Publish Date:Aug 17, 2022
పిల్లాడికి పౌష్టికాహారం పెడుతున్నా ఎత్తు పెరగడం లేదని తలిదండ్రులు బాధపడ్డారు. ఒకరోజు ఎక్కడో విని ఒక టేపు కొని రెండు నెలలకోసారి వాడిఎత్తు కొలవనారంభించారు. హాల్లో గోడమీద స్కేలు గీతలు చూసి తెలిసినవారికీ అర్ధమయింది. కానీ పక్కింటివారిని పిలిచి మీరు మీ పిల్లాడి ఎత్తు గురించి ఆలోచిం చమని చెప్పలేదు. ఎవరయినా తమ అభివృద్దిని అంచనా వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ తెలంగాణాలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు కూలబోతున్నదీ బీజేపీ వారు లోకానికి తెలియజేసే గడియా రాన్ని ఏ ర్పాటు చేశారు. గతంలోనూ ఇలాంటి కార్యక్రమం చేపట్టి ఈసీ నుంచి మొట్టికాయలు వేయించు కున్నారు. అక్కడితో వారి ప్రయత్నాలు మానుకున్నారు. ఇప్పుడు మళ్లీ మొదలెట్టారు. మద్దతు నిచ్చే వారు పేర్లు రిజిస్టర్ చేసుకోవాలనీ కోరుతున్నారు.
మళ్లీ 'సాలు దొర.. సెలవు దొర' అంటూ బీజేపీ డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసింది. కేసీఆర్ పాలనకు కౌం ట్ డౌన్ పేరుతో బీజేపీ ఆఫీస్ దగ్గర డిజిటల్ బోర్డును ఏర్పాటు చేశారు. డిజిటల్ బోర్డును బీజేపీ ఇంఛార్జ్ తరు ణ్ చుగ్ ప్రారంభించనున్నారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారంటూ డిజిటల్ బోర్డులను జీహెచ్ఎంసీ అధికారులు నిలిపివేశారు. ఈసారి బీజేపీ ఆఫీస్ ప్రహారీ గోడ లోపల డిజిటల్ బోర్డ్ ఏర్పా టు చేసినట్లు బీజేపీ తెలిపింది. ఐరన్ పిల్లర్ నిర్మించి డిజిటల్ బోర్డ్ను ఏర్పాటు చేసినట్లు కమలం పార్టీ స్పష్టం చేసింది.
కేసీఆర్ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం, అధికారపీఠం ఎక్కడం మాత్రమే బీజేపీకి తెలంగాణా లక్ష్యంగా మా రింది. ఆమధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ‘సాలు దొర - సెలవు దొర’ ప్రచా రాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. ఈ ప్రచారంపై ఈసీ అభ్యం తరం వ్యక్తం చేసింది. ఈ ప్రచారంపై ఈసీకి టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయలేదు. అయితే, ఈ ప్రచారానికి అను మతి కోసం బీజేపీ పార్టీ చేసిన అభ్యర్థనతోనే ఈసీ ఈ క్యాంపెయిన్ గురించి పరిశీలించి నిలిపి వేయా లని ఆదేశించింది. సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేసీఆర్ ఫొటోలతో పోస్టర్లు ముద్రిం చేందుకు బీజేపీ అనుమతి కోరగా.. ఎన్నికల సంఘం నిరాకరించింది. అలా చేసేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. సీఎం ఫొటోతో బీజేపీ పోస్టర్లు ముద్రించేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రచా రంపై బీజేపీ ఓ వెబ్సైట్ను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు దూకుడైన నిర్ణయాలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా కొంత కాలంగా ‘సాలు దొర - సెలవు దొర’ క్యాంపెయిన్ను ప్రారంభించింది. అటు.. టీఆర్ఎస్ కూడా నేరుగా ప్రధాని మోదీపై విమర్శలు కురిపిస్తూ ఈ ప్రచారాన్ని తిప్పికొడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-seethaiah-39-142061.html
రఘురామకృష్ణం రాజు.. పరిచయం అక్కర్లేని పేరు. గత నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వ అరాచకాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వ్యక్తి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన రఘురామకృష్ణం రోజు.. ఆ తరువాత కొద్ది రోజులకే జగన్ విధానాలతో విభేదించి రెబల్ గా మారారు. నిత్యం జగన్ అరాచకపాలనను విమర్శిస్తూ వచ్చారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను క్యాట్ కొట్టేసింది. తనను రెండో సారి జగన్ సర్కార్ సస్పెండ్ చేయాడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెచ్చి జగన్ ఏపీ ప్రజల భూములను దోచుకోవడానికి ప్లాన్ వేశారంటూ పెద్దయెత్తున ప్రచారం చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టమని, దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని వైసీపీ చెబుతున్నప్పటికీ అది ఎంత మేరకు రైతుల మైండ్ కు చేరుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న
ఈ ఎన్నికలలో ఎవరైనా ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈ క్రింది విషయాలను ఒప్పుకున్నట్లే అని సోషల్ మీడియాలో ఒక బాధ్యతగల పౌరుడు స్పందించాడు. నిప్పులాంటి నిజాలను గుర్తు చేశాడు.
