Publish Date:Jul 27, 2022
క్రమశిక్షణ, సిద్ధాంత నిబద్ధత అంటూ ఘనంగా చెప్పుకునే బీజేపీ అసలు రంగు ఏమిటన్నది గుజరాత్ సాక్షిగా తేటతెల్లమైపోయింది. భారత రాష్ట్రపతిగా గిరి పుత్రిక ముర్మ పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భాన్నిపురస్కరించుకుని గుజరాత్ లోని గిరిజన ప్రాబల్యం అధికంగా ఉండే చోటౌడేపూర్ లో విజయోత్సవ సభ నిర్వహించింది
బీజేపీ. భారత ప్రథమ పౌరురాలిగా గిరిపుత్రికను పీఠం ఎక్కించిన క్రెడిట్ ను పూర్తిగా సొంతం చేసుకునే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే గుజరాత్ లోని చోటౌడ పూర్ లో కూడా బీజేపీ విజయోత్సవ సభ నిర్వహించింది. అంత వరకూ బాగానే ఉంది. ఆ విజయోత్సవ సభకు హాజరైన గుజరాత్ మంత్రి, బీజేపీ నాయకుడు నిమిషా సుతార్ తప్పతాగి హాజరయ్యారు. అలాగే సభకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రష్మాకాంత్ వాసవ కూడా హాజయర్యారు. ఆయన హాజరవ్వడం విశేషం కాదు కానీ.. తప్పతాగి హాజరు కావడమే ఇప్పడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడానికి కారణమైంది.
సభా స్థలికి వచ్చి కారు దిగడమే తూలుతూ వచ్చిన ఆయన సభా వేదికపై కూడా పరిసరాలను గమనించే స్ఫృహ లేని స్థితిలో ఉన్నారు. పక్కను మహిళా మంత్రి ఉన్నారన్న స్ఫృహ కూడా లేనంతగా మత్తులో మునిగిపోయారు. విజయోత్సవ సభ ప్రారంభమైనది మొదలు, ముగిసే వరకూ ఆయన కళ్లు తెరిచింది లేదు. వేదికపై తూగుతూ ఊగుతూనే కూర్చున్నారు. ఇందుకు సంబంధించి వీడియోలు వైరల్ అయ్యాయి. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతండటంతో గుజరాత్ బీజేపీ ప్రతిష్ట మసక బారింది. దీంతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది.
బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు రష్మీకాంత్ ను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం పాలనలో ఉన్న రాష్ట్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడి నిర్వాకం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీజేపీ సర్కార్ గుజరాత్ లో మద్య నిషేధం అమలు చేస్తున్నామని ఘనంగా చెప్పుకోవడం కాదు.. అది నిజంగా అమలు అవుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సంఘటనపై విపక్షాలు విమర్శల బాణాలు సంధిస్తున్నారు. బీజేపీ దంతా పేరు గొప్ప ఊరు దిబ్బ చందమే ననడానికి రష్మీకాంత్ ఉదంతమే నిదర్శనమని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-leader-came-to-murmu-success-meet-in-drunken-stage-25-140623.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.