జగన్ రెడ్డి రక్షణకు కమల దళం కుట్రలు

Publish Date:Jun 27, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్’లో బీజేపీకి ఉన్న బలమేమిటో,బలహీనతలు ఏమిటో, అందిరికీ తెలిసిందే. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, కమల దళం రాష్ట్రంలో రాజకీయాలను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు సాగిస్తోందని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  ఉదాహణకు ఆత్మకూరు ఉప ఎన్నిక విషయాన్నే తీసుకుంటే, బీజేపీకి డిపాజిట్  రాలేదు, కానీ, గతంతో పోల్చుకుంటే, ఉప ఎన్నికల్లో కొంచే ఎక్కువ ఓట్లు అయితే వచ్చాయి. అయితే, ఆ మాత్రంగా ఓట్లు వచ్చాయంటే, అందుకు కారణం ఏమిటో అందరికీ తెలిసిందే. అదేమీ రహస్యం కాదు ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అన్నట్లుగా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేక పోవడం వలన, బీజేపీ అభ్యర్ధికి 14 శాతం ( 19 వేల చిల్లర ఓట్లు) పైగా ఓట్లు వచ్చాయి. అయితే అది బలుపు కాదు వాపు మాత్రమే. బీజేపీ నాయకులూ మురిసి  పోయేంత గొప్ప ముందడుగు అయితే అసలే కాదు.  అందుకే,  పార్టీలో కొందరు నాయకులు వాపును చూసి బలుపని సంబర పడుతున్నా పార్టీ పుట్టు పూర్వోత్తరాలు తెలిసిన సీనియర్ నాయకులు మాత్రం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏమిటో, పార్టీ బలమేమిటో, బలహీనతలు  ఏమిటో, ఎవరికి తెలిసినా తెలియక పోయినా, పార్టీ జాతీయ నాయకత్వానికి మాత్రం బాగా తెలుసునని అంటున్నారు.  

నిజం, రెండు పార్టీలు వ్యవస్థ  బలంగా బలంగా స్థిర పడిన రాష్ట్రంలో, మరో పార్టీ కాలు పెట్టి నిలదొక్కుకోవడం అంత ఈజీ వ్యవహారం కాదు. అందుకే, కాంగ్రెస్, టీడీపీ బలంగా ఉన్న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ బీజేపే ఒంటరి పోరాటం చేయలేక పోయింది. బీజేపే జాతీయ నాయకత్వం కూడా రాష్ట్రంపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. తెలుగు దేశం పంచన తలదాచుకుంది. అక్కడొకటి ఇక్కడ రెండు అన్నట్లుగా,  నాలుగు స్థానాలు గెలుచుకుని ఉనికిని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేస్తూ వచ్చింది.  

అదే క్రమమలో రాష్ట్ర విభజన తర్వాత కూడా 2014 ఎన్నికలలోనూ తెలుగు దేశంతో పొత్తును కొనసాగించింది. ఏపీ నుంచి నాలుగు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా రెండు మంత్రి పదవులు దక్కించుకుని. అలాగే, కేంద్రంలో ప్రధాని మోడీ మంత్రి  వర్గంలో తెలుగు దేశం పార్టీ  చేరింది. అయితే, 2018లో  ఉభయ పార్టీల మధ్య ‘ప్రత్యేక హోదా’ విషయంలో పేచీ రావడంతో, పొత్తు చెడింది. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అనేది చరిత్ర. 2019 ఎన్నికల్లో కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ, రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ, అధికారం కోల్పోయింది. ఇక ఇప్పడు ప్రస్తుతానికి వస్తే, జాతీయ స్థాయిలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన బీజేపీ  పంధా మార్చింది. ఉత్తరాది, దక్షిణాది అని  లేకుండా విస్తరణ యాత్రను ప్రారంభించింది.  రెండు పార్టీల వ్యవస్థ బలంగా ఉన్న రాష్ట్రాలలో అంచెలంచెలుగా అడుగులు ముందుకు వేస్తోంది.

అందులో భాగంగానే, ఏపీ మీద కూడా కమల దళం కన్నేసింది. ఈశాన్య రాష్ట్రాలలో  సక్సెస్ అయిన ఫార్ములాను ఎపీలోనూ ఇంప్లిమెంట్’ చేసే ప్రయత్నం సాగిస్తోంది. అధికార వైసేపీతో అంటకాగుతూ, తెలుగు దేశం పార్టీ టార్గెట్’ గా రాజకీయం చేస్తోంది. నిజానికి,రాష్ట్రంలో ఒంటరిగా పోటీచేస్తే. ఆ పార్టీ పరిస్థితి ఏమిటో, 2019 ఎన్నికల్లోనే తెలిపోయింది. నోటా’కంటే తక్కువగా ఒక శాతానికి కొంచెం అటూ ఇటుగా ఓట్లు పోలయ్యాయి.  
అందుకే ఇప్పుదు బీజేపీ కొత్త  ఎత్తు వేసింది, వైసీపీ కి అండగా నిలిచి తెలుగు దేశం పార్టీని మరో మారు ఓడించేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే, వైసీపే వ్యతిరేక ఓటును చెల్చేందుకు, కుటిల యత్నాలు సాగిస్తింది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే లక్ష్యంగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పావుగా ఉపయోగించుకుంటోంది. నిజానికి పవన్ కళ్యాణ్’ వైసేపీ ప్రభుత్వ దుర్మార్గ, దుష్ట పాలన నుంచి రాష్ట్రాన్ని  రక్షించే, లక్ష్యంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా, 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీచేయాలని ప్రతిపాదించారు.

అయితే, ఒకటి  తర్వాత ఒకటిగా ప్రాంతీయ పార్టీలను దిగమింగే యోచనతో ముందుకు సాగుతున్న బీజేపీ, తెలుగు దేశం, జనసేన పొత్తుకు అడ్డుపుల్లలు వేస్తోంది.మోకాలడ్డుతోంది. ఆయనలో అనవసరపు ఆశలు రేకెత్తించి, టీడీపీకు దూరం చేసే ప్రయత్నాలు సాగిస్తోంది. మరోవంక ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగింఛి, సామాజిక సమీకరణలను తారుమారు చేసే కుట్రకు పథకం రచిస్తున్నట్లు, తెలుస్తోంది. 
అయితే, ఆంధ్ర ప్రదేశ్’లో కమల దళం వ్యూహాలు ఫలిస్తాయా అంటే, అది అంత ఈజీ కాదని,, సామాన్యుల నుంచి విశ్లేషకుల వరకు అందరూ భావిస్తున్నారు.

ముఖ్యంగా  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా  ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంటున్న నేపధ్యంలో, ఒక్కసారి మోసపోయిన ప్రజలు మరొక్కసారి మోస పోయేందుకు సిద్ధంగా లేరని రాజకీయ పండితులు అంటున్నారు. అదే విధంగా రాష్ట్రానికి ఏ మేలు చేయని బీజేపీతో చేతులు కలపడం వలన. ఆపార్టీ అనుసరించే  హిందూమతోన్మాదం విధానాల వలన జనసేన కూడా మూల్యం చెల్లించవలసి వస్తుందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  నిజానికి, పొత్తులు, ఎత్తులు, రాజకీయ,సామాజిక సమీకరణలు ఎలా ఉన్నా రాష్ట్ర ప్రజానీకం మాత్రం వైసీపీ వినాశకర విధానాలనుంచి, రాష్ట్రాన్ని రక్షించే సామర్ధ్యం ఒక చంద్రబాబుకు మాత్రమే ఉందని, వైసీపీకి టీడీపీ తప్ప మరో ప్రత్యాన్మాయం అయ్యేపని కాదని నిర్ణయానికి వచ్చారని, విశ్లేషకులు అంటున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.