ప్రాంతీయ పార్టీల పాలిట అనకొండ బీజేపీ!?

Publish Date:Aug 13, 2022

Advertisement

ఎన్డీయే ఖాళీ అవ్వడం వెనుక బీజేపీ వ్యూహం ఉందా? ఉద్దేశ పూర్వకంగానే మిత్రపక్షాలను కూటమి వీడేలా బీజేపీ వ్యవహరిస్తోందా? 2024 ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగడమే రాజకీయంగా తమకు లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది.

ఆ పార్టీ చెబుతున్న డబుల్ ఇంజిన్ అర్ధం ఇదేనా? దేశ  వ్యాప్తంగా అన్నిరాష్ట్రాలలోనూ అధికారం చేజిక్కించుకోవాలంటే ముందుగా ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలను బలహీనం చేయాలన్నదే ఆ పార్టీ లక్ష్యమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వారి వ్యూహానికి బీహార్ లోని జేడీయూ అధినేత బ్రేక్ వేశారా? బీహార్ లో బీజేపీ వ్యూహం బెడిసికొట్టిందా? అంటే కూడా ఔననే అంటున్నారు. ఎన్డీయే కూటమి నుంచి ఒక్కటొక్కటిగా పార్టీలు వైదొలగడానికి కారణం బీజేపీ వ్యవహరిస్తున్న తీరే కారణమని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

అవసరార్ధం ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడం.. ఆ తరువాత అనకొండలా వాటిని మింగేయడానికి ప్రయత్నించడం.. కాశ్మీర్ నుంచి మహారాష్ట్ర వరకూ బీజేపీ అనుసరించిన వైఖరి ఇదేనని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్ని ప్రాంతీయ పార్టీలూ పొత్తు విచ్ఛిన్నమయ్యే సమయానికి తమ స్వరాష్ట్రంలో బలహీనపడిన ఉదంతాలే ఉన్నాయని అంటున్నారు. బీహార్ పరిణామం తరువాత బీజేపీతో మైత్రి చెడిన పార్టీల నుంచి ఇంకా పొత్తులో కొనసాగుతున్న పార్టీల వరకూ అన్ని నితీష్ వ్యూహాలను ప్రశంసిస్తున్నారు. ఆయన కీలెరిగి బీజేపీకి వాత పెట్టారని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో మెజారిటీ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉండడానికి కారణం.. ఆయా రాష్ట్రాలలో అవసరార్దం పొత్తులు కుదుర్చుకుని.. వాటి అండతో రాష్ట్రంలో బలపడి.. ఆ తరువాత వాటినే టార్గెట్ చేయడం బీజేపీ గత ఎనిమిదేళ్లుగా అనుసరిస్తున్న వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అలా ఇప్పుడు నితీష్‌ టార్గెట్ చేసిందనేది కూడా ఓ  ఆరోపణ. నిజానికి వరుస పరిణామాలకు ఈ మాటలకు మరింత బలం చేకూర్చేలా కనిపిస్తున్నాయ్. ఇప్పుడు బిహార్ మాత్రమే కాదు.. ఈ మధ్యే ముగిసిన మహారాష్ట్ర పంచాయితీతో పాటు.. పంజాబ్‌లో శిరోమణి అకాళీదళ్‌తో దోస్తీకి కూడా బ్రేక్ పడింది. బీహార్ విషయానికి వస్తే.. ఆ రాష్ట్రానికి చెందిన   లోక్‌ జనశక్తి పార్టీ.. ఎన్డీఏలో ఒకప్పుడు భాగంగా ఉండేది.   రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ మరణం తర్వాత ఎల్‌జేపీ పగ్గాలు చేపట్టిన ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ పావుగా వాడుకొందన్న విమర్శలున్నాయి. బీహార్ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులున్న చోట బలమైన క్యాండిడేట్లను నిలబెట్టడం ద్వారా ఓట్లను చీల్చింది ఎల్‌జేపీ.  ఎన్నికలయ్యాక చిరాగ్‌ను పట్టించుకోవడం మానేసింది బీజేపీ నాయకత్వం. అదే సమయంలో ఎల్‌జేపీలో చెలరేగిన తిరుగుబాటు సమయంలో … చిరాగ్‌ పాశ్వాన్‌ స్థానంలో ఆయన బాబాయి పశుపతి కుమార్‌ పరాస్‌కు బీజేపీ మద్దతుగా నిలబడింది. ప్రస్తుతం ఎల్ జెపీ   పూర్తిగా పశుపతి హ్యాండోవర్‌లో ఉంది. పాశ్వాన్ వారసుడిగా చక్రం తిప్పుదామనుకున్న చిరాగ్‌.. బీహార్ పాలిటిక్స్‌లో కంప్లీట్‌గా సైడ్ అయిపోయారు.

