హైదరాబాద్ టు భోగాపురం.. భోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయన తొలి విమానం.!

Publish Date:Aug 16, 2026

Advertisement

విజయనగరం జిల్లా భోగాపురం  అంతర్జాతీయ విమానాశ్రయం' నుంచి వాణిజ్య విమాన సర్వీసులు సోమవారం (ఆగస్టు 17) అధికారికంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో 6ఇ6408 విమానం ఉదయం 6:45 గంటలకు భోగాపురం రన్‌వేపై  ల్యాండ్ అవ్వడంతో ఇక్కడ కార్యకలాపాలు  అఫీషియల్ గా ఆరంభమయ్యాయి. 

నూతన విమానాశ్రయానికి చేరుకున్న తొలి విమానానికి, అందులోని ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ నిర్వాహక సంస్థ జీఎంఆర్, పౌర విమానయాన శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలి ప్రయాణానికి గుర్తుగా ప్రయాణికులకు ధ్రువీకరణ పత్రాలతో పాటు, స్థానిక సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికలుగా అందజేశారు. దీని తర్వాత కొద్దిసేపటికే బెంగళూరు నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూడా ఇక్కడ ల్యాండ్ అయింది.

భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో, విశాఖపట్నంలోని పాత ఎయిర్‌పోర్ట్ నుంచి నడిచే పౌర విమాన సర్వీసులన్నింటినీ ఇక్కడికి మార్చారు. తొలిరోజే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి దేశంలోని ప్రధాన నగరాలకు విమానాలు ఇక్కడనుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. సోమవారం (ఆగస్టు 17) మొత్తం 31 సర్వీసులు నడవనుండగా,   7 వేల మంది రాకపోకలు సాగించనున్నారు. ఇక విశాఖ నుంచి  ఆదివారం(ఆగస్టు 16) 10.45 గంటలకు చివరి విమానం ఢిల్లీకి బయలుదేరింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి వాణిజ్య సేవలు నిలిచిపోయాయి.

భోగాపురం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు విమానాశ్రయం ప్రారంభమవ్వడం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాలు వేగంగా విస్తరించేందుకు ఇది  దోహదపడుతుందంటున్నారు.  

Bhogapuram, International, Airpori, !stFilght, From Hyderabad, Landed

By
en-us Political News

  
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌లో పేద, మధ్యతరగతి వర్గాలకు మరింత నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా
జాగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలోని కొండగట్టు ఘాట్ రోడ్డు సమీపంలో ఒక దిగ్భ్రాంతికర ప్రమాదం చోటుచేసుకుంది.
లైంగిక పటుత్వ పరీక్షకి కోర్టు గ్రీన్ సిగ్నల్..!
ఏపీలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను పూజలు చేసినట్లు ముఖ్యమంత్రి వద్ద ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని సవాల్‌ చేశారు.
92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు..!
ఏపీ అసెంబ్లీలో సత్యకుమార్, లోకేష్ సరదా సంభాషణ..!
తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అశాంతి ఆ దేశం స్వాతంత్ర్య వేడుకల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.  పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో  నిర్లిప్తత కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దేశ వ్యతిరేకత వ్యక్తమైంది.
నా బిడ్డకు బతుకునిచ్చారు సార్.. మీరే పేరు పెట్టండి..!
బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన..!
కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తమిళనాడు రైతు ప్రయోజనాలను,  సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున వరుసగా 12 రోజుల పాటు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అసలు జగన్ హయాం అంతా అక్రమాలు, అవినీతి మయం అని విమర్శించిన ఆయన ముఖ్యంగా గ్రూప్ వన్ నియామకాలలో చోటు చేసుకున్నటువంటి కుంభకోణాన్ని తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు
జీవితమంతా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు, ఉద్యోగ విరమణ తర్వాత దక్కాల్సిన ఫలాలు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.