వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేసి.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి వ్యవసాయమే వ్యాపకంగా బతుకుతున్నానని ఎంతగా చెప్పుకున్నా.. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు, కబ్జాలు ఆయనను ఇప్పటికీ వెన్నాడుతూనే ఉన్నాయి. మద్యం కుంభకోణంలో ఆయన నిందితుడిగా ఉన్నారు. విజయసాయి పాపాలు ఆయననే కాకుండా ఆయన సన్నిహితులనూ వెన్నాడుతున్నాయి. తాజాగా భిమిలీ బీచ్ లో భూ కబ్జాలకు సంబంధించి విజయసాయి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టు 17 కోట్ల 46 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ భీమిలి బీజ్ లో భూమి కబ్జా 2021లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. అప్పట్లో విజయసాయి రెడ్డి వైసీపీలో కీలక వ్యక్తిగా ఉన్నారు. అప్పట్లో భమిలీ బీచ్ లో కొంత భాగాన్ని ఆక్రమించి నేహారెడ్డి భారీ నిర్మాణాలకు ఉపక్రమించారు. ప్రహారీగోడ నిర్మించారు. దీనిపై కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత దర్యాప్తు చేపట్టింది.
దర్యాప్తులో నేహారెడ్డి బీచ్ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు తేలింది. దీంతో ఆ నిర్మాణాలను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేయడం కూడా జరిగింది. నేహా రెడ్డి నిషేధిత ప్రాంతాలలో నిర్మాణం చేపట్టారని ఖచ్చితమైన ఆధారాలు లభించడంతో.. ఆగస్టు 1 నుండి బీచ్ స్థలం ఆమె ఆక్రమణలో ఉన్నన్ని రోజులూ రోజుకు 1.2 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అంతే కాకుండా భీమిలి పరిరక్షణ కోసం నియమించబడిన 16.9 చదరపు మీటర్ల నిషిద్ధ స్థలంలో జరిగిన అక్రమ నిర్మాణాలను పునాదులతో సహా క్లియర్ చేయాలని ఆదేశించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bhimili-beach-land-kabza-39-203269.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.