కవిత వెనక కమల దళం?

Publish Date:May 24, 2025

Advertisement

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుట్ల కవిత పార్టీ అధ్యక్షుడికి రాసిన లేఖ  తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవంక కవిత లేఖలో పేర్కొన్న అంశాలతో పాటుగా.. అందుకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, వీటన్నింటి మించి గత కొంతకాలంగా ఆమె పార్టీతో, ఫ్యామిలీతో సంబంధం లేకుండా సొంత పంథాలో సాగిస్తున్నరాజకీయాలను గమనిస్తే.. ఆమె వెనక ఇంకెవరో ఉన్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ లో తనకు అండదండ రెండూ లేవనే నిర్ణయానికి వచ్చే..  ఆమె మరో మార్గంలో ముందుకు సాగుతున్నారని అంటున్నారు.
అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఇంతలా సంచలనం సృష్టించిన కవిత లేఖ పై బీఆర్ఎస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలు, వేచి చూచే ధోరణిలోనే ఉన్నాయి.  పెద్దగా స్పందించలేదు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కవిత లేఖను పరస్పర ఆరోపణలకు వినియోగించుకుంటున్నాయి. ఆచి తూచి స్పందిస్తున్నాయే కానీ.. గట్టిగా రియాక్ట్  కావడం లేదు. ఆమె రాసిన లేఖను గానీ, ఆమె చేసిన వ్యాఖ్యలను గానీ, అంతగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. 
బీఆర్ఎస్ ముఖ్య నాయకులలో ఒక్క కేటీఆర్ మినహా మరెవరూ స్పందించలేదు. కేటీఆర్ కూడాజజ పార్టీ అంతర్గత సమస్యలను పార్టీలో చర్చించు కోవాలే కానీ, బయట మాట్లాడడం మంచింది కాదని పరోక్షంగా కవితను హెచ్చరించారు. అలాగే, కవిత లేఖ అంత పెద్ద విషయం కాదని  కేటీఆర్  కవిత రేపిన దుమారాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేశారు. అలాగే..  నేషనల్ హెరాల్డ్  కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ లో రెంత్ రెడ్డి పేరున్న విషయాన్ని పైకి తెచ్చి  చర్చను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించారు.
మరోవంక కాంగ్రెస్, బీజేపీలు గుమ్మడికాయ దొంగ ఎవరంటే బుజాలు తడుముకున్నట్లుగా.. ఇదంతా ఫ్యామిలీ డ్రామా అన్నట్లుగా కొట్టి పారేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో  కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు , మంత్రులు వివరణ కోరుతున్నారు. ఆ దయ్యాల పేర్లు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా బీజేపీ ఎంపీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు జాయింట్ గా  డ్రామాలు ఆడుతున్నాయని అంటున్నారు.  
అయితే నిజంగానే.. ఇది ఫ్యామిలీ డ్రామానే అయినా, ఈ డ్రామాలో బీఆర్ఎస్ తో పాటుగా కాంగ్రెస్, బీజేపీ పాత్ర కూడా ఉందని  రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. నిజానికి పైకి కనిపిస్తున్న చిత్రానికి, లోపల జరుగతున్నతతంగానికి మధ్య పొంతన, పోలిక లేదని అంటున్నారు. ముఖ్యంగా, 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు, వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న బీజేపీ, బీఆర్ఎస్ ను బలహీన పరిచేందుకు, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చిక్కిన కవితను, పావుగా ఉపయోగించుకునే  వ్యూహాన్ని అమలు చేస్తోందని అంటున్నారు. నిజానికి  ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై, బెయిలుపై విడుదలై వచ్చిన తర్వాతనే కవిత  ధోరణిలో మార్పు వచ్చిందని, ముఖ్యంగా తాను కష్టాల్లో ఉన్న సమయంలో తనను పార్టీ, ఫ్యామిలీ పట్టించుకోలేదనే బాధ ఆమెలో ఉందని మెల్ల మెల్లగా బయటకు వస్తోందని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే, కవిత బీజేపీకి దగ్గరయ్యారని, అంటున్నారు. అందుకే  జైలు నుంచి బెయిలు పై వచ్చిన తర్వాత కవిత బీఆర్ఎస్ తో అంటీ ముట్టనట్లు ఉండడమే కాకుండా, తెలంగాణ జాగృతి వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. మరో వంక సామాజిక తెలంగాణ నినాదాన్ని పైకి తీసుకు వచ్చి, బీసీల్లో పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం పెట్టాలనే డిమాండ్  తో పాటుగా బీసీల హక్కుల పోరాటాల్లో పార్టీతో సంబంధం లేకుండా  తెలంగాణ జాగృతి తరపున పాల్గొన్నారు. 

 అయితే.. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్  నీడ అయినా తనమీద పడకుండా  కవిత జాగ్రత్త  పడుతున్నారు. చివరకు   అమెరికా నుంచి శుక్రవారం (మే 23) హైదరాబాద్  చేరుకున్న సమయంలో కూడా ఆమెకు స్వాగతం పలికేందుక  వచ్చిన వారిలో, కుల సంఘాలు, జాగృతి కార్యకర్తలతో పాటుగా కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నా, ఏ ఒక్కరూ కూడా గులాబీ జెండా పట్ట లేదు, కేసీఆర్ కు జై కొట్టలేదు. అంటే..  బీఆర్ఎస్ తో సంబంధం లేకుండా కవిత, సామాజిక తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారని, ఈ ప్రయత్నాల్లో ఆమె సక్సెస్ అయితే, సామాజిక తెలంగాణ నినాదంగా సొంత పార్టీని ఏర్పాటు చేయవచ్చని అంటున్నారు. అయితే.. ఇదంతా కవిత బీజేపీ కనుసన్నల్లో చేస్తున్నారని అంటున్నారు.   

రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత తార స్థాయికి చేరిందిజ  రానున్న మూడున్నర  ఏళ్లలో కాంగ్రెస్ ఇంకా బలహీనపడుతుందని అంచనా వేస్తున్న కమల దళం, కవితను ప్రయోగించి, బీఆర్ఎస్ ను బలహీన పరిస్తే..  కొత్త సమీకరణాలతో, కొత్త పొత్తులతో రాష్ట్రంలో పాగ వేయవచ్చని   భావిస్తోంది. అందులో భాగంగానే  కవిత ఎపిసోడ్ తెర పైకి వచ్చిందని అంటున్నారు.

By
en-us Political News

  
విమానం ఎక్కాలంటేనే కాదు, దిగాలన్నా అదృష్టం ఉండాలి... ఇది ఏదో సినిమాలో డైలాగు. ఈ రోజు అది నిజమని మరో మారు రుజువైంది.
గుజరాత్ విమాన ప్రమాద ఘటనపై అహ్మదాబాద్ సీపీ జ్ఞానేందర్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బతికి అవకాశం లేదని ఆయన అసోసియేట్ ప్రెస్‌తో అన్నారు. ఆ విమానంలో మొత్తం 242 మంది ఉండగా.. వారంతా దాదాపు చనిపోయి ఉంటారని పరోక్షంగా వెల్లడించారు.
కూటమి సర్కార్ ఏడాది పాలన సభ కార్యక్రమం వాయిదా పడింది. ఏడాది పాలన పూర్తి సందర్భంగా విజయవాడలోని ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో తన అకౌంట్ డీపీ & కవర్ పీక్‌ను నలుపు రంగులోకి మార్చింది. కాగా ఈ ప్రమాద నేపథ్యంలో ఎయిర్ ఇండియాపై నెట్టింట విమర్శస్తున్నాయి.
అహ్మదాబాద్- లండన్ విమానం బీజే మెడికల్ కాలేజీపై కూలింది. దీంతో 20 మందికి పైగా మెడికోలు మృతి చెందినట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్‌‌ విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏవియేషన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీలను వెంటనే రంగంలోకి దింపినట్లు ట్వీట్ చేశారు.
మొక్కే క‌దాని పీకేస్తే పీక కోస్తా ఇది ఇంద్రాలో చిరంజీవి డైలాగ్.. స‌రిగ్గా అలాగే వెంట్రుకే క‌దా పీక‌లేర‌న్న డైలాగ్ కొడితే.. ఏకంగా మిమ్మ‌ల్నే అధికారంలోంచి పీకేస్తా.. ఇది ప్రెజంట్ పొలిటిక‌ల్ సిట్యువేష‌న్. మాములుగా పాములు ప‌గ‌బ‌డ‌తాయ‌ని అంటారు. స‌రిగ్గా అలాగే వెంట్రుక‌లు కూడా ఈ లీడ‌ర్ జ‌నాల మీద ప‌గ‌బ‌ట్టాయా? అంటే నిజమేమో అనుకోవలసి వస్తోంది.
అహ్మదాబాద్‌‌లో కూలిన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పలువురు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రూపానీకి తీవ్ర గాయపడినట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్ నుంచి లండన్ వెడుతున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీయే 3.0 ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకుంది.అలాగే.. వరసగా మూడు పర్యాయాలు, అధికార పగ్గాలు చేపట్టిన ఎన్డీఎ ప్రభుత్వం మొత్తంగా 11 ఏళ్ళు పూర్తి చేసుకుని , 12 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ 11 సంవత్సరాల పాలన ఎలా ఉందంటే చెప్పడం కష్టమే. అంతా బాగుందని అనలేము, అసలేమీ బాగులేదని చెప్పలేము.
ఈ నెల 20న అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కూటమి పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్‌తో కలిసి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు.
అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగింది. 242 మంది ప్రయాణీకులతో అహ్మదాబాద్ నుంచి లండన్ వెడుతున్న ఎయిర్ ఇండియా ఏ1 171 విమానం టేకాఫ్ సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
ఒక వ్య‌క్తి అర‌సెంటులో ఏ చిన్నా చిత‌కా ఇల్లో క‌ట్ట‌లేదు. ఏకంగా మూడంత‌స్తుల మేడ లేపేసేశాడు. ఒక్క‌సారి మెడ పైకెత్తి ఎంత ఎత్తులో క‌ట్టాడో చూద్దామ‌నుకున్న వాళ్ల మెడ ప‌ట్టేస్తుందంటే న‌మ్మ‌రే.  అంత‌గా క‌ట్టేశాడీ మూడంతస్తుల మేడ‌.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.