Publish Date:Jun 30, 2025
మొన్నటి వరకూ కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్రోగా ఉండే బీజేపీ అధ్యక్షుడంటూ ఒక గొడవ నడిచేది. అన్నట్టుగానే బీజేపీ తెలంగాణలో గట్టి పోటీ ఇవ్వలేక.. సెకండ్ ప్లేస్ టు థర్డ్ ప్లేస్ కి పడిపోయింది కమలం పార్టీ.
కట్ చేస్తే ఇప్పుడు రామచంద్రరావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్న పరిస్థితుల్లో ఆయన చంద్రబాబుకు అనుకూలుడు కాబట్టి ఆయన ఎన్నిక వెనక తెలుగుదేశం ఉందంటూ బీఆర్ఎస్ అప్పుడే మొదలు పెట్టేసింది. సోషల్ మీడియాలో ఈ తరహా పోస్టులు పెడుతూ హల్ చల్ చేస్తోంది.
ఇక్కడ బీఆర్ఎస్ గుర్తించాల్సింది ఏంటంటే చంద్రబాబుకు అనుకూలుడైన రామచంద్రరావు ఉండటం కూడా ఒకందుకు పార్టీకి మంచిదే కదా? వచ్చే రోజుల్లో ఏపీకి ఎన్డీయే కూటమి ఎలాగో సరిగ్గా అలాగే ఇక్కడ స్థానిక సంస్థలు, గ్రేటర్ ఎన్నికలు, ఆపై 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడానికి వెసలుబాటు ఉంటుంది కదా? ఈ విషయం ఎందుకు గుర్తించడం లేదు? అన్న కామెంట్ వినిపిస్తోంది.
గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన, బీజేపీ కూటమి కట్టి ఒక ఎన్నికలను ఎదుర్కున్నాయి. కానీ ఏమంత సక్సెస్ ఫుల్ ఆపరేషన్ జరగలేదు. కనీసం కూకట్ పల్లి వంటి ఆంధ్ర ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ఏరియాలో కూడా ఈ బాండింగ్ రిజల్ట్ ఇవ్వలేదు.
2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి విజయ దుందుభి మోగించాక కూటమి కంటూ కొంత బలం కనిపిస్తోంది. దాని ఫలితాలు క్రమంగా వచ్చేలా తెలుస్తోంది. ఇప్పటి వరకూ బీజేపీ తన పూర్తి సామర్ధ్యం కనబరచలేక పోయింది. మొదట నెట్ ప్రాక్టీస్ గా స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే, అది గ్రేటర్ తర్వాత అసెంబ్లీ ఎన్నికల వరకూ బండి లాగొచ్చు. అందుకు చంద్రబాబుకు అనుకూల నేత ఉండటం వల్ల ఆ పార్టీకి ఇంకా మేలు చేస్తుందే తప్ప కీడు చేయదు కదా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. మరి బీఆర్ఎస్ చేస్తున్న ఈ ప్రచారానికి కారణమేంటి?అంటే బీఆర్ఎస్ కి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ విలన్ చంద్రబాబే. చంద్రబాబును బూచిగా చూపించి నెగ్గుకు రావాలనే ప్రయత్నిస్తోంది. తన పార్టీ పేరులోని తెలంగాణ సెంటిమెంటును తీసేశాక కూడా ఈ ధోరణిలోంచి కారు పార్టీ బయటకు రావడం లేదన్నమాట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-telangana-chief-ramachandrarao-25-200950.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు