేపీకి ఆఫర్ చేస్తే.. టీడీపిపై ప్రజల్లో ఉన్న రూమర్ నిజం చేసినట్లు అవుతుందని కొందరు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే టీడీపీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా బీజేపీ మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లవచ్చని, టీడీపీని టార్గెట్ చేయవచ్చనే అభిప్రాయం కూడా వస్తుంది. 

 

సహజంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. తిరుపతిలో చనిపోయిన సిట్టింగ్ ఎంపీ వైసీపీ వ్యక్తే. అంటే అక్కడ వైసీపీకి అధికార పార్టీతో పాటు సిట్టింగ్ ఎంపీ చనిపోయిన సానుభూతి కూడా ఉంటుంది. సో .. తిరుపతిలో విపక్ష పార్టీగా ఓడిపోయినా తెలుగుదేశానికి పెద్ద ఇబ్బంది ఉండదు. అధికారంతో పాటు సెంటిమెంట్ తో వైసీపీ గెలిచిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పోటీ చేయకపోతే వైసీపీని ఎదుర్కొనే సత్తా లేక పారిపోయిందనే విమర్శలు టీడీపీకి రావచ్చు. పార్టీకి భవిష్యత్ లో ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది. వైసీపీ ఆరోపిస్తున్నట్లే టీడీపీకి భవిష్యత్ లేదనే అభిప్రాయం జనాల్లోకి వెళ్లే అవకాశం ఉందనే ఆందోళన కొందరు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. 

 

బీజేపీ బలపడితే ఏపీలో టీడీపీకే ఎక్కువ ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిణామాలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. జాతీయ పార్టీ బలంగా ఉన్న మెజార్టీ రాష్ట్రాల్లో ఒక్క ప్రాంతీయ పార్టీనే నిలదొక్కుకోగలుగుతోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ లేదా బీజేపీలో ఏదో ఒకటే బలపడుతోంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది కాబట్టి జాతీయ పార్టీగా బీజేపీ బలపడే అవకాశం ఉంది. అదే సమయంలో ఒక్క ప్రాంతీయ పార్టీనే స్ట్రాంగ్ గా నిలబడవచ్చు. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి.. ఆ పార్టీకి ఢోకా ఉండకపోవచ్చు. ఎటొచ్చి బీజేపీ బలపడితే నష్టపోయేది టీడీపీనే. అందుకే టీడీపీని బలహీనపరుస్తూ ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి సపోర్ట్ చేస్తే.. టీడీపీ కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

 

సార్వత్రిక ఎన్నికల తర్వాత  బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాబు ఎంతగా ప్రయత్నించినా బీజేపీ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ రావడం లేదని కూడా తెలుస్తోంది. అయినా బిజెపి కేంద్ర పెద్దల దృష్టిలో పడేందుకు, అదేపనిగా వారిని పొగుడుతూ లేఖలు రాస్తూ సోషల్ మీడియాలో చంద్రబాబు హడావుడి చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారాలన్నీ తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం నచ్చడం లేదు. ఏపీలో క్షేత్రస్థాయిలో బలంగానే ఉన్నా, కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, మళ్లీ తప్పనిసరిగా పార్టీకి పునర్వైభవం వస్తుందని నమ్ముతున్నారు. అప్పటి వరకు చంద్రబాబు ఆగలేకపోతే ఎలా అంటూ సెటైర్లు వేస్తున్నారు. బిజెపిని నమ్ముకోవడం కంటే సొంతంగా పార్టీని పటిష్టం చేసే విషయంపై దృష్టిపెడితే మేలని కొందరు  టిడిపి నాయకులు అధినేతకు సూచనలు చేస్తున్నారు. 

 

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ చివరి వరకు రెండు కండ్ల సిద్ధాంతం వినిపించారు చంద్రబాబు. చివరకు అదే తెలంగాణలో టీడీపీకి శాపంగా మారింది.  బీజేపీ పొత్తు కూడా అక్కడ టీడీపీని దెబ్బ తీసింది.  బిజెపి బలంగా లేకపోయినా వారికి ఎక్కువ సీట్లు ఇవ్వడంతో పార్టీ దెబ్బతిన్నదని తెలంగాణ టీడీపీ నేతలే బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు ఏపీలోనూ అదే సీన్ కనిపిస్తోంది. టీడీపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా సోము వీర్రాజు టీమ్ కుట్రలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే ఏపీలోనూ టీడీపీకి తెలంగాణలో ఉన్న పరిస్థితి రావచ్చనే ఆందోళన కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. తిరుపతిలో బీజేపీకి సపోర్ట్ చేస్తే.. అది టీడీపీకి గుది బండగా మారుతుందని,  అలాంటి అవకాశం ఇవ్వొద్దని తమ్ముళ్లు చెబుతున్నారు

 

అసెంబ్లీలో ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా ఢీలా పడాల్సిన అవసరం లేదంటున్నారు కొందరు టీడీపీ నేతలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ 24 సీట్లకు పడిపోయినా.. తర్వాత పుంజుకుని అధికారం చేపట్టిందని  గుర్తు చేస్తున్నారు. 1989లో టీడీపీ ఓడిపోయినా.. తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష  హోదా కూడా రాకుండా మట్టి కరిపించిందని చెబుతున్నారు. ప్రజా సమస్యలు పోరాడుతూ ఉంటే చాలని, ఏపీలో టీడీపీదే మళ్లీ అధికారమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే.. చేజేతులా మరో పార్టీకి బలపడే అవకాశం ఇచ్చినట్లేనని చెబుతున్నారు.

 

మరోవైపు తిరుపతి ఉప ఎన్నికపై జరుగుతున్న ప్రచారాన్ని కొందరు టీడీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటున్నారు. గతంలోనూ ఇబ్బందులు వచ్చినా పార్టీని బలోపేతం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని, గెలుస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే టీడీపీపై వైసీపీ ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తుందని కూడా కొందరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని చర్చలు, ప్రచారాలు జరుగుతున్నా తిరుపతి ఉప ఎన్నిక విషయంలో చంద్రబాబు తీసుకోబోయే నిర్ణయం ఏపీ  రాజకీయాల్లో కీలకం కాబోతుందని తెలుస్తోంది. సో.. చంద్రబాబు టీడీపీని ఫణంగా పెట్టేలా తిరుపతిలో బీజేపీకి మద్దతిస్తారా.. లేక బరిలో ఉండి అధికార వైసీపీని ఢీకొడతారా చూడాలి మరీ.

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.