ఇక మహరాష్ట్ర సంగతి తలిసిందే.  ఒకప్పుడు శివసేన మద్దతుతో మహారాష్ట్రలో నిలబడ్డ బీజేపీ.. ఇప్పుడు ఆ పార్టీనే మింగేసిందనే చెప్పాలి. సీఎం పదవి విషయంలో వచ్చిన పేచీతో ఎన్నో ఏళ్లుగా కలిసి వస్తున్న శివసేనకు రాం రాం చెప్పేసింది బీజేపీ. అటు కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండున్నరేళ్లు పూర్తికాకముందే.. శివసేనలో రేగిన అసమ్మతిని తమకు పూర్తి అనుకూలంగా మార్చుకున్న కమలం పార్టీ వ్యూహాలతో ఉద్ధవ్ థాక్రే మల్లగుల్లాలు పడుతున్నారు.  కనీసం పార్టీ చిహ్నం అయినా తమకు దక్కుతుందా? దక్కదా అన్న అయోమయంలో ఉద్ధవ్ థాక్రే ఉన్నారు. పేరుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ షిండే అయినా పగ్గాలు మొత్తం బీజేపీవే అన్నట్లుగా ఇప్పుడు మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాగుతోంది.  ఇక తమిళనాడులోనూ ఇదే పరిస్థితి.  శిరోమణి అకాలీదళ్ వ్యవసాయ చట్టాల విషయంలో విభేదించి ఎన్డీయేకు గుడ్ బై చెప్పింది. అటు అమరీందర్ సింగ్ కాంగ్రెస్ గుడ్ బై చెప్పేదాకా వెంటపడింది. చివరకు బీజేపీ ఉచ్చులో చిక్కుకుని అమరీందర్ సొంత కుంపటి పెట్టగానే ఆయన పార్టీతో పొత్తు పెట్టుకుంది. అయితే ఈ పొత్తు పంజాబ్ ఎన్నికలలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయినా.. కాంగ్రెస్ ను అధికారం నుంచి దూరం చేయడానికి మాత్రం దోహదపడింది. అంతే కాకుండా కాంగ్రెస్ నేతగా, పంజాబ్ సీఎంగా తిరుగులేని నేతగా ఉన్న అమరీందర్ ను ఇప్పుడు రాష్ట్రంలో నామమాత్రపు నేతగా మార్చేసింది.    దేశవ్యాప్తంగా అధికారంలో ఉండాన్న పట్టుదలతో బీజేపీ   మిత్రుడు, శత్రువు అని తేడా లేకుండా వ్యూహాలు రచిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

అక్రమంలోనే మిత్ర పక్షాలను బలహీనం చేసి, లేదా మింగేసి ఆయా రాష్ట్రాలలో బలోపేతం అయ్యేందుకు ఎత్తులు వేస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్‌ ఇన్‌ లవ్‌ అండ్ వార్ అన్న నానుడికి బీజేపీ.. పాలిటిక్స్ కూడా చేర్చేసిందని అంటున్నారు.

By
en-us Political News

  
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్‌ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. 
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్‌ల సౌండ్‌తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.