హైదరాబాద్ , రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెరాస, బీజేపీ ఎమ్మెల్సీఅభ్యర్ధులు ప్రధానంగా బ్రాహ్మణ ఓటర్లపై దృష్టిని కేంద్రేకరించారు. బ్రాహ్మణ ఓటర్లు ఎటు మొగ్గుచూపితే అటే విజయం నడిచి వెళుతుందని పార్టీల విశ్వాసం. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా పీవీ కుమార్తె వాణీ దేవిని చివరి నిముషంలో బరిలో దించారు. తెరాస నాయకులు ప్రత్యేకంగా బ్రాహ్మణ పట్టభద్రులు, ఉద్యోగుల సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు.
బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది వామన రావు దంపతుల హత్య వెనక తెరాస నాయకుల హస్తమున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో బ్రాహ్మణ ఓటర్లు కొంత ఆగ్రహంతో ఉన్నారు. బీజీపీ సీనియర్ నాయకురాలు, విజయ్ శాంతి, వామన రావు దంపతుల హంతకులపై ఎలాంటి చర్యలు తీసుకుననరో చెప్పకుండా బ్రాహ్మణ సామజిక వర్గం ఓట్లు అడిగే హక్కు తెరాసకు లేదని మండి పడ్డారు. 'కరీంనగర్ జిల్లా బ్రాహ్మణ హత్యల పాపాన్ని కౌన్సిల్ బీ ఫారంతో కడిగేసుకుందామన్న కుట్ర చెల్లుతుందా? వామనరావు దంపతులపై బ్రహ్మ హత్యా పాతకానికి పాల్పడి వాణీదేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ప్రాయశ్చిత్తం అవుతుందా?' అని ఆమె ప్రశ్నించారు.
'కేసీఆర్ గారి చర్యలను.... ఆవేదనతో రగిలిపోతున్న బ్రాహ్మణులు అంతర్గత సమావేశాలలో ఆత్మసాక్షిగా ప్రశ్నించుకుంటున్నట్లు సర్వత్రా వినిపిస్తోంది. మంథనిలో చేసిన పాపానికి మల్కాజిగిరితో పాటు మూడు ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణ ఓటర్లతో ప్రక్షాళన చేసుకోవాలని సీఎం దొరగారు చేస్తున్న కపట ప్రయత్నాలను అర్థం చేసుకోలేని అమాయక స్థితిలో బ్రాహ్మణ సామాజిక వర్గం లేదు' అని విజయశాంతి పేర్కొన్నారు. 'బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకునేందుకు పీవీ గారి బిడ్డ వాణీదేవిని బరిలోకి దించిన కేసీఆర్ గారు వామనరావు దంపతుల హత్యకు కారకులైనవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో... చెబితే తప్ప, ఓట్లు అడిగే నైతిక హక్కు ఉండదన్న స్పష్టమైన వైఖరితో బ్రాహ్మణ సమాజం ఉన్నట్లు కనిపిస్తోంది' అని విజయశాంతి ట్వీట్ చేశారు.పీవీ గారి కుమార్తెకు టికెట్ కేటాయించానని ప్రచారం చేసుకుంటున్న గులాబీ బాస్... బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రామచందర్ రావు గారికి పడే బ్రాహ్మణ ఓట్లను చీల్చడానికి కుట్ర చేస్తున్నారనేది వాస్తవమన్నది మొత్తం తెలంగాణ సమాజపు అభిప్రాయం' అని విజయశాంతి పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-leader-vijay-shanthi-hot-comments-on-kcr-mlcelection-39-110915.html
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించింది. రేపో ఎల్లుండో కొత్త డీజీపీ నియామకం జరగబోతోంది.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.