Publish Date:Aug 10, 2022
బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం కుప్పకూలి మహాఘట్ బంధన్ ప్రభుత్వం కొలువు దీరింది. ఇందుకు సంబంధించిన పరిణామాలు వాయువేగంతో జరిగాయి. రాజకీయంగా దేశంలో అత్యంత శక్తిమంతులు అని అంతా భావించే మోడీ షా ద్వయం చేష్టలుడిగి నిలబడిపోయేలా జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి వేగంగా పావులు కదిపారు.
ఒక్క రోజులోనే ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం.. బీహార్ లో కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, మహాఘట్ బంధన్ తో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. బీహార్ లో ఈ పరిణామాలు చోటు చేసుకోవడానికి మాత్రం పూర్తి కారణం మాత్రం మోడీ, షా ద్వయం వ్యవహార శైలే. బీజేపీ ఆధిపత్య ధోరణే అని చెప్పడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే మిత్రధర్మాన్ని ఉల్లంఘించి కనీసం జేడీయూ అధినేత అయిన నితీష్ కుమార్ తో సంప్రదించకుండానే ఆర్పీసింగ్ కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అది రుచించని నితీష్ ఆర్పీసింగ్ కు మరో సారి రాజ్యసభ కు పంపించేందుకు టికెట్ ఇవ్వలేదు. దాంతో అనివార్యంగా ఆర్పీసింగ్ కేంద్ర మంత్రి పదవి కోల్పోయారు. అలాగే సంకీర్ణ ధర్మాన్ని ధిక్కరించి అడుగడుగునా పాలనలో జోక్యం చేసుకోవడంతో నితీష్ ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.
ఆర్పీసింగ్ ను అడ్డం పెట్టుకుని బీహార్ లో మహారాష్ట్ర ప్లాన్ అమలు చేయాలన్న బీజేపీ వ్యూహాలను పసిగట్టిన నితీష్ కుమార్ ప్రతి వ్యూహాలను అమలు చేశారు. అందులో భాగంగానే ఆర్పీసీంగ్ కు రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించ లేదు. అనివార్యంగా ఆయన కేంద్ర మంత్రి పదవిని వదులుకునేలా చేశారు. అంతే కాకుండా ఆర్పీసింగ్ కుమార్తె అవినీతిపై ప్రశ్నించడంతో ఆర్పీసింగ్ జేడీయూకి రాజీనామా చేసే పరిస్థితి కల్పించారు. అక్కడితో జేడీయూకి ఎన్డీయేతో బంధం తెగిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. చివరికి అదే జరిగింది.
దాదాపు నెల రోజులుగా నితీష్ బీజేపీతో అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ సమావేశానికి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జులై 17న అమిత్షా నిర్వహించిన సమావేశానికి, రామ్నాథ్ కోవింద్కు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి, గత నెల 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారానికి కూడా నితీశ్ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన మహాఘట్ బంధన్ లో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ శిష్యుడిగా అవినీతి వ్యతిరేక పోరులో పాల్గొని రాజకీయంగా ఎదిగిన నితీష్ ఏ కూటమిలో ఉన్నా తన సెక్యులర్ భావాలను మాత్రం వీడలేదని ఆయన అభిమానులు చెబుతుంటారు.
సమయం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆయన కూటమిలోని పార్టీల అవినీతిని, సెక్యులర్ వ్యతిరేక భావనలను నిలదీస్తనే ఉన్నారు. ప్రశ్నిస్తూనే ఉన్నారని చెబుతుంటారు. తాజాగా బీహార్ పరిణామాలు జాతీయ స్థాయిలో సెక్యులర్ శక్తుల పునరేకీకరణకు మార్గం సుగమం చేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలకు బలం చేకూర్చే విధంగానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా చేసిన ప్రసంగంలో మోడీ పాలనకు 2024లో శుభం కార్డు పడుతుందని నితీష్ చేసిన పకటన ఉంది. అలాగే మాజీ ప్రధాని దేవెగౌడ కూడా బీహార్ పరిణామాలు సెక్యులర్ శక్తుల పునరేకీకరణకు మార్గం సుగమం చేశాయని అభిప్రాయపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bihar-developements-a-shock-to-modi-sha-39-141705.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.