ఏపీ బీజేపీ చీఫ్ సుజనా చౌదరి.. కేంద్ర పెద్ద‌ల మ‌ద్ద‌తు ఆయ‌న‌కేనా?

Publish Date:Jan 3, 2025

Advertisement

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  బీజేపీకి నూత‌న అధ్య‌క్షుడు రాబోతున్నారా?  పార్టీ అధిష్టానం ఆ మేర‌కు ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టిందా?  ప్ర‌స్తుతం అధ్య‌క్షురాలిగా ఉన్న పురందేశ్వ‌రికి కేంద్రంలో ప్రాధాన్య‌త క‌ల్పించి.. రాష్ట్రంలో కొత్త‌వారికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించేందుకు రంగం సిద్ధ‌మైందా? అంటే అవున‌నే స‌మాధానమే పార్టీ ముఖ్య‌నేత‌ల నుంచి వినిపిస్తోంది. అయితే, బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో నలుగురు ఉండగా వారిలో సుజనా చౌదరికే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా అంటున్నారు.  పార్టీ పెద్దలు కూడా బీజేపీ రాష్ట్ర పగ్గాలు సుజనా చౌదరికే అప్పగించాలన్న భావనతో ఉన్నట్లు చెబుతున్నారు.  సుజనా చౌదరికి పార్టీ రాష్ట్ర పగ్గాలు కట్టబెడితే ఏపీ సర్కార్ తో సమన్వయం చక్కగా ఉంటుందన్నది బీజేపీ అగ్రనాయత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

రాబోయే కాలంలోనూ రాష్ట్రంలో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి ముందుకు సాగాల‌న్న ఆలోచ‌న‌లోనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో సుజ‌నా చౌద‌రి అయితేనే కూట‌మి ప్ర‌భుత్వంతో స‌త్సంబంధాలు కొన‌సాగిస్తూ ఏపీలో బీజేపీ బ‌లోపేతానికి కృషి చేస్తార‌ని కేంద్ర పార్టీ పెద్ద‌లు భావిస్తున్నార‌ని చెబుతున్నారు. అయితే, సుజ‌నా చౌద‌రికి అధ్య‌క్ష బాధ్య‌త‌లుఇచ్చే విష‌యంపై రాష్ట్ర పార్టీలోని కొందరి నుంచి అభ్యంతరం వ్యక్తమౌతున్నట్లు తెలుస్తోంది.  ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన వారికే పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఇవ్వాల‌ని బీజేపీలోని ఓ వ‌ర్గం నేత‌లు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.

ద‌క్షిణాది రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ అధిష్ఠానం అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. క‌ర్ణాట‌క‌లో బ‌ల‌మైన పార్టీగా ఉన్న బీజేపీ.. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైంది. మ‌రోవైపు తెలంగాణ రాష్ట్రంలో బ‌ల‌మైన పార్టీగా ఎదుగుతున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే ల‌క్ష్యంగా ఆ పార్టీ నేత‌లు ప‌ని చేస్తున్నారు. ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ‌ కూట‌మి ప్ర‌భుత్వంలో బీజేపీ భాగ‌స్వామిగా ఉంది. రాష్ట్ర మంత్రి వ‌ర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఒక‌రు మంత్రిగా ఉన్నారు. ఇటీవ‌ల నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ బీజేపీకి ప్రాధాన్య‌త ద‌క్కింది. ప‌లువురు బీజేపీ నేత‌లకు ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వులు ల‌భించాయి. ప్ర‌స్తుత బీజేపీ అధ్య‌క్షురాలు, ఎంపీ పురందేశ్వ‌రి ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త‌గా ఉంటూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే, ఆమెకు కేంద్ర ప్ర‌భుత్వంలో ప‌ద‌వి ఇచ్చేందుకు బీజేపీ కేంద్ర పెద్ద‌లు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఆమె స్థానంలో ఏపీలో బీజేపీకి నూత‌న అధ్య‌క్షుడిని నియ‌మించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఎవ‌రు చేప‌ట్టినా ప్ర‌భుత్వంతో స‌ఖ్య‌త‌గా ఉంటూనే పార్టీ  బ‌లోపేతంపై దృష్టిసారించాల్సి ఉంటుంది. ప్ర‌భుత్వానికీ బీజేపీ అధ్య‌క్షుడికి మ‌ధ్య ఏమాత్రం గ్యాప్ వ‌చ్చినా ఎన్డీయే కూట‌మికే ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. గతంలో అంటే 2014 తరువాత ఏపీలో ఇదే పరిస్థితి ఏర్పడి తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు వచ్చేయడానికి కారణమైంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ అధ్య‌క్షుడి ఎంపికకు సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల అభిప్రాయాలను కూడా బీజేపీ హైకమాండ్ పరిగణనలోనికి తీసుకునే అవకాశం ఉంది.  

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లకు కొద్ది నెల‌ల ముందు పురందేశ్వ‌రికి రాష్ట్ర పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన, టీడీపీ క‌లిసి పోటీచేయ‌డానికి ఆమె కీల‌క భూమిక పోషించారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిప్రాయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు కేంద్రంలోని పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లి జ‌న‌సేన‌, టీడీపీ కూట‌మిలో బీజేపీ భాగ‌స్వామిగా మారడంలో పురందేశ్వ‌రి కీ రోల్ పోషించార‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌రువాత ఓ సంద‌ర్భంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. పురందేశ్వ‌రి కాకుండా బీజేపీ ఏపీ అధ్య‌క్ష స్థానంలో మ‌రొక‌రు ఉంటే మూడు పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరేది కాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా ప‌వ‌న్‌, చంద్ర‌బాబుతో ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుతూ నామినేటెడ్ ప‌దువుల్లో బీజేపీ నేత‌లకు ప్రాధాన్య‌త ద‌క్కేలా ఆమె కృషి చేశారు. ప్ర‌స్తుతం ఆమెను కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద‌వుల్లోకి లేదా కేంద్ర పార్టీ ప‌ద‌వుల్లోకి తీసుకోవాల‌ని పార్టీ పెద్ద‌లు భావిస్తున్నారు. దీంతో పురందేశ్వ‌రి త‌ర‌హాలో ప్ర‌భుత్వంతో మంచి సంబంధాలు కొన‌సాగిస్తూనే.. పార్టీని బ‌లోపేతం చేసే నేత‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో సుజ‌నా చౌద‌రి అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బీజేపీ ఏపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డంలో స‌మ‌ర్ధుడ‌న్న భావ‌న‌కు కేంద్ర పార్టీ పెద్ద‌లు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీనికితోడు చంద్ర‌బాబు మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోనూ సుజ‌నా చౌద‌రికి మంచి సంబంధాలు ఉన్నాయి. 

విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రితోపాటు ఆధోని ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌, సీనియర్‌ నేత రఘురామ్‌ పేర్లు అధ్య‌క్షుడి రేసులో వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీలోని కొంద‌రు నేత‌లు మాత్రం.. ఆర్ఎస్ఎస్ మూలాలు క‌లిగిన‌ నేత‌కు అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కేంద్ర పార్టీ పెద్ద‌ల‌పై ఒత్తిడి తెస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలో పార్థసారథికి ఆర్ఎస్ఎస్ తో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. మ‌రోవైపు ఆయ‌న రాయలసీమ ప్రాంతం వాసి. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని ఈసారి రాయ‌ల‌సీమ నేతకు అప్ప‌గించాల‌న్న డిమాండ్ కూడా ఉంది. మాధ‌వ్ పేరు కూడా అధ్య‌క్ష రేసులో బ‌లంగా వినిపిస్తుంది. అయితే, సుజ‌నా చౌద‌రివైపే పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. చంద్ర‌బాబు, ప‌వ‌న్ తో ఆయ‌న‌కు మంచి సంబంధాలున్నాయి. మ‌రోవైపు సుజనా చౌద‌రికి కూట‌మి పార్టీల్లోని నేత‌ల‌తోపాటు వైసీపీ లోని నేత‌ల‌తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం వైసీపీ అధికారాన్ని కోల్పోవ‌డంతో ఆ పార్టీలోని ముఖ్య‌నేత‌లు కూట‌మి పార్టీల్లోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సుజ‌నా చౌద‌రి బీజేపీ అధ్య‌క్ష  స్థానంలో ఉంటే వైసీపీ నుంచి కూట‌మి పార్టీల్లోకి వ‌చ్చేవారిలో ఎక్కువ‌ మంది బీజేపీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశాలు ఉన్నాయి. త‌ద్వారా రాష్ట్రంలో  పార్టీ మ‌రింత బ‌లోపేతం అయ్యే అవ‌కాశం ఉంది. దీంతో కేంద్ర పార్టీ పెద్ద‌లు సుజ‌నా చౌద‌రికే ఏపీ బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు దాదాపు నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.  

By
en-us Political News

  
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.