వైసీపీకి ఇవే చివరి ఎన్నికలంటూ అభ్యర్థి కాకర్ల సురేష్ తన దైన స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ టీడీపీ కూటమికే జైకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే, అన్నీ సర్వేల్లో తేలిపోయింది. ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానని, ఉదయగిరి కోటను, సిద్దేశ్వరం, శ్రీ వెంగమాంబ టెంపుల్, గండిపాలెం రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా మార్చి ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు సురేష్ హామీలు ఇస్తున్నారు.
వైసీపీలో కొన్ని రోజుల నుంచీ ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి, కీలక నేతలైన విజయసాయిరెడ్డి వంటి వారి వరకూ అందరూ అన్యాపదేశంగా తమ పార్టీ ఓటమి తథ్యమన్న సంకేతాలే ఇస్తున్నారు. ముందుగా జగన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లపై నమ్మకం పోయిందంటూ చేతులెత్తేశారు.
రాజకీయంగా సీనియర్ కూడా అయిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తన మార్కు రాజకీయాలు చేస్తున్నారు. బాలశౌరికి రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది. ముఖ్యంగా ప్రజలను తనవైపు తిప్పుకోవడంలోనూ ఆయన నేర్పుగా ముందుకు సాగుతారనే పేరు తెచ్చుకున్నారు.
గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందన్నది సామెత. సినీ పరిశ్రమలు అన్ని విధాలుగా అవమానించిన ఏపీ సీఎం జగన్ కు సరిగ్గా ఎన్నికల వేళ ఆ సినీ పరిశ్రమ నుంచి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సినీ పరిశ్రమ నుంచి ఒక్కరొక్కరుగా జగన్ కు వ్యతిరేకంగా జనసేనానికి మద్దతుగా బయటకు వచ్చి గొంతు విప్పుతున్నారు.
చినుకు పడితే హైదరాబాద్ జంటనగరాలు చిగురుటాకులా వణికిపోవడం కొత్త కాదు. ప్రతి ఏటా వానాకాలంలో భాగ్యనగర వాసులు నరకం చూడటమూ కొత్త కాదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం(మే7)న కురిసిన వర్షంతో భాగ్యనగరం కాస్తా భాగ్యనరకంగా మారిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలంగాణ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాయపడ్డారు. ఎన్నికలకు గట్టిగా ఐదు రోజుల సమయం కూడా లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూనే, కూటమి అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పవన్ కూటమి శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రసంగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత కాలం ఓ నమ్మకం ఉండేది. తాను ఎంత అరాచకపాలన సాగించినా, ఎంత ఆర్థిక అవకతవకలకు పాల్పడినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ తనకు అండగా నిలుస్తారనీ, ఎన్నికల గండం నుంచి గట్టెక్కిస్తారని. అయితే తెలుగుదేశం, జనసేనతో ఏపీలో బీజేపీ జతకట్టడంతో ఆ ఆశలు అడియాసలయ్యాయి.
ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శరంగా జరుగుతాయన్న నమ్మకం జగన్ లో పోయింది. తనకు అనుకూలంగా, తన అనుకూల అధికారుల కనుసన్నలలో, తన కోసం తానే సృష్టించుకున్న వాలంటీర్ల వ్యవస్థ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలను ఎన్నికల సంఘం చర్యల కారణంగా భ్రష్టుపట్టిపోతున్నాయని జనగ్ ఇప్పుడు ఊరూవాడా కోడై కూస్తున్నారు.