మోడీ టార్గెట్ గా ఢిల్లీకి దీదీ! ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యేనా?

Publish Date:Jul 26, 2021

Advertisement

ఆమె ఎమ్మెల్యే కాదు .. కానీ,ఆమె ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆమె ఎంపీ కూడా కాదు ... కానీ, ఆమే ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు. ఇంతకీ ఆమె ఎవరు? ఇంకెవరు.. తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇప్పటికే బెంగాల్ అసెంబ్లీ సభ్యురాలు కాకుండానే, ముఖమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మమతా బెనర్జీ, తాజాగా ఎంపీ కాకుండానే తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ గానూ ఎన్నికయ్యారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఎంపీలంతా కలిసి తమ అధినేత్రిని మమతా బెనర్జీని పార్లమెంటరీ పార్టీ  ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎమ్మెల్యే కాకుండా మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వారు గతంలోనూ ఉన్నారు. కానీ ఇలా ఎంపీ కుండానే పార్లమెంటరీ పార్టీ నాయకులుగా ఎన్నికైంది మాత్రం ఇద్దరే ఇద్దరు. ఒకరు సోనియా గాంధీ (1998) రెండు మమతా బెనర్జీ. చివరకు ఇందిరా గాంధీ కూడా  ఎంపీగా ఓడిపోయిన సందర్భంలో (1977) యశ్వంత రావు చౌహాన్ ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుని చేశారు. ఆయనే ప్రతిపక్ష నాయకునిగానూ బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కి, ఆమె రాత్రికి రాత్రి దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితి  విధించి.. ఆరేళ్ళు నియంత పాలన సాగించారు అనుకోండి. అయితే అప్పట్లో, నియంతగా,  హిట్లరమ్మగా ప్రసిద్ధి చెందిన ఇందిరకు