Publish Date:Jun 30, 2025
మొన్నటి వరకూ కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్రోగా ఉండే బీజేపీ అధ్యక్షుడంటూ ఒక గొడవ నడిచేది. అన్నట్టుగానే బీజేపీ తెలంగాణలో గట్టి పోటీ ఇవ్వలేక.. సెకండ్ ప్లేస్ టు థర్డ్ ప్లేస్ కి పడిపోయింది కమలం పార్టీ.
కట్ చేస్తే ఇప్పుడు రామచంద్రరావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్న పరిస్థితుల్లో ఆయన చంద్రబాబుకు అనుకూలుడు కాబట్టి ఆయన ఎన్నిక వెనక తెలుగుదేశం ఉందంటూ బీఆర్ఎస్ అప్పుడే మొదలు పెట్టేసింది. సోషల్ మీడియాలో ఈ తరహా పోస్టులు పెడుతూ హల్ చల్ చేస్తోంది.
ఇక్కడ బీఆర్ఎస్ గుర్తించాల్సింది ఏంటంటే చంద్రబాబుకు అనుకూలుడైన రామచంద్రరావు ఉండటం కూడా ఒకందుకు పార్టీకి మంచిదే కదా? వచ్చే రోజుల్లో ఏపీకి ఎన్డీయే కూటమి ఎలాగో సరిగ్గా అలాగే ఇక్కడ స్థానిక సంస్థలు, గ్రేటర్ ఎన్నికలు, ఆపై 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడానికి వెసలుబాటు ఉంటుంది కదా? ఈ విషయం ఎందుకు గుర్తించడం లేదు? అన్న కామెంట్ వినిపిస్తోంది.
గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన, బీజేపీ కూటమి కట్టి ఒక ఎన్నికలను ఎదుర్కున్నాయి. కానీ ఏమంత సక్సెస్ ఫుల్ ఆపరేషన్ జరగలేదు. కనీసం కూకట్ పల్లి వంటి ఆంధ్ర ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ఏరియాలో కూడా ఈ బాండింగ్ రిజల్ట్ ఇవ్వలేదు.
2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి విజయ దుందుభి మోగించాక కూటమి కంటూ కొంత బలం కనిపిస్తోంది. దాని ఫలితాలు క్రమంగా వచ్చేలా తెలుస్తోంది. ఇప్పటి వరకూ బీజేపీ తన పూర్తి సామర్ధ్యం కనబరచలేక పోయింది. మొదట నెట్ ప్రాక్టీస్ గా స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే, అది గ్రేటర్ తర్వాత అసెంబ్లీ ఎన్నికల వరకూ బండి లాగొచ్చు. అందుకు చంద్రబాబుకు అనుకూల నేత ఉండటం వల్ల ఆ పార్టీకి ఇంకా మేలు చేస్తుందే తప్ప కీడు చేయదు కదా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. మరి బీఆర్ఎస్ చేస్తున్న ఈ ప్రచారానికి కారణమేంటి?అంటే బీఆర్ఎస్ కి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ విలన్ చంద్రబాబే. చంద్రబాబును బూచిగా చూపించి నెగ్గుకు రావాలనే ప్రయత్నిస్తోంది. తన పార్టీ పేరులోని తెలంగాణ సెంటిమెంటును తీసేశాక కూడా ఈ ధోరణిలోంచి కారు పార్టీ బయటకు రావడం లేదన్నమాట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-telangana-chief-ramachandrarao-39-200949.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.