తెలంగాణపై బీజేపీ నజర్.. కేసీఆర్ కు ఇక చిక్కులు తప్పవా?

Publish Date:May 11, 2022

Advertisement

తెలంగాణ  లో బీజేపీయే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అన్న విశ్వాసాన్ని ప్రజలలో కల్పించే యత్నంలో బాగంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పార్టీ అగ్ర నేతలను రంగంలోనికి దింపుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ఉన్న అవకాశాలను అంచనా వేసిన అగ్ర నేతలకు కూడా అందుకు సుముఖంగా ఉన్నారు. తరచూ రాష్ట్ర పర్యటనలతో తెలంగాణ బీజేపీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.  

ఇప్పటికే బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన, ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు  రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచాయి. ఇక ఈ నెల 14న   అమిత్ షా రా ష్ట్ర పర్యటన ఈ కాకను మరింత పెంచే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.   తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందా? రాజకీయంగా బలపడటమే కాకుండా, కేంద్రంపై విమర్శలతో విరుచుకు పడుతున్న కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోందా? ఈ ప్రశ్నలకు బీజేపీ అగ్ర నేతలు ఒకరి వెంట ఒకరుగా తెలంగాణకు క్యూ కడుతుండటం చూస్తుంటే ఔననే సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించారు. మరి కొద్ది రోజులలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్ షా రానున్నారు. ఆ తరువాత ఈ నెల చివరిలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. వీరు కాకుండా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి వారు కూడా తరచుగా తెలంగాణలో పర్యటించేందుకు షెడ్యూల్ రూపొందించుకుంటున్నారు.  

తెలంగాణలో కేసీఆర్ పాలనలోని లోపాలను ఎత్తి చూపడమే కాకుండా.. రాష్ట్రంలో కమలం పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై వీరు రాష్ట్ర నాయకత్వానికి మార్గ నిర్దేశనం చేయనున్నారు. ఇప్పటికే గతంలో కంటే రాష్ట్రంలో బీజేపీ బలపడిందన్న అంచనాలు ఉన్నాయి. ఈటల రాజేందర్, రఘునందర్ వంటి వారి చేరికకు తోడు రానున్న రోజులలో మరి కొందరు ప్రముఖులు కూడా కాషాయి నీడన చేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.   కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి, కొండారెడ్డి త్వరలో బీజేపీలో చేరుతారని, వారి చేరికతో కమలం పార్టీ మరింత బలోపేతమౌతుందని అంటున్నారు.  రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేసేందుకు కూడా బీజేపీ అగ్రనాయకత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మిల్లర్ల మాయాజాలంపై ఎఫ్ సీఐ దర్యాప్తు మొదలు పెట్టింది. తనిఖీలు ముమ్మరం చేసింది.

దీని  ఆధారంగా సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే కాళేశ్వరం అవినీతిపై కూడా కేంద్రం దృష్టి సారించిందంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తన ఇటీవలి పర్యటనలో కేసీఆర్ కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని విమర్శించారు. కాళేశ్వరంలో అవినీతిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అవినీతిపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ చే దర్యాప్తు జరిపించాలన్న యోచనలో కేంద్రం ఉందని అంటున్నారు. త్వరలోనే కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తరచుగా చెబుతుండటమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇలా అన్ని వైపుల నుంచీ కేసీఆర్ ను చక్రబంధంలో బిగించే విధంగా బీజేపీ పావులు కదుపుతున్నది. వీటన్నిటినీ తట్టుకుని కేసీఆర్ జాతీయ స్థాయిలో తన ముద్ర వేసేలా ముందుకు సాగుతారా? అందుకు పరిస్థితులు అనుకూలిస్తాయా అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ముందు రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడంతో పాటు మరో మారు అధికారం చేజిక్కించుకునేందు వ్యూహాత్మకంగా బీజేపీకి దాసోహం అంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఏది ఏమైనా బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెక్ పెట్టే విధంగా వేగంగా అడుగులు వేస్తున్నదనడంలో సందేహం లేదు. ఎనిమిదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు వేగంగా ప్రజా మద్దతును కోల్పోతున్నారన్న అంచనాతో ఉన్న బీజేపీ ఇదే అదునుగా తన దూకుడు పెంచింది. అదే సమయంలో కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో బీజేపీ బలోపేతంపై దృష్టి సారించింది. దక్షిణాదిలో కర్నాటక వినా మరే రాష్ట్రంలోనూ బీజేపీకి ఇప్పటి వరకూ పట్టు చిక్కలేదు.

తొలి సారిగా తెలంగాణలో పట్టు సాధించే అవకాశాలు ఉన్నాయన్నది ఆ పార్టీ అగ్ర నేతల అంచనా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీజేపీ మద్దతు పలకడం, కాంగ్రెస్ వైఫల్యాలు, టీఆర్ఎస్ పట్ల ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకతలే అలంబనగా రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచింది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో అనూహ్యంగా పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకోవడం, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికలలో విజయం బీజేపీలో ధీమాను పెంచాయి. అదే సమయంలో పార్టీ అధిష్టానంలో తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించేలా చేశాయి. 

By
en-us Political News

  
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.