ఏపీలో రాష్ట్రపతి పాలన బీజేపీ స్కెచ్ నిజమేనా ?

Publish Date:Jul 20, 2022

Advertisement

నిజానికి, సంకీర్ణ ప్రభుత్వాలు అర్ధాంతరంగా కుప్ప కూలిపోవడం మహా రాష్ట్రతోనే మొదలు కాలేదు. అలాగే, మూకుమ్మడి పార్టీ ఫిరాయింపులకు శివసేన చీలిక వర్గం నేత, మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేనే శ్రీకారం చుట్టలేదు. మహారాష్ట్రకు ముందు కూడా రాష్ట్రాలలోనే కాదు కేంద్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలో ఆటల్ బిహారీ వాజ్’పేయి 13 నెలల ప్రభుత్వం, ఒకే ఒక్క ఓటు తేడాతో  కూలిపోయింది.

కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వం, పార్లమెంట్  ముఖం చూడకుండానే పడిపోయింది, అలాగే, కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన చంద్రశేఖర్, దేవెగౌడ, ఐకే గుజ్రాల్ ప్రభుత్వాలు కాంగ్రెస్ పుణ్యానే అర్ధాంతరంగా  కాలం చేశాయి. ఇందులో  ఏ ఒక్క ప్రభుత్వం కూడా కనీసం సంవత్సరం అయినా, నిలబడ లేదు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్న, మరుక్షణం సంకీర్ణ ప్రభుత్వాలు పేక మేడల్లా కూలిపోయాయి.  ఇక రాష్ట్రాల సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. కేంద్రంలో బీజేపే ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన తర్వాత గడచిన ఎనిమిది సంవత్సరాలలోనే ఎనిమిది ప్రభుత్వాలను తమ ఖాతాలో  కలిపేసుకుంది.

ఇక కాంగ్రెస్ జమానా కథ చెప్పాలంటే, చాలానే వుంది. కాంగ్రెస్ హయాంలో ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలలో కనీసం వంద సార్లకు పైగానే రాష్ట్రపతి పాలన విదించిన చరిత్ర కళ్ళ ముందే వుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ ఎలా కూల్చారు, నాదెండ్ల భాస్కర రావును ఎలా 30 రోజుల ముఖ్యమంత్రిని చేశారు తెలియంది కాదు. అది చరిత్ర.  అయినా, ఇప్పడు ఎక్కడ ఫిరాయింపుల ప్రస్తావన వచ్చినా  షిండే పేరే వినిపిస్తోంది. నిజానికి షిండే కొత్తగా చేసింది ఏమీ లేదు. నీవు నేర్పిన విద్యయే, అన్నట్లుగా 2019లో శివసేన అధినేత ఉద్దవ్ థాకరే చేసిందే, 2022 లో షిండే చేశారు. అయితే అప్పుడు ఆయన బీజేపీ, శివసేన కూటమిని ముక్కలు చేసి ముఖ్యమంత్రి అయితే, ఇప్పడు షిండే శివసేనను చీల్చి సీఎం అయ్యారు. అయినా అదేమిటో షిండేను ఫిరాయింపులకు పర్యాయపదం  అన్నట్లుగా చూస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య రెండున్నర గంటల ప్రెస్ మీట్ కనీసం ఓ అర్థ శతకం (50) సార్లకు పైగానే షిండే పేరు తలచు కున్నారు. తమిళనాడులోనూ అధికార డిఎంకేలో షిండే ఉన్నారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై బహిరంగగానే హెచ్చరికలు చేస్తున్నారు.  అదలా ఉంటే, రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే అయినా లేని ఏపీలోనూ బీజేపీ పౌరోహిత్యంలో షిండే సృష్టి జరుగుతోందని వార్తలొస్తున్నాయి. నిజమే, అధికార వైసీపీలో  అసంతృప్తి చాప కింద నీరులా చకచకా పాకుతోంది. మత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో తాజా మాజీ మంత్రులలో మొదలైన అసంతృప్తి మంటలు  వేగంగా విస్తరిస్తున్నాయని అంటున్నారు. మంత్రివర్గ  పునర్వ్యవస్థీకరణలో ముఖ్యమంత్రి కాదంటూనే కొందరు సీనియర్లకు  స్థానం కల్పించారు. అయితే, మంత్రి పదవులు ఇచ్చినా జూనియర్ మంత్రులకు ఇచ్చిన గౌరవం ఇవ్వకపోవడంతో, సీనియర్ మంత్రులలో చికాకులు ఎక్కువయ్యాయి. ఒక విధంగా తమకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకపోగా జూనియర్లకు ఎక్కువ గౌరవం ఇవ్వడంతో సీనియర్ మంత్రులు కొందరు షిండే వేషం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని అంటున్నారు. అలాగే, ఎమ్మెల్యేలలో అసంతృప్తితో పాటుగా అవమానంతో కూడిన అగ్రహం కూడా వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పని తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటుగా, హెచ్చరికలు చేస్తుంటే, ఎమ్మెల్యేలు ముఖ్యమత్రి పట్ల అసంతృప్తితో ఉన్నారు. అవకాశం చిక్కితే ఎగిరిపోయేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. 

