హస్తం నేతల నోట... ఆర్ఎస్ఎస్ ప్రార్థన గీతం

Publish Date:Aug 25, 2025

Advertisement

 

 

బీజేపీ మాతృ సంస్థ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అంటే, కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఉన్న అభిప్రాయం ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. ఆర్ఎస్ఎస్’ పై ఆయన కారాలు మిర్యాలు కాదు ఏకంగా నిప్పులే చెరుగుతారు. అంతే కాదు బీజేపీ, ఆర్ఎస్ఎస్’ లపై బహిరంగంగా యుద్దాన్నే ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అంతమొందించే వరకు, తమ సైధాంతిక పోరాటం కొనసాగుతుందని కూడా రాహుల్ గాంధీ, పదే పదే చెపుతూవస్తున్నారు. 

ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల సంధ్రభంగానూ, రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నాయకులు,ఇది గెలుపు ఓటముల సంగ్రామం కాదు సైద్ధాంతిక పోరాటం’ గా పేర్కొంటున్నారు.  నిజానికి, రాహుల్ గాంధీమ ఒకటి రెండుసార్లు కాదు, వందల సార్లు ‘ఐ హేట్ ఆర్ఎస్ఎస్’,అని చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రస్తావన వచ్చినా, రాహుల్ గాంధీ తమ వ్యతిరేకతను, ద్వేషాన్ని ఏ కొంచెం దాచుకోలేదు. 

నిజానికి, రాహుల్ గాంధీని మీరు బీజీపీ, మోదీలను ఎక్కువ వ్యతిరేకిస్తారా? ఆర్ఎస్ఎస్’ను ఎక్కువ వ్యతిరేకిస్తారా అంటే అనుమానం లేకుండా, ఆయన నోటి నుంచి ఆర్ఎస్ఎస్’ అనే సమాధానమే వస్తుంది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే క్రమంలోనే ఆయన, బీజేపీ, ఆర్ఎస్ఎస్’లతో పాటుగా దేశం పైన, సనాతన ధర్మపై  కూడా  ద్వేషాన్ని పెంచుకున్నారు. అందుకే, ఆర్ఎస్ఎస్ ప్రస్తావన ఎక్కడ వచ్చినా,రాహుల్ గాంధీ భగ్గుమంటారు, వంద ఓటములకు అయినా సిద్ధమే కానీ,ఆర్ఎస్ఎస్’ భావజాలంపై యుద్ధం మాత్రం ఆగదని అంటారు. 


కొద్ది రోజుల క్రితం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సందీప్ దీక్షిత్’ (ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు)తో జరిపిన  సంభాషణలోనూ రాహుల్  గాంధీ అదే చెప్పారు. అంతే కాదు, ఆర్ఎస్ఎస్ పట్ల తమకున్న వ్యతిరేకత తమ జీన్స్’ లోనే ఉందని క్లారిటీ ఇచ్చారు. అవును..‘మీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ కలలో కనిపిస్తే,,మీరు ఆయన్ని ఏమి అడుగుతారు? అని సందీప్ దీక్షిత్’ సరదాగా అడిగిన ప్రశ్నను రాహుల్ గాంధీ చాలా సీరియస్’గా  తీసుకున్నారు. తాను (రాహుల్) అడిగే ప్రశ్నతో పాటుగా నెహ్రూ చెప్పే సమాధానం కూడా చెప్పారు. 

మా ముత్తాత నెహ్రూ కలలో కనిపిస్తే.. ‘నేను జీవితంలో ఎప్పటికీ ఏది చేయకూడదో చెప్పమని అడుగుతానని’సమాధానం ఇచ్చారు .అంతే కాదు, ఆవెంటనే, తన ప్రశ్నకు నెహ్రూ .. ఇచ్చిన సమాధానం కూడా చెప్పనా?  అంటూ,’, ఆర్ఎస్ఎస్’తో ఎప్పుడు రాజీ పడద్దు’ అని నెహ్రూ చెప్పారని రాహుల్ చెప్పారు. ఈ సభాషణను గమనిస్తే, రాహుల్ గాంధీకి ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకత వెనక జన్మజన్మల వైరం ఏదో ఉందని పిస్తుంది. అలాగే,ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకత, ద్వేషం ఏస్థాయిలో వుందో, ఆ ద్వేషం మూలాలు ఎక్కడ ఉన్నాయో కూడా స్పష్టంగా, అర్థం అవుతుంది.

అంతే కాదు, కొంతకాలం క్రితం గుజరాత్’ లో పర్యటించిన సందర్భంగాను రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌లోని ఒక వర్గం, బీజేపీ,ఆర్ఎస్ఎస్ లతో కుమ్ముక్కైందని, అలాంటి వారిని ఏరి వేస్తామని  హెచ్చరించారు. 
అంటే రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్’ ను ఎంతగా వ్యతిరేకిస్తున్నారో వేరే చెప్పనక్కర లేదు. అయినా, కొన్ని నెలల క్రితం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ కార్యకర్తలు,ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అడుగుజాడల్లో నడవాలని పిలుపు నిచ్చారు. 

అదలా ఉంటే ఇప్పుడు, పొరుగు రాష్ట్రం కర్ణాటక కాంగ్రెస్’లోని ఒక వర్గం ఆర్ఎస్ఎస్’ భావజాలం పట్ల ఆకర్షితులు అవుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏకంగా అసెంబ్లీలో, ఆర్ఎస్ఎస్’ ప్రార్ధన గీతం ( నమస్తే సదా వత్సలే మాతృ  భూమే..)  ఆలపించారు.అంతే కాకుండా, ఆర్ఎస్ఎస్ పనితీరును అధ్యయనం చేస్తున్నానని, ఆర్ఎస్ఎస్ నడుపుతున్న పాఠశాలలు బాగున్నాయని, మెచ్చుకున్నారు.

అదలా ఉంటే తాజగా, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే, హెచ్’డి రంగనాథన్’  తమ సొంత నియోజక వర్గం తునుకూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో,డీకే అడుగుజాడల్లో ఆర్ఎస్ఎస్, ప్రార్థన గీతాన్ని అలపించడమే కాకుండా, అర్థ తాత్పర్యాయాలను, విడమరిచి చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రార్ధనా గీతంలో తనకు తప్పేమీ కనిపించలేదని, జన్మ భూమికి వందనం చేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఇక ఆర్ఎస్ఎస్’ బడిలో, టీడీపీ కాలేజీలో, చదువుకుని, కాంగ్రెస్ పార్టీలో కొలువు చేస్తున్నాని స్వయంగా  చెప్పుకున్న రేవంత్ రెడ్డి గురించి వేరే చెప్పనక్కర లేదు.  


అయితే,ఆర్ఎస్ఎస్’ భావజాలం పట్ల రాహుల్ గాంధీకి ఉన్న వ్యతిరేకత తెలిసి కూడా  మీనాక్షి నటరాజాన్ మొదలు,డీకే శివకుమార్ వరకు, డీకే మొదలు,కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రంగనాథన్’వరకు కాంగ్రెస్’ నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా  ఆర్ఎస్ఎస్ భావజాలం వైపు మొగ్గు చూపడం లేదా లేదా కొంత సానుకూలంగా స్పందించడం దేనికి సంకేతం ? అన్నిటిని మించి ఈ ఇంటి మీద వాలిన కాకి ఆ ఇంటి మీద వాలరాదన్నట్లుగా ఆర్ఎస్ఎస్’ ద్వేషించే కాంగ్రెస్ సుప్రీం బాస్ రాహుల్ గాంధీ ఎలా తీసుకుంటారు, అనేది మరింత ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.

By
en-us Political News

  
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.