దక్షిణాదిన బలోపేతానికి బీజేపీ వ్యూహం!

Publish Date:Apr 19, 2025

Advertisement

పవన్ కు కేబినెట్ బెర్త్?
తెలుగుదేశంకు గవర్నర్ తాయిలం?

దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి సారించింది. ఉత్తరాదిన పాగా వేసిన బీజేపీకి దక్షిణాది కొరుకుడు పడటం లేదు. ఒక్క కర్నాటక వినా మరే దక్షిణాది రాష్ట్రంలోనూ ఆ పార్టీ ప్రజాదరణ పొందలేదు. దీంతో దక్షిణాదిలో పార్టీ పటిష్ఠతే లక్ష్యంగా కొత్త కొత్త వ్యూహాలు, ప్రణాళికలూ రచిస్తోంది. ఒక వైపు దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులో కొనసాగుతూనే సొంతంగా బలోపేతం కావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలోపేతానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చరిష్మాపై ఆధారపడటం అవసరమన్న నిర్ణయానికి వచ్చిన బీజేపీ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నది. వ్యూహరచన చేస్తున్నది. 

ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ను సెంట్రిక్ గా చేసుకుని తమిళనాడులో పాగా వేయాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఏపీలో తెలుగుదేశం కూటమిలో భాగస్వామ్య పార్టీగా కొనసాగుతూనే పవన్ కల్యాణ్ తోడ్పాటుతో సొంత బలం పెంచుకోవాలని భావిస్తున్నది.  భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను దగ్గర చేసుకోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ఏపీలో హిందుత్వకు బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కల్యాణ్ తనను తాను ఫోకస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా పవన్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.  అంతే కాకుండా కేంద్ర కేబినెట్ విస్తరణకు కసరత్తు చేస్తున్న మోడీ, తన కేబినెట్ లో జనసేన అధినేత పవన్ కు బెర్త్ ఆఫర్ చేసినట్లు బీజేపీ సన్నిహిత వర్గాల సమాచారం. పవన్ అందుకు అంగీకరించి.. కేంద్ర కేబినెట్ లోకి వెడితే.. ఏపీలో ఆయన సోదరుడు నాగబాబుకు కీలక కేబినెట్ బెర్త్ దక్కేలా తన ఇన్ ఫ్లుయెన్స్ ను ఉపయోగించాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది. 

అలా కాకుండా పవన్ ఏపీ కేబినెట్ లో నంబర్ 2గా, అంటే ఉప ముఖ్యమంత్రిగా కొనసాగడానికే మొగ్గు చూపితే.. ఆయన సేవలను తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా వినియోగించుకోవాలని యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కంటే తమిళనాట.. సినీ గ్లామర్ ప్రభావం రాజకీయాలపై అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.  అందుకే ఇప్పటికే పవన్  బీజేపీ కోరిక మేరకు తమిళనాడుకు సంబంధించినంత వరకూ వ్యూహాత్మకంగా అక్కడ అధికారంలో ఉన్న డీఎంకేకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారని చెబుతున్నారు.   

ఇక తెలుగుదేశం పార్టీకి కూడా బీజేపీ తాయిలాలు ఇచ్చి.. కేంద్రంలో మోడీ సర్కార్ కు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. సాధ్యమైనంత త్వరలో పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం చేయాలన్న ఉద్దేశంతో ఉన్న బీజేపీ.. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరిద్దరికి  గవర్నర్ పదవి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబుకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు.  పార్టీ నుంచి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో చంద్రబాబు ఇప్పటికే కసరత్తు మొదలెట్టారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద దక్షిణాదిలో బలపడటం కోసం బీజేపీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పైనే ఆధారపడి ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. జనసేన, తెలుగుదేశం పార్టీలతో సఖ్యత కొనసాగిస్తూనే ఆ రెండు పార్టీల తోడ్పాటుతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో పాగా వేయాలన్నది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
అసెంబ్లీ సాక్షిగా నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు.
ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత ఇటీవల పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భూముల వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలు, అప్పటి తన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవించక తప్పడం లేదు.
సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి? ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.