ఈ నేపధ్యంలోనే, ఆ మధ్యన వైసీపీలోనూ షిండేలున్నారని అర్థం వచ్చేలా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారం రేపుతోంది. అధికార పార్టీలో సజ్జల వ్యాఖ్యలపై జోరుగా  చర్చ జరుగుతోంది. నిప్పులేకుండా  పోగ రాదని, అంటున్నారు. అయితే, ఎవరా షిండే అంటే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ప్రముఖంగా వినివస్తోంది అని అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి, జూనియర్ రోజా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో అదే పరిస్థితి. అయినా పెద్దిరెడ్డి గట్టిగా వ్యతిరేకించినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రోజాకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇప్పడు జిల్లా రాజకీయాల్లో జూనియర్ రోజాకు ఉన్న ప్రాధాన్యత సీనియర్ పెద్దిరెడ్డికి లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతోంది.  ఇలా పూలమ్మిన చోట  కట్టెలు అమ్మవలసి వస్తుంది ఉహించని పెద్దిరెడ్డి అసహనంతో రగిలి పోతున్నారని అంటున్నారు. అంతే కాకుండా, ఇప్పటికే బీజేపీతో టచ్‌లో ఉన్నారని, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. పెద్దిరెడ్డితో పాటుగా, జగన్ రెడ్డి బంధు వర్గానికి చెందిన మరో ఇద్దరు ముఖ్య నేతలతో కూడా బీజేపీ నాయకులు టచ్ లో ఉన్నారని అంటున్నారు.

ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కుటుంబ సభ్యులు, జిల్లా నేతలు, కార్యకర్తల వరకు అందరిలో గూడుకట్టుకున్న అసంతృప్తిని ఉపయోగించుకుని, బీజేపీ జగన్ సర్కార్ ను కూల్చే ప్రయత్నాలు మొదలు పెట్టిందని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, బీజేపీ ఏపీలో ప్రభుత్వాన్ని కూల్చితే కూల్చగలదేమో కానీ, మహారాష్ట్రలో లాగా ప్రత్యాన్మాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే,  బీజేపీ కోరుకుంటోంది కూడా అదేనని, రాజకీయ సంక్షోభం ఏర్పడితే, రాష్ట్రపతి పాలన అనివార్యమవుతుందని, అదే జరిగితే. ఆ తర్వత కథ మరోలా ఉంటుందని అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం, రాజధాని సమస్యకు పరిష్కారం చూపడం, విభజన హామీల అమలు .. ఇలా చేతిలో ఉన్న పనులు కానిచ్చి .. రాష్ట్రంలో పాగా వేయడం బీజేపీ నాయకుల వ్యూహంగా చెపుతున్నారు. అయితే .. అన్నీ అనుకున్నట్లు  జరుగుతాయా అంటే అది ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. కానీ, జగన్ ప్రభుత్వం నిండా అయిదేళ్ళు అధికారంలో కొనసాగడం మాత్రం అయ్యే పనిగా కనిపించడం లేదని అంటున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గడువును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు,అదే విధంగా శ్రీలంక  పరిణామాలపై చర్చకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో, ఏపీ ప్రభుత్వం అప్పుల చిట్టాను ఎత్తి చూపడం, స్వయంగా ప్రధాన మంత్రి ఉచిత హామీల విషయంగా చేసిన హెచ్చరికలు, ఇలా ఒకదాని తర్వతా ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిష్తే.. ఏదో జరుగుతోందనే అనుమనాలు మాత్రం బలపడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.