ఆయన ముందు.. అన్నీ సవాళ్లే

Publish Date:Jul 4, 2025

Advertisement

 

తెలంగాణ బీజేపీ నూతన ఆధ్యక్షుడిగా, ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్. రామచంద్ర రావు, బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడితో ఇంచుమించుగా సంవత్సరం  పైగా సాగుతున్న, కౌన్ బనేగా బీజేపీ అధక్ష్ కహానీలో ఒక అధ్యాయం ముగిసింది. అయితే,అసలు కథ ఇప్పుడే మొదలైందని, రాజకీయ పరిశీలకులు  భావిస్తున్నారు. ముఖ్యంగా,రామచంద్ర రావు ఎన్నిక లేదా ఎంపికలో బీజేపీ అధిష్టానం అనుసరించిన ప్రమాణాల విషయంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది.రామచంద్ర రావు, ఎన్నికతో, కమల దళంలో పాత – కొత్తల విభజన రేఖ మరో మారు ప్రముఖంగా చర్చకు వచ్చింది.  తెలంగాణలోనే కాకుండా, పొరుగు రాష్ట్రం ఎపీలోనూ, అదే యార్డ్ స్టిక్’ ఆధారంగా’ పీవీ మాధవ్’కు పార్టీ పగ్గాలు అప్పగించారనే ప్రచారం జరగడంతో,ఇప్పడు పార్టీలో కొత్తగా చేరిన వారి పరిస్థితి ఏమిటి? ఎప్పటికీ, పల్లకీ మోయడ మేనా? అనే ప్రశ్నఇప్పుడు పార్టీ నేతల్లో ప్రముఖంగా చర్చకు వస్తున్నట్లు తెలుస్తోంది. 

ముఖ్యంగా పార్టీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన నాయకులలో, ‘కొందరు’ ఈ పరిస్థితిని జీర్ణించుకోలేక పోతున్నారని అంటున్నారు.   అయితే, ఇదేమీ కొత్తగా తెచ్చిన నిబంధన కాదని, పార్టీ రాజ్యాంగంలో ఉన్నదే అని పార్టీ నేతలు చెపుతున్నారు.పార్టీలో పదేళ్ళ క్రియాశీల సభ్యత్వంతో పాటుగా క్రియాశీల పాత్ర పోషించిన వారికి మాత్రమే పార్టీ సంస్థాగత ఎన్నికల్లోపోటీ చేసే అర్హత ఉంటుందని, వివరణ ఇస్తున్నారు. అలాగే, అధ్యక్ష పదవి ఆశించి భంగ పడిన నాయకులు నొచ్చుకోవడం, సహజమే అంటున్నారు. త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని, దశాబ్దాలుగా పార్టీ సంస్థాగత వ్యవహారాలను దగ్గరగా చూస్తున్న పెద్దలు అంటున్నారు.  


మరోవంక,పార్టీ లోపల వెలుపల కూడా,రామచంద్ర రావుకు అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని ఎవరూ పెద్దగా తప్పు పట్టడంలేదు. ఆయనకు, అధ్యక్షుడు అయ్యేందుకు,అవసరమైన అర్హతలు అన్నీ  ఉన్నాయి. అయితే, ప్రస్తుత రాజకీయ వాతావరణంలో,ఆయనకంటే దూకుడుగా వెళ్ళగలిగే, ప్రత్యర్ధులు ఒకటంటే నాలుగు అనగలిగే, ‘నోటి దురుసు’ ఉన్న నాయకుడు అయితే బాగుండేదని అంటున్నారు. అలాగే, అలాక్లు వహించిన నాయకులు కూడా మెల్లమెల్లగా  సర్దుకుంటున్నారని అంటున్నారు. చివరకు, పోటీలో ప్రముఖంగా వినిపించిన మల్కాజ్ గిరి ఎంపీ  ఈటల రాజేందర్ కూడా, మొదట్లో కొంత నొచ్చుకున్నా,ఆ తర్వాత సర్డుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అయితే, పార్టీ క్యాడర్’లో ఒక వర్గం మాత్రం బీజేపే సెల్ఫ్ గోల్ చేసుకుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.అలాగే సోషల్ మీడియాలోనూ రామచంద్ర రావును, ‘డమ్మీ’ ప్రెసిడెంట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. 

అయితే, రామచంద్ర రావు అందరూ అనుకుంటున్నట్లుగా సౌమ్యుడు కాదని, ఆయన గత చరిత్ర తెలిసిన వారు చెపుతున్నారు. నిజానికి ఎవరో చెప్పడం కాదు, స్వయంగా ఆయనే, ‘‘మీరు అనుకుంటున్నట్లు నేను సౌమ్యుణ్ని కాను. ఉస్మానియా క్యాంప్‌సలో ఉన్నప్పుడు విద్యార్థుల కోసం 14 సార్లు జైలుకు వెళ్లొచ్చా. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నా. జితేందర్‌రెడ్డిని హత్య చేసిన నక్సలైట్లను అరెస్టు చేయాలని నాడు అసెంబ్లీ ముందు ధర్నా చేశా. అప్పుడే లాఠీచార్జిలో నా చెయ్యి విరిగింది. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చెయ్యడం కాదు.. దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడాలి’’ అని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలకు రాంచందర్‌రావు సవాలు విసిరారు. అయితే ఇవ్వన్నీ ఎలా ఉన్నా, రామచంద్ర రావు తన ముందున్న సవాళ్ళను ఎలా, ఎంత సమర్ద వంతంగా ఎదుర్కుంటారనే, దానిపై  ఆయన భవిష్యత్’తోపాటుగా పార్టీ భైశాయ్త్ కూడ ఆధార పడి ఉంటుందని అంటున్నారు.

నిజానికి,రామచంద్ర రావు ముందు, సవాలక్ష సవాళ్ళున్నాయి. ముఖ్యంగా, ఓచేత్తో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా, మరో చేత్తో స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు 2008 అసెంబ్లీ ఎన్నికలవరకు, ఎన్నికల సమరంలోపార్టీని విజయ పథంలో నడిపించడం వరకు, ఎన్నో సవాళ్ళు అయన ముందున్నాయని అంటున్నారు. అలాగే, ఈ అన్నిటినీ మించి, ఆయన ఎన్నికతో పస్పుటంగా పైకొచ్చిన పాత కొత్త విభజన రేఖను తుడిచేసి, సమన్వయంతో పార్టీని ముదుకు తెసుకుపోవడం  రామచంద్ర యో మున్డునన్ అతి పెద్ద సవాలుగా పరిశీలకులు భావిస్తున్నారు.
 

By
en-us Political News

  
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.