కుమారుడి విజయం కోసం టీటీడీ నిధులు.. భూమన భారీ స్కెచ్!?

Publish Date:Oct 20, 2023

Advertisement

గతంలో రాజకీయ నాయకులు ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ జేబులోని నగదు తీసి ఖర్చు పెట్టే వారు. అంటే సొంత డబ్బును ప్రజల కోసం వినియోగించేవారు. అయితే రానురాను  ఆ పరిస్థితి మారింది. ఏపీ సీఎం జగన్ భాషలో చెప్పాలంటే రివర్సైంది. దాంతో  రాజకీయమే కాదు.. రాజకీయ నాయకులూ మారిపోయారు. దీంతో ఈ నయా రాజకీయ నాయకులు సొంత సొమ్మును తమ ఇళ్లలోని ఇనపెట్టిల్లో, లేకుంటే బ్యాంకు లాకర్లలో.. అదీ కాకుంటే తమ బ్యాంకు ఖాతాల్లో భద్రంగా దాచుకోని..  ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న నగదును వివిధ పథకాల రూపంలో అదే ప్రజల కోసం వినియోగిస్తూ.. తమ జేబులో నుంచి కోట్లకు కోట్ల రూపాయిలు తీసి..చెల్లిస్తున్నట్లుగా  బిల్డప్ ఇస్తున్నారు.   అయితే టీటీడీ  చైర్మన్ కం తిరుపతి ఎమ్మెల్యే అయిన భూమన కరుణాకరరెడ్డి మాత్రం ఒక అడుగు ముందుకు వేసి  దేవుడికి ముడుపులు రూపంలో భక్తులు చెల్లిస్తున్న నగదును   ప్రజావసరాల  పేరుతో సొంత లాభం కోసం వినియోగించేందుకు వీలుగా  నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ నిర్ణయమే తీవ్ర వివాదాస్పదంగా మారింది.  విషయమేమిటంటే..

 తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌,తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షన తాజాగా  జరిగిన టీటీడీ  పాలక మండలి సమావేశంలో టీటీడీకి వార్షిక  బడ్జెట్‌ నిధుల్లో ఒక శాతాన్ని తిరుపతి అభివృద్ధి కోసం వినియోగించాలని  నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

శ్రీవారు కొలువు తీరిన తిరుమల కొండపై ఇప్పటికే ఆచార వ్యవహారాలు కొండెక్కాయని ఇప్పుడు దేవుడి నిధులను కూడా పక్కదారి పట్టించేయడానికి నిర్ణయం తీసుకున్నారని ఈ నిర్ణయంపై పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో  తన కుమారుడు  భూమన అభినయ్ రెడ్డికి టికెట్ ఇచ్చి గెలుపించుకొనేందుకే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ హోదాలు తిరుపతి అభివృద్ధికి  టీటీడీ బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాలని నిర్ణయించారని అంటున్నారు.  అయినా టీటీడీ వార్షిక బడ్జెట్ వందల, వేల కోట్ల రూపాయిల్లో ఉంటుందని.. అందులో ఒక శాతం అంటే.. దేవుడి సొమ్ము కోట్లాది రూపాయిలు కైంకర్యం చేసేందుకు భూమన స్కెచ్ వేశారని అంటున్నారు.  

అయినా దేశంలో ఎక్కడా కూడా దేవాలయాలపై వచ్చే సొమ్మును ఇతర అవసరాల కోసం ఖర్చు చేయడం  లేదని  గుర్తు చేస్తున్నారు. అదీకాక జగన్ ప్రభుత్వ ఖజానాలో నిధులు నిండుకొన్నాయని.. దీంతో రాష్ట్రంలోని ఏ పట్టణం, ఏ నగరం అభివృద్ధికి నోచుకోలేదని.. దీంతో దేవుడి నిధులు తిరుపతి అభివృద్ధికి మళ్లీస్తే.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నగరాన్ని  అభివృద్ధి చేశానంటూ.. ప్రజలకు చెప్పుకుని, మా అబ్బాయిని గెలిపిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పుకుని ఓట్లు దండుకునేందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల శ్రీవారి సొమ్మును తిరుపతి అభివృద్ధి కోసం మళ్లించే నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయినా గతంలో  తాను నాస్తికుడినని బాహాటంగా చెప్పి.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని నల్లరాయి అన్న  భూమన   కరుణాకర్ రెడ్డికి టీటీడీ బోర్డ్ చైర్మన్ గా నియమించిన నాడే.. జగన్ పై విరమ్శలు వెల్లువెత్తాయి.

వినాశకాలే విపరీత బుద్ధీ అంటూ నాడే నెటిజన్లు ఓ రేంజ్ లో జగన్ పై విమర్శలు గుప్పించారు.    పద్దతికే అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్‌లాగా నిలువు బొట్టు పెట్టి.. తనకు మాత్రమే సాధ్యమైన అభినయంతో మాట్లాడుతూ.. తాను గతంలో అన్న మాటలు జనం మరిచిపోయారన్న భ్రమలో  పరమ భక్తుడిలాగా బిల్డప్ ఇచ్చుకునే భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు టీటీడీ బడ్జెట్ నుంచి తిరుపతి అభివృద్ధికి నిధుల మళ్లింపు నిర్ణయంతో తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం.. ఓ ధార్మిక కేంద్రం అన్న సంగతిని ఈ ప్రభుత్వం ఎప్పుడో మరిచిపోయిందని.. ఇది ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని.. అదీకాక   టీటీడీని జగన్ సర్కార్ కామధేనువుగా భావించి ఇష్టారీతిన పద్ధతులు పాటించకుండా దోపిడీయే లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు అన్ని వర్గాల నుంచీ వస్తున్నాయి. ఇందుకు  తార్కానంగా ప్రభుత్వం ఇటీవల నియమించిన టీటీడీ బోర్డు సభ్యులను ఉదహరిస్తున్నారు.  అయినా కరుణాకర్ రెడ్డి తన కుమారుడి  విజయం కోసం దేవుడు సొమ్మును ఇలా వాడుకొవడం చూస్తుంటే.. ఆయన ఓ రాజకీయ ఘనపాటి అని వారు సెటైరికల్‌గా అభివర్ణిస్తున్నారు. 

అదీకాక ఇప్పటికే టీటీడీ అంశంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై భక్తులు, విపక్షాలు మండిపడుతుండగా.. తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

By
en-us Political News

  
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.