Publish Date:Jun 10, 2026
ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ పొత్తుల వ్యవహారంలో ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ క్లారిటీ జనసేనకు తెలంగాణలో కమలం అండ ఆశలను ఆవిరి చేసింది. అదే సమయంలో తెలంగాణలో ఒంటరిగా బలోపేతం కావాలని భావిస్తున్న తెలుగుదేశం ఆశలకు ఊపిరి పోసింది.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన పార్టీలతో పొత్తుతో 2024 ఎన్నికల్లో లబ్ధిపొందిన బీజేపీ.. ఆ పొత్తు తెలంగాణలో పొసగదని కుండబద్దలు కొట్టేసినట్లైంది. తెలంగాణలో కమలంతో కలిసి చక్రం తిప్పాలని ఆశిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కు బీజేపీ నిర్ణయం ఒకింత నిరాశ కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
అమిత్ షా చేసిన ఈ తాజా అధికారిక ప్రకటన ప్రకారం, రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే అవకాశం లేదని కుండబద్దలు కొట్టేశారు. దీంతో తెలంగాణలో తెలుగుదేశం, బీజేపీలు ఒంటరిగానే బరిలోకి దిగాల్సి ఉంటుంది. బీజేపీ ఈ నిర్ణయం పట్ల తెలుగుదేశం లో హర్షం వ్యక్తం అవుతున్నది. పొత్తులు లేకుండా బలం పుంజుకోవాలని చూస్తున్న ఆ పార్టీకి ఇది స్వాగతించే విషయమే. ఎందుకంటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉంది కానీ కార్యకర్తల బలం, బలగం ఇప్పటికీ చెక్కు చెదరలేదనే చెప్పాలి. అందుకే విభజన తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ అన్ని పార్టీలూ తెలుగుదేశం క్యాడర్ మద్దతు కోసం వెంపర్లాడాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో అంటే 2023లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పోటీపడి మరీ తెలుగుదేశం జెండాను భుజాన మోశారు. కాంగ్రెస్ ఎలక్షన్ ర్యాలీలలో అయితే బాహాటంగానే టీడీపీ జెండాలు రెపరెపలాడాయి.
దీంతో తెలంగాణలో ఒంటరి పోరే అన్న బీజేపీ నిర్ణయం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో సొంతంగా బలోపేతం కావడానికి అంది వచ్చిన అవకాశంగా భావిస్తోంది. వాస్తవానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, బలమైన క్యాడర్, విస్తృతమైన అభిమాన వర్గం ఉంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు, మెకానిజం చాలా వరకు రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేసి.. కాంగ్రెస్ కు అధికార పీఠం దక్కడంలో కీలక పాత్ర పోషించాయి. అదే రాష్ట్రంలో తెలుగుదేశం బరిలో ఉంటే ఆ క్యాడర్, మెకానిజం తెలుగుదేశానికి బలంగా మారతాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో జనసేన ముద్ర పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటాలని పవన్ కళ్యాణ్ ఎంతో పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఒంటరి పోరు జనసేనకు అంత సులువు కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-alliance-with-tdp-and-janasena-limited-to-ap-25-222481.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.