వైసీపీ పతనమే బీజేపీ లక్ష్యం!?

Publish Date:Mar 24, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి పార్టీల విషయంలో జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తుంటారు. భారతీయ జనతా పార్టీ నేతలను తమలపాకుతోను, తెలుగుదేశం, జనసేన పార్టీలను తలుపు చెక్కతోను పరామర్శిస్తుంటారు. బిజెపి పట్ల మెతక ధోరణితో ఉంటే మంచిదని భావిస్తుంటారు. కానీ, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కీలక నేత మాత్రం తమ అసలు లక్ష్యం ఏమిటో చాలా స్పష్టంగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పతనాన్ని తమ పార్టీనే శాసిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీని ఖాళీ చేయడం, ఆ పార్టీ ఓటు బ్యాంకును 20 శాతానికి తగ్గించడం లక్ష్యాలని.. ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తావిస్తోంది.

పురందేశ్వరికి ముందు రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడుగా పనిచేసిన సోము వీర్రాజు, అప్పట్లో దూకుడుగా మాట్లాడగల కమలం నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే తమ పార్టీ బలంగా తయారు కావడానికి ఒంటరిగా రాష్ట్రవ్యాప్తంగా పోటీచేయడం బెటర్ అని నమ్మిన వాళ్లలో ఆయన ఒకరు. తెలుగుదేశంతో జట్టు కట్టిన తర్వాత, ఎన్నికల పర్వంలో ముక్తసరిగా వ్యవహరించారు. కానీ, ఎన్నికల్లో విజయం తర్వాత ఎమ్మెల్సీ అవకాశాలు దక్కినప్పుడు అనూహ్యంగా ఆయన పదవి దక్కించుకున్నారు. ఇప్పుడిక కమలదళంలో కీలక నేతగా తమ పార్టీ లక్ష్యాలు ఏమిటో ఘాటుగానే వివరిస్తున్నారు. 

విశాఖపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. వైసీపీని ఖాళీ చేసేయడమేనని, ఆ పార్టీకి రాష్ట్రంలో 20 శాతం ఓటు బ్యాంకు కూడా లేకుండా చేస్తాం అని సోము వీర్రాజు ప్రకటించారు. అసెంబ్లీకి గైర్హాజరవుతున్న జగన్ తీరును ఆయన రెండునాల్కల ధోరణిగా సోము వీర్రాజుఎద్దేవా చేయడం విశేషం. 2014 లో ప్రతిపక్ష నేత హోదా ఉన్నప్పటికీ అసెంబ్లీకి జగన్ రాలేదని, ఇప్పుడు హోదా కావాలనే సాకుతో మళ్లీ ఎగ్గొట్టారని.. ఇది విడ్డూరంగా ఉన్నదని ఆయన గేలి చేస్తున్నారు. 

జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలతో విరుచుకుపడడం కమలదళంలో సోము వీర్రాజుతో ఆగడం లేదు. జగన్ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనంత నాశనం రాష్ట్రానికి చేశారని, ఎందుకూ పనికి రాని భూములను సెంటు స్థలం పేరుతో పేదలకు పంచి వారిని వంచించారని విష్ణుకుమార్ రాజు ఆరోపిస్తున్నారు. 

మొత్తానికి రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్ ఎటాక్ కు దిగుతున్నది.  వైసీపీని ఖాళీ చేయడం అనేది కూటమి లక్ష్యం అని సోము ప్రకటించినప్పటికీ.. బిజెపి ఆ ఎజెండాతో ఉన్నదని అర్థం అవుతోంది. ఆ నడుమ విశాఖ వైసీపీ నేత అడారి ఆనంద్ బిజెపిలోనే చేరారు. విజయసాయిరెడ్డి కూడా బిజెపిలో చేరుతారనే  వదంతులున్నాయి. ముందు ముందు ఇంకా పలువురు వైసీపీ నేతలకు బిజెపి ఎర వేస్తున్నదేమోనని సోము మాటలను బట్టి పలువురు అనుకుంటున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం గుట్టు రట్టౌతోంది. ఈ కుంభకోణంలో నిప్పులాంటి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా వాస్తవాలను నిర్భయంగా బయటపెడుతున్నారు బాధితులు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన 15 మామిడి పండ్ల షిప్ మెంట్ లను దేశంలోని వివిధ ఎయిర్ పోర్టుల్లో అధికారులు నిలిపివేశారు. సరైన పత్రాలు లేవనే కారణం చూపుతూ వాటిని దేశంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. వీటి విలువ 5 లక్షల అమెరికా డాలర్లు.
ఇప్పటికే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక టోర్నీలు జరగట్లేదు. ఇకపై ఇతర అంతర్జాతీయ టోర్నీల్లో కూడా పాక్‌తో తలపడొద్దని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పాక్‌ను ఏకాకిని చేసే వ్యూహంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
బీఆర్ఎస్ లో తలెత్తిన సంక్షోభం సర్దు మణిగిందా? అంటే గులాబీ పార్టీ నేతలు అవుననే అంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య తలెత్తిన వారసత్వ లేదా నాయకత్వ వివాదం ప్రస్తుతానికి సర్డుమణిగినట్లే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముందుతరం నేతలు.
పార్టీ బతికి బట్టకట్టాలంటే మోడీయే దిక్కు అంటున్న వైసీపీ సీనియర్లు వైసీపీ బతికి బట్టకట్టాలంటే మోడీని శరణు జొచ్చడం వినా మరో మార్గం లేదని వైసీపీ సీనియర్లు భావిస్తున్నారా?
పాతిక వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తెలుగువన్ రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్ రజతోత్సవ సభకు నిండుదనం తెచ్చారు
తెలుగువన్ డిజిటల్ మీడియా ప్రయాణం 2000 సంవత్సరంలో ప్రారంభమై నేడు 400 ఛానల్స్‌తో ప్రతి దేశంలో ఉందంటే అందదుకు రవిశంకర్ కృషి, పట్టుదలే కారణమన్న చంద్రబాబు.. తాను విజన్ రూపొందిస్తే దానికి సమానంగా ఆయన కూడా ఛానల్‌ అభివృద్ధిలో విజన్ రూపొందించుకుని ముందుకెళ్తున్నారన్నారు.
హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లిలో ఒక మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
 తెలుగుదేశం పార్టీ నాయకుడిపై వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ ​దాడికి పాల్పడ్డాడు. రాజధాని పరిధిలోని ఉద్దండరాయుని పాలెంలో టీడీపీ నేత రాజుపై నిన్న రాత్రి నందిగం సురేష్​, అతని అన్న ప్రభుదాసు దాడికి పాల్పడ్డారు
హైదరాబాద్ గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రమాద వివరాలు తెలిసి అత్యంత షాక్‌కు, బాధకు గురయ్యానని ఆయన తెలిపారు.
హైదరాబాద్ గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి ఎక్స్ ద్వారా తెలిపారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున సుప్రభాత సేవ ముగిసిన తర్వాత వీఐపీ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌.డి రేవణ్ణ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇండియన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, నటి ఐశ్వర్య రాజేష్, నటుడు వైభవ్, ఆది పినిశెట్టి ఆయన సతీమణి నిక్కీ గల్రాని శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.