ఇక ఇప్పుడు బీజేపీ దృష్టి బెంగాల్ పై!

Publish Date:Nov 24, 2025

Advertisement

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు ఉంది. ఈ నేపథ్యంలో బీహార్ లో మహాఘట్ బంధన్ ను మట్టికరిపించిన బీజేపీ ఇప్పుడు తన దృష్టి మొత్తం పశ్చిమ బెంగాల్ పై కేంద్రీకృతం చేసింది. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా బెంగాల్ లో అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది. పావులు కదుపుతోంది. పశ్చిమ బెంగాల్ లో గత పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది.  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా మూడు సార్ల విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నాలుగో సారి కూడా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది.

అయితే గత 15 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో ఈ సారి మమతా బెనర్జీ, ఆమె పార్టీ పట్ల ప్రజలలో ఒకింత వ్యతిరేకత కనిపిస్తోంది.  దీంతో ఈ సారి గెలుపు అంత వీజీ కాదన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతున్నది. మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ కు  తొలి రెండు విజయాలూ సునాయాసంగానే లభించాయి. అప్పట్లో పోటీ తృణమూల్ వర్సెస్ కమ్యూనిస్టులు అన్నట్లు ఉండేది. అప్పటికే పాతికేళ్లకు పైగా రాష్ట్రంలో అధికారం చెలాయించిన కమ్యూనిస్టులపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటంతో తృణమూల్ విజయం నల్లేరుమీద బండి నడకే అయ్యింది. అయితే మూడో సారి తృణమూల్ విజయం అంత సునాయాసంగా అయితే లభించలేదు. తనకు పోటీ లేకుండా చేయడానికి  మమతా బెనర్జీ రాష్ట్రంలో బీజేపీని పెంచి కమ్యూనిస్టులను నిర్వీర్యం చేశారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది.  సరే సంపూర్ణ మెజారిటీతోనే తృణమూల్ విజయం సాధించి ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టినప్పటికీ.. ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీతో హోరాహోరీ పోరు తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

వాస్తవానికి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఈ స్థాయిలో బలపడిందంటే అందుకు ప్రధాన కారణం మమతా బెనర్జీయే అని చెప్పాలి.  కమ్యూనిస్టులకు పెట్టని గోడలుగా ఉన్న ప్రాంతాలలో ఒక పద్ధతి ప్రకారం వారి ప్రాబల్యాన్ని మమతా బెనర్జీ నిర్వీర్యం చేశారు. అయితే ఆ స్థానంలో ఆమె పార్టీని బలోపేతం చేయడంతో పాటు బీజేపీకి ఎదగడానికి అవకాశాలు కల్పించినట్లైంది. ఇక ప్రభుత్వ వేధింపుల కారణంగా కమ్యూనిస్టులు చెల్లా చెదురైపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదు సమయంలో స్వీయరక్షణ కోసం చాలా వరకూ కమ్యూనిస్టులు కమలం పార్టీ పంచన చేరినట్లు రాజకీయవర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా తెలంగాణలో ఈటల వంటి కమ్యూనిస్టు భావజాలం ఉన్న నేతలు కూడా బీఆర్ఎస్ ను ఎదిరించేందుకు కమలం పార్టీ పంచన చేరిన చందంగానే తృణమూల్ ధాటి నుంచి తమను తాము కాపాడుకుని ఎదిరించేందుకు పశ్చిమ బెంగాల్ లో కూడా కమ్యూనిస్టులు బీజేపీకి చేరువయ్యారని విశ్లేషిస్తున్నారు.   

2016లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో   కేవలం 10 శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు  2021 అసెంబ్లీలో  38 శాతానికి పెరిగింది.  దీంతో ఈ సారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. కాగా బీజేపీ ఇప్పుడు కలిసివచ్చే అంశమేంటంటే.. తృణమూల్ అధినేత్రితో విభేదించి కమలం గూటికి చేరిన నేతలే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర పార్టీలో అగ్రనేతలుగా ఉన్నారు. వీరంతా మోడీ, అమిత్ షా మార్గదర్శకత్వంలో తృణమూల్ పరాజయం, మమతా బెనర్జీని గద్దెదింపడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని గ్రహించినా మమతా బెనర్జీ గ్రామీణ ప్రాంతాలు, రాష్ట్రంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లపైనే మమతా బెనర్జీ ధీమాగా ఉన్నారు.  చూడాలి మరి వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్, బీజేపీ మధ్య పోటీ  ఎంత తీవ్రంగా ఉంటుందో.. ఎవరు గెలిచి అధికారపగ్గాలు చేపడతారో?

By
en-us Political News

  
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.