మరీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్సా.. ఇలా అయితే కష్టమే!

Publish Date:Nov 28, 2024

Advertisement

రాష్ట్రంలో బీజేపీ వేగంగా విస్తరిస్తోంది.  తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారు.   బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాల చేదు జ్ణాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి.  ఇప్పుడు తెలంగాణ ప్రజలు బీజేపీవైపు ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు.. తెలంగాణ‌లో రాబోయేది బీజేపీ పాల‌నే. ఇది ప్రజల అభిప్రాయం ఔనా కాదా అన్నది పక్కన పెడితే..   ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ట్విట‌ర్ వేదిక‌గా పేర్కొన్న మాట మాత్రం నిజం.  ఆయన తెలంగాణలో బీజేపీ వేగంగా విస్తరిస్తోందంటూ సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడానికి ముందు  బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో ఆయన  భేటీ అయ్యారు. అర్ధగంట పాటు జ‌రిగిన ఈ భేటీలో, తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చేది మ‌న‌మే అంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్ర‌ధాని వ‌ద్ద ప‌దేప‌దే ప్ర‌స్తావించారు. దీంతో ప్ర‌ధాని సైతం ఇంకేముంది  అంద‌రూ క‌లిసిక‌ట్టుగా పార్టీ బ‌లోపేతంకు కృషి చేస్తున్నార‌న్న నిర్ణయానికి వచ్చేశారు. తనను కలిసిన తెలంగాణ నేతలను శభాష్ అంటూ భుజం తట్టి అభినందించారు.  తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్ర‌భుత్వ‌మేన‌ని ఆయనలో ఓ ధీమా ఏర్పడిపోయింది. దాని ఫలితమే సోషల్ మీడియాలో ఆ పోస్టు.

అయితే  వాస్త‌వంగా రాష్ట్ర బీజేపీలో మాత్రం ప‌రిస్థితి ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా ఎవ్రీ ధింగ్ ఈజ్ నాట్ వెల్ అన్నట్లుగా ఉంది. రాష్ట్ర పార్టీలోని వ‌ర్గ‌విబేధాలు ఆ పార్టీకి శాపంగా మారుతున్నాయి. ఎవ‌రికి వారు పార్టీ అధినేత‌లం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముఖ్యంగా ఎంపీలుగా విజ‌యం సాధించిన వారిలో కొంద‌రు అధిష్టానం నిర్ణ‌యానికి విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ారు. ఆ విషయాన్ని పార్టీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి.  కొంద‌రు ఎంపీలు కేవ‌లం మీడియాలో హైలెట్ కావ‌డానికే ప్రాధాన్య‌త‌నిస్తున్నారు తప్ప క్షేత్ర స్థాయిలో పార్టీ బ‌లోపేతంపై దృష్టిసారించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.  

తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతోందని ఆ పార్టీ నేతలు ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా, వర్గ పోరు కారణంగా రాష్ట్రంలో బీజేపీ పురోగతి ఒక అడుగు ముందుకు  రెండడుగులు  వెనక్కు అన్న చందంగానే తయారైంది. నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌విబేధాల నేప‌థ్యంలో అధిష్ఠానం రాష్ట్రంలో పార్టీ పటిష్ఠత అనే విషయాన్నే గాలికి వదిలేసినట్లు కనిపిస్తోంది.   గ‌త ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం వ‌ర‌కు బీజేపీ నేత‌ల మ‌ధ్య ఐక్య‌తారాగం క‌నిపించింది. బీఆర్ఎస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం మేమే అని బీజేపీ నేతలు ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల్ల రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితి మూడోస్థానానికి పడిపోయింది. కాదు కాదు దిగ‌జారిపోయింది.  అసెంబ్లీ ఎన్నిక‌లకు కొద్దిరోజుల ముందు అప్పటి వరకూ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న బండి సంజ‌య్‌ను తప్పించడంతో  పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. మ‌రోవైపు ఎన్నిక‌ల్లో తెలుగుదేశంతో క‌లిసి పోటీచేసే విష‌యంలో  రాష్ట్ర పార్టీ నేత‌లు కొందరు వ్య‌తిరేకించారు. అయితే ఎన్నిక‌ల త‌రువాత  తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకపోవడం త‌ప్ప‌ని రుజువైంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన  పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో బీజేపీ ఒకింత   మెరుగైన ఫ‌లితాలు సాధించిన‌ప్ప‌టికీ.. ఆ ఘ‌న‌త పూర్తిగా మోడీ ఖాతాలో పడింది. ఆ విజయంలో పార్టీ రాష్ట్రనాయకత్వం ఘనత ఏమీ లేదని పరిశీలకులు విశ్లేషించారు.  

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌రువాత రాష్ట్ర‌ బీజేపీలో నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌విబేధాలు తీవ్ర‌రూపం దాల్చాయి. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను కొంద‌రు బీజేపీ నేత‌లు వ్య‌తిరేకించ‌గా.. మ‌రికొంద‌రు ప్ర‌శంసించారు. దీంతో ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను విమ‌ర్శించాలా.. ప్ర‌శంసించాలా అనే అంశంపై పార్టీ శ్రేణుల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన మూసీ ప్ర‌క్షాళ‌న విష‌యంలో బీజేపీ రాష్ట్ర నేత‌లు రెండు వ‌ర్గాలు విడిపోయారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కొంద‌రు, అనుకూలంగా కొంద‌రు మాట్లాడుతూ వ‌చ్చారు. తాజాగా, రాష్ట్ర అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు రాత్రి నిద్ర కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మం సైతం పార్టీకి ఆశించిన మైలేజ్ ను ఇవ్వ‌లేదు. మ‌రోవైపు రైతు రుణ‌మాఫీ విష‌యంలోనూ ప్ర‌భుత్వంపై గ‌ట్టిగా పోరాడ‌టంలో బీజేపీ నేత‌లు విఫ‌ల‌మ‌య్యార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. రైతుల ప‌క్షాన‌ నిల‌బ‌డి పోరాడుతూ ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచ‌డంపై బీజేపీ రాష్ట్రనాయకత్వం ఏమాత్రం దృష్టిసారించ‌లేద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ బ‌ల‌హీనంగా ఉంది. రైతు రుణ‌మాఫీ అమ‌లు విష‌యంలో ప్ర‌భుత్వంపై రైతుల్లో నెల‌కొన్న వ్య‌తిరేక‌త‌ను స‌ద్వినియోగం చేసుకొనేందుకు బీజేపీ నేత‌లు ఏమాత్రం ప్ర‌య‌త్నించ‌క పోవ‌టం ప‌ట్ల ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్ర‌హం వ్య‌క్తమ‌వుతున్నది. అయితే  డిసెంబ‌ర్ నుంచి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించేందుకు బీజేపీ నేత‌లు కార్యాచ‌ర‌ణ రూపొందించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని అయినా స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హిస్తే కాస్త‌యిన ప్ర‌జాద‌ర‌ణ ల‌భించే అవ‌కాశం ఉంటుంది.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిని మార్పుచేసే యోచ‌న‌లో కేంద్ర పార్టీ అధిష్టానం నిమ‌గ్న‌మైంది. ప్ర‌స్తుతం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా కిష‌న్ రెడ్డి ఉన్నారు. ఆయ‌న కేంద్ర మంత్రిగానూ కొన‌సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న స్థానంలో కొత్త అధ్య‌క్షుడిని నియ‌మించడంపై  అధిష్టానం దృష్టిసారించింది. ఈ క్ర‌మంలో ప‌లువురు నేత‌లు అధ్య‌క్ష  స్థానం కోసం పోటీప‌డుతున్నారు. అయితే అందరికీ ఆమోదయోగ్యమైన నేతను ఎంపిక చేయడంలో పార్టీ పెద్ద‌లు విఫ‌ల‌మ‌వుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్ ఉన్నా.. ఆయనకు ఆ పదవి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. ఈటల రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని బీజేపీలోని ఓ వ‌ర్గం నేత‌ల‌తోపాటు. బీజేపీలోని కోర్ హిందూ వాదులు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు  గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. మొద‌టి నుంచి బీజేపీలో ఉంటూ.. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ‌ల్లో ప‌నిచేసిన నేత‌కు రాష్ట్ర పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని పార్టీలోని మెజార్టీ నేత‌లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం. అయితే  మొత్తానికి రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌విని ద‌క్కించుకునే క్ర‌మంలో నేత‌లు వ‌ర్గాల వారిగా విడిపోవ‌డంతో.. పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు తీవ్ర స్థాయికి చేరాయ‌ని పార్టీ శ్రేణులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర బీజేపీలో  ఇన్ని సమస్యలతో సతమతమౌతున్నా, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టడం మానేసి  రాబోయే కాలంలో తెలంగాణ‌లో బీజేపీ అధికారం అని బీజేపీ ప్ర‌తినిధుల‌తోపాటు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీసైతం పేర్కొన‌డం ఆత్మ విశ్వాసం కాదనీ, అతి విశ్వాసమనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి.  వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి బీజేపీ అధికారంలోకి వ‌చ్చేంత స్థాయిలో బ‌ల‌ప‌డాలంటే ముందు పార్టీలో నెల‌కొన్న వ‌ర్గ విబేధాల‌కు స్వ‌స్తి చెప్పాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అది మానేసి మాదే అధికారం అన్న అతిశయంతో, అతి విశ్వాసంతో వ్యవహరిస్తే అధికారం మాట అటుంచి, రాష్ట్రంలో పార్టీ ఉనికి కూడా కష్టమేనని చెబుతున్నారు. 

By
en-us Political News

  
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.