Publish Date:Jul 12, 2022
ఒక డెబ్బయ్యేళ్ల పెద్దాయన తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. చాలాసేపు కబుర్లాడుకున్నారు. తర్వాత ఇంటికి అని బయలు దేరాడు. కానీ దారి మర్చిపోయాడు. ఆ సంగతి గ్రహించి ఆయన స్నేహితుడి కొడుకు కార్లో ఇంటి దగ్గర దింపి మరీ వెళ్లాడు. ఇది మతిమరుపునకు పరాకాష్ట.. అంటూ మనవరాలు అందరికీ చెబుతూ తెగ నవ్వుకుంది ఓ పూటంతా. పిల్లలకు, విన్నవాళ్లకు సరదాగా, నవ్వులాటగానే వుంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు తాలూకు బాధ అనుభవిస్తేగాని వివరించ డం చాలా కష్టం. మనిషంటే మరచిపోయాడు, పావురం మరచిపోవడమేమిటి?
పక్షులు చాలా దూరమూ వెళుతూంటాయి, మళ్లీ అదే దారిలో తిరిగి వస్తూంటాయి. అది వాటి సహజ లక్షణం. కానీ బ్రిటన్కి చెందిన ఒక పావురం ఒకటీ రెండు కాదు ఏకంగా నాలుగు వేల మైళ్లు దూరం వెళ్లి ఇంటికి దారి మర్చిపోయింది!
ఒక బ్రిటన్ పావురం యుఎస్లో 4,000 మైళ్ల దూరంలో ఎగురుతూ చాలా దూరం వెళ్లింది. చాలాసేపటికి అది బ్రిటన్లోని టైన్సైడ్ ప్రాంతానికి వస్తూ ఇంటి దారి కోల్పోయింది. దాన్ని ఆ తర్వాత పక్షుల సంరక్షణ నిపుణులు గుర్తించి పట్టుకున్నారు. ఈ రేసింగ్ పక్షి విలువ 1,000 పౌండ్ల కంటే ఎక్కువ అని అధికారులు చెప్పారు.
మూడు వారాల క్రితం, ఛానల్ దీవులలోని గ్వెర్న్సీ నుండి హోమింగ్ పావురం బయలుదేరింది. అది ఇంగ్లాండ్ ఈశాన్య ప్రాంతం లోని తన ఇంటికి తిరిగి పోటీ చేయవలసి ఉంది ప్రయాణం అతనికి 10 గంటలు పట్టింది. అయితే, బహుమతి పొందిన పావురం తప్పిపోయింది దానికి ఏమి జరిగిందో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. బాబ్ అనే పేరున్న ఈ రేసింగ్ పావురం వారం రోజుల క్రితం ఛానెల్ ద్వీపం నుంచి వెళ్లింది. గట్టిగా పది గంటలు పట్టింది ఆ ప్రయాణం. అయితే ఆ పావురం కనిపించకపోవడంతో చాలామంది అది ఎక్కువగా కనిపించే ప్రాంతాలన్నీ వెతికారట. అది వాస్తవానికి ఇంగ్లండ్ ఈశాన్యప్రాంతానికి తిరిగి రావాలి. అది తన గూడు వున్న ప్రాంతం. అది వెళ్లిన సంగతీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అది కనపడటం లేదన్న వార్త గుప్పుమంది. అంతే రోజూ దాన్ని చూస్తూ ఆడుకునే పిల్లలంతా దిగులుపడ్డారు.
ఈ మిస్టరీని జూలై ఆరో తేదీన పరిష్కరించారు. ఆ రోజు అలబామాలోని మాన్రో అనే వూళ్లో ఓ పెద్దాయన తోటలో కనపడిందట. ఆ తోట దానికి ఎంతో నచ్చినట్టుంది. అక్కడే వుండడానికి ఇష్టపడింది. బాబ్ అని పిలిచే ఈ పావురం కాళ్లకి ఏదో బ్యాండ్ కట్టి వుంది. దానితో ఇది సముద్రానికి అవతల వేపు యునైటెడ్ కింగ్డమ్కి చెందినది అని పక్షుల సంరక్షణ విభాగం వారు కనుగొన్నారు. అంత దూరం నుంచి వచ్చినా బాబ్ ఆరోగ్యంగానే వుందని అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ పావురం యుకెలోని విన్ టా లోన్ నివాసి అలాన్ టాడ్కి చెందినదని తేలింది. బాబ్ కొంత దూరం ప్రయాణించిన తర్వాత పొరపాటున అట్లాంటా వెళ్లే ఓడ మీద వాలి అలా సముద్రానికి అవతలి తీరం వేపు వెళ్లిందట!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bird-lost-its-way-back-25-139518.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.