అటు బీహార్ ఎన్నికతో పాటు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా విడుదలైంది. నవంబర్ 6, 11వ తేదీల్లో బీహార్ లో రెండు విడతల పోలింగ్ జరగనుండగా.. అదే నెల 14న ఫలితాలు విడుదల కానున్నాయి. బీహార్ సీట్ల సంఖ్య 243 కాగా, ఓటర్ల సంఖ్య 7. 43 కోట్లుగా ఉంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంగతేంటని చూస్తే.. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఈ నెల 13 నుంచి నామినేషన్లను స్వీకరించనుండగా.. 21 తుదిగడువు. 22వ తేదీ పరిశీలన, 24వ తేదీ ఉపసంహరణ. కాగా నవంబర్ 14న ఈ ఉప ఎన్నిక ఫలితం కూడా తేలనుంది.
ఈ రెండు ఎన్నికలు కాంగ్రెస్ కి ఎంత కీలకమంటే.. ఒక పక్క దేశ వ్యాప్తంగా రాహుల్ ఓట్ల చోరీ ప్రచారం చేయడంతో పాటు బీహార్ లో ప్రత్యేకించి ఆయన యాత్ర నిర్వహించారు. ఎందుకంటే బీహార్ లో సుమారు 45 లక్షల ఓట్లు తొలగించడంతో.. రాహుల్ పెద్ద ఎత్తున ఓట్ల చోరీ పై ప్రెజంటేషన్లిచ్చి.. ఈసీ ని ఇరుకున పెట్టే యత్నం చేశారు. ఈసీ బీజేపీ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. దీనిపై రియాక్టయిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఆధారాలతో సహా కంప్లయింట్ చేయాలని రాహుల్ కి సూచించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు తగవని వారించారు. తాను ప్రత్యేకించీ ఆధారాలు చూపించనక్కర్లేదనీ.. తన ప్రెజంటేషన్లు తీసుకుని వాటిపై మీరు స్పందించాలంటూ కౌంటర్ ఇచ్చారు రాహుల్.
ఏది ఏమైనా రాహుల్ ఓట్ల చోరీ ప్రచారమంతా కూడా బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిందే. దానికి తోడు ఆయన ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేసిన యాత్ర కూడా ఇదే చెబుతోంది. ఇప్పుడు రాహుల్ ఓట్ చోరీ ప్రచారం జనం నమ్మారా లేదా? అన్నది ఈ ఎన్నికల ఫలితం తేల్చేస్తుందంటున్నారు పరిశీలకులు. కాబట్టి ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాలను బటి కాంగ్రెస్ ఎలిగేషన్లు జనం సీరియస్ గా తీస్కుంటున్నారా లేదా? అన్నదానిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
ఇక చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఇప్పటికే ప్రతిపక్షం బీఆర్ఎస్ తమ అభ్యర్ధిగా మాగంటి సతీమణి సునీతను ప్రకటించింది. అధికార కాంగ్రెస్ మాత్రం ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ బై పోల్ కూడా కాంగ్రెస్ కి అగ్ని పరీక్షేనని చెప్పాలి. రేవంత్ సర్కార్ హైదరాబాద్ లో హైడ్రా ప్రయోగం ద్వారా చేసిన మేలు ఎలాంటిదో చెప్పలేం కానీ.. జనం మాత్రం బ్యాడ్ గా ఫీలవుతున్నారని ప్రచారం జరుగుతోంది. దానికి తోడు హరీష్ రావ్ ఇక్కడ ఎక్కువగా ఉన్న మైనార్టీ ఓటు బ్యాంకును టార్గెట్ చేస్కుని.. ఈ కమ్యూనిటీకి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారు.
ఆపై ఇక్కడ అధికంగా ఉండే సినీ జనం, అందునా ఎక్కువగా ఉండే కమ్మ సామాజిక వర్గం. వీటన్నిటినీ కవర్ చేయడానికి మాగంటి సామాజిక వర్గం సరిపోతుందని భావిస్తోంది కారు పార్టీ. దీంతో ఈ గెలుపు తమకు నల్లేరు నడకే అన్న ఊహల్లో ఉంది గులాబీ దండు. అయితే కాంగ్రెస్ మాత్రం ఎట్టకేలకు జూబ్లీహిల్స్ ద్వారా మరో కంటోన్మెంట్ రిజల్ట్ రిపీట్ చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. ఇక ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ అయితే ఈ సీటు ఎలాగైనా సరే కైవసం చేసుకోడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా బీహార్ పోల్, జూబ్లీ బై పోల్ కాంగ్రెస్ కి రెఫరండంగా మారనున్నాయనే అంటున్నారంతా. మరి చూడాలి.. ఈ ఫలితాలు కాంగ్రెస్ కి ఎంత అనుకూలంగా వస్తాయో తెలియాలంటే మనం నవంబర్ 14 వరకూ ఎదురు చూడాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bihar-elections-key-for-congress-25-207478.html
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.
తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.