జగన్ కు బైబై.. బాబుకు సైసై.. సోము కొత్త పలుకు

Publish Date:Apr 23, 2022

Advertisement

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే ఏపీలో రాజకీయ వేడి వేసవిని మించి పోయింది.  అన్ని పార్టీలకూ  ఎన్నికల సెగ తగిలింది. దాంతో ఇప్పని నుంచే వ్యూహరచనలలో పార్టీలు నిమగ్నమయ్యాయి. కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.   అనూహ్య పొత్తులూ, ఎత్తులతో రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి  గురి చేస్తున్నాయి. 
అందులో భాగమే వైకాపా, కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు అంశం. నిన్న మొన్నటి వరకూ కనీసం ఊహా మాత్రంగానైనా ఎవరి మదిలోనూ కదలాడని ఈ కొత్త పొత్తు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్యవర్తిత్వంతో తెరపైకి రావడమే కాదు....ఈ పోత్తు ఖాయమనేలా వైసీపీ, కాంగ్రెస్ నేతల నుంచి సంకేతాలు వచ్చేశాయి. దీంతో ఒక్క సారిగా ఏపీ రాజకీయ ఎరీనాలో అతి వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 
బీజేపీ- తెలుగుదేశం పార్టీల మధ్య అంతరం కనుమరుగైపోతుందన్నసంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఓటు చీల నివ్వను అంటూ ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ తెలుగుదేశంతో కలిసి పని చేస్తుందన్న బలమైన సంకేతాన్ని ఇచ్చారు. ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా అదే బాటలో నడుస్తున్నదని పించేలా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు ఉన్నాయి.
తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన సోము వీర్రాజు తాజాగా  జగన్ పాలనతో పోలిస్తే చంద్రబాబు పాలన వెయ్యి రెట్లు నయం అన్నట్లుగా మాట్లాడారు. చంద్రబాబు  పాలన సాఫీగా ఉందని, ప్రస్తుతం జగన్ పాలన అస్తవ్యస్తంగా ఉందనీ వ్యాఖ్యలు చేశారు. 
ఆయన వ్యాఖ్యల నేపథ్యంలోనే బీజేపీ కూడా పవన్ కల్యాణ్ పార్టీలా తెలుగుదేశంతో కలిసి రానున్న ఎన్నికలలో పని చేయనుందని భావించవచ్చు. అయితే ఇప్పటికిప్పుడు సోము వీర్రాజు లేదా బీజేపీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారడానికి కారణమేమిటన్న ప్రశ్నకు వైసీపీ, కాంగ్రెస్ ములాఖత్ అనే సమాధానం వస్తుంది.
 
ఇంత కాలం జగన్ బీజేపీకి వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఒక విధంగా వైసీపీ బీజేపీ బీటీమ్ అన్నవిధంగా రాష్ట్రంలో పాలన సాగించారు. వ్యవసాయ విద్యుత్ మీటర్లకు బిగించడం దగ్గర నుంచి వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రానికి మద్దతు పలకడం వరకూ జగన్ కమలం కనుసన్నలలో పాలన సాగించారు. అయితే...పీకే కాంగ్రెస్ కు దగ్గరవ్వడంతోనే జగన్- బీజేపీల మధ్య దూరం అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జగన్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ఖరారైన నేపథ్యంలో కమలం కూడా వ్యూహం మార్చి ఇప్పటి దాకా జగన్ తప్పిదాలను, పాలనా వైఫల్యాలను విమర్శించే విషయంలో ఆచి తూచి  వ్యవహరించే వైఖరికి తిలోదకాలివ్వాలన్న నిర్ణయానికి వచ్చేసింది. అదే సమయంలో  రాష్ట్రంలో బలంగా ఉన్న తెలుగుదేశంలో పూర్వపు మైత్రిని పునరుద్ధరించుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా వైసీపీ ప్రత్యర్థి అయిన తెలుగుదేశంలో జట్టు కట్టడం వల్ల వచ్చే ఎన్నికలలో సీట్ల పరంగా కూడా ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. అందుకే జగన్ వైఫల్యాలను ఎండగట్టడంతో ఊరుకోకుండా గత చంద్రబాబు పాలన ఎంతో నయం అంటూ కితాబులిస్తున్నది. ఏది ఏమైనా వైసీపీ కాంగ్రెస్ పొత్తు అంశం రాష్ట్ర రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు తెరలేపింది. పాత మిత్రులకు ఒక దగ్గరకు చేరుస్తోంది.
 

By
en-us Political News

  
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.