ఇదేం రుబాబు రఘునందనా?

Publish Date:Mar 15, 2025

Advertisement

తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసు లేఖల అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ సారి బీజేపీ ఎంపీ రఘునందనరావు ఈ విషయాన్ని లేవనెత్తారు. తిరుమల గడ్డపై నిలబడి రుబాబు చేశారు. తెలంగాణ భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యం చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోనికి తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీకి, ఆంధ్రప్రదశ్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అల్టిమేటమ్ జారీ చేసినట్లుగా మాట్లాడారు. ఈ వేసవి సెలవుల్లో తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను టీటీడీ అంగీకరించకపోతే.. తెలంగాణ ప్రజాప్రతినిథులం అందరం తిరుమల వచ్చి చేయగలిగింది చేస్తామని హెచ్చరించారు. అసలాయన ఎక్కడి వారు, ఎక్కడకు వచ్చి ఏం మాట్లాడారు? అంటూ నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి పద్మారావు వంటి వారు కూడా తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసు లేఖలను అనుమతించాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ కూడా రాశారు. ఆ లేఖపై సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం ఫిబ్రవరి నుంచి తెలంగాణ ప్రజాప్రతినిథుల లేఖలను తిరుమలలో పరిగణనలోనికి తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

ఇప్పుడు తాజాగా మార్చి నెల సగం గడిచిపోయిన తరువాత కూడా తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫా రసు లేఖను టీటీడీ పరిగణనలోనికి తీసుకోవడం లేదంటూ రఘునందనరావు తిరుమలలో రుబాబు చేశారు. శుక్రవారం (మార్చి 14)న ఆయన తిరుమలేశుని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిథి హోదాలో ఆయనకు టీటీడీ ప్రొటోకాల్ దర్శనం కల్పించింది. అయితే ఆయన సిఫారసు లేఖలకు అనుమతిపై ఏపీ సర్కార్, టీటీడీపై విమర్శలు గుప్పించడమే కాకుండా హెచ్చరిక కూడా జారీ చేశారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  రాష్ట్రంలోని మొత్తం 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీల సిఫారసు లేఖలను టీటీడీ అనుమతించేది. వారి సిఫారసు లేఖల మేరకు భక్తులకు దర్శనం కల్పించేది. అయితే రాష్ట్ర విభజన తరువాత  తిరుమలలో  తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను అనుమతించాలా వద్దా అన్నది పూర్తిగా టీటీడీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిం చుకోవలసిన అంశం. దీనిపై పొరుగు రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిథులు రుబాబు చేయడం పూర్తిగా అనుచితం అంటూ నెటిజనులు ఓ రేంజ్ లో రఘునందనరావుపై విరుచుకుపడుతున్నారు. 

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో కేవలం పది శాతం మంది భక్తులకు మాత్రమే రాష్ట్రప్రజాప్రతినిథుల లేఖల ద్వారా బ్రేక్, ప్రత్యేక ప్రవేశ దర్శనం లభ్యమౌతోంది. మిగిలిన 90శాతం మందీ కూడా సామాన్య భక్తులే. అయినా టీటీడీలో శ్రీవారి దర్శనం కోసం రాష్ట్రాల వారీ కోటా ఏమీ లేదు. మరి ఈ విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిథులు తమ లేఖలను పరిగణనలోనికి తీసుకోవాలంటే హఠం చేయడం ఎంత వరకూ సబబు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అన్న తేడా లేకుండా తిరుమలేశుని దర్శనం కోసం టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రాల వారీ రిజర్వేషన్లు ఏమీ ఉండవు. అంటే తెలంగాణ భక్తులు కానీ మరో రాష్ట్రం భక్తులు కానీ తిరుమలేశుని దర్శనం విషయంలో వివక్షకు గురి కావడం లేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ వాసులకు ప్రత్యేక వెసులుబాటు కూడా ఏమీ లేదు. 

తెలంగాణ ప్రజా ప్రతినిధులు తిరుమల వచ్చిన సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ప్రొటోకాల్ దర్శనం కల్పిస్తోంది. ఇప్పుడు రఘునందరనావు కూడా కుటుంబ సమేతంగా  వతిరుమలలో  వీఐపీ దర్శనం చేసుకున్నారు. ఇక సిఫారసు లేఖలను కూడా అనుమతించాలని పట్టుబట్టడంలో అర్ధం లేదని నెటిజనులు విమర్శిస్తున్నారు. సామాన్య భక్తులకు సత్వర దర్శన భాగ్యం కల్పించడంపైనే టీటీడీ దృష్టి సారించాలని కోరుతున్నారు. రఘునందనరావు తిరుమలలో చేసిన రుబాబు ఆయన స్థాయికి తగినట్లుగా లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.  

By
en-us Political News

  
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ ను మోకాళ్లపై నిలబెట్టామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రాజస్థాన్ లోని బికనూర్ లో గురువారం (మే 22) ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందన్నారు.
మాజీ ఐఏఎస్ అధికారి గోపిశెట్టి నాగేశ్వరరావు (జీఎన్ రావు) బుధవారం (మే 21) కన్నుమూశారు. ఆయన వయస్సు 77 సంవత్సరాలు. హైదరాబాద్ కుందన్ బాగ్ లోని తన స్వగృహంలో ఆయన గుండెపోటుతో మరణించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక బ్యారేజీలో రెండు పగుళ్లు వస్తే ఏదో అయినట్లు చేస్తున్నారు. మేడిగడ్డ పగుళ్లకు బహుశా కాంగ్రెస్ నాయకులు బాంబులు పెట్టారని అనుమానం వస్తోందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశంపార్టీ ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు కడపలో నిర్వహించనున్న పార్టీ పండుగ మహానాడులో తెలంగాణ పార్టీ నేతలకు సముచిత స్థానం ఇచ్చింది. మహానాడు కోసం వేసిన 19 కమిటీలలోనూ తెలంగాణ తెలుగుదేశం నేతలకు స్థానం కల్పించింది.
సీఎం రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి హోదాలో రెండవసారి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు.
నూతన రేషన్ కార్డు పొందాలంటే వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరి అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రేషన్ కార్డుల జారీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యారేజ్ సర్టిఫికెట్ గానీ, పెళ్లి పత్రిక గానీ, వివాహానికి సంబంధించిన ఫొటోలు గానీ అవసరం లేదని ఆయన తెలిపారు
వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా, ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ సర్వం తానై చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కర్మఫలం అనుభవించడానికి రెడీ కాక తప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
ప్రజా సమస్యలు పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చేపట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.
ఇప్ప‌టి వ‌ర‌కూ కేంద్ర మంత్రిగా కిష‌న్ రాష్ట్రానికి చేసిన మేలు ఏంట‌న్న‌ది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొద‌లు పెడితే టీపీసీసీ  చీఫ్ మ‌హేష్ గౌడ్ వ‌ర‌కూ అంద‌రూ అడిగి చూశారు. నో ఆన్స‌ర్. ఇక రాజాసింగ్ ని అడిగితే కిష‌న్ రెడ్డి కిరికిరిల‌న్నీ ఇట్టే బ‌య‌ట పెట్టేస్తారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈడీ రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తుందంటూ సర్వోత్న న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని జస్టిస్ గవాయి మండిపడ్డారు.
విజయనగరం టెర్రర్‌ మాడ్యూల్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్‌ కన్ఫెషన్ రిపోర్ట్ బయటకు రావడంతో ఒక్కసారిగా కేసులో క్లారిటీ వస్తోంది. సిరాజ్ , హైదరాబాద్‌కు చెందిన సమీర్, వరంగల్‌కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బాదర్‌తో కలిసి ఉగ్రవాద గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
అరెస్టు చేయడానికి వచ్చినపుడు బయట పోలీసుల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. అది చూసి నిందితుడు రెచ్చిపోయి, ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తాడు. అరెస్టు చేసి సెల్ లో వేశాకా, పోలీస్ మర్యాద మరో రకంగా ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.