Publish Date:Oct 10, 2025
కామారెడ్డి నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి చిప్పు చెడిపోయిందేమో తెలీదుగానీ, ఓసీలకు కూడా రిజర్వేషన్ కావాలంటున్నారాయన. ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీ మీదున్న అపవాదు అంతా ఇంతా కాదు. ఇప్పటికే ధర్మపురి అరవింద్ వంటి వారు తాజాగా చేసిన కామెంట్లు బీజేపీ మీద యాంటీ బీసీ ముద్ర వేస్తున్నాయి. అది చాలదన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ తాజా వ్యాఖ్యలు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.
రిజర్వేషన్ల వ్యవహారంపై బీజేపీ కావాలని ఆడిస్తున్న డ్రామాగా ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బీఆర్ఎస్.. బీసీలకు వ్యతిరేకంగా యాభై శాతం క్యాప్ చట్టం తేగా.. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవడం వెనుక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేసినా కూడా కేంద్రం స్పందన శూన్యం. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీయే అడ్డు పుల్ల వేస్తోందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఆ అనుమానాలకు తెలంగాణ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి. కామారెడ్డి ఎమ్మెల్యే అయితే ఓసీలకు కూడా రిజర్వేషన్లు కావాలంటూ చేసిన వ్యాఖ్యలతో అనుమానాలు కాదు.. వాస్తవమే అనిపిస్తోందని అంటున్నారు.
మొన్నటికి మొన్న కామారెడ్డికి వరద వచ్చినపుడు తాను ఇంటింటికీ వెళ్లి.. చాకిరీ చేయలేను కదా? అంటూ వ్యంగ్య వ్యాఖ్యానం చేసిన వెంకటరమణారెడ్డి.. మరోమారు తన వితండ వాదన వెలుగులోకి తేవడంతో.. ఈసారి ఎన్నికల్లో ఆ 8 సీట్లు కూడా ఊడిపోయేలా ఉన్నాయన్న హెచ్చరికలు అందుతున్నాయ్.
ఓబీసీలకు పదిశాతం రిజర్వేషన్లు ఇస్తే తామేమీ అడ్డుకోలేదని అంటారు వీహెచ్ వంటివారు. ఎందుకంటే వారిలో కూడా పేదలుంటారు కాబట్టి, తాము ఆటంకపరచలేదన్న కామెంట్ చేశారు వీహెచ్. 56 శాతం గా ఉన్న బీసీల ప్రయోజనాలను అడ్డుకునే విధంగా హైకోర్టు స్టే ఇవ్వడం వెనకున్న శక్తులు త్వరలోనే బయట పడతాయని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు, ఇతర బీసీ సంఘాల వారు.
ఇప్పటికే బీజేపీ మీదున్న నిందలు చాలవన్నట్టు వెంకటరమణారెడ్డి వంటి వారు బీజేపీని మరింత ఇరకాటంలో పడేస్తున్నారనీ.. ఇది విపరీత అర్ధాలకు దారి తీసి పార్టీని మరోమారు పుట్టి ముంచినా ఆశ్చర్యం లేదంటున్నారు కొందరు కాషాయ పార్టీ లీడర్లు. అనువుగాని చోట అధికులమనరాదన్న సామెతలు గుర్తు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-mla-demands-reservations-for-ocs-also-39-207655.html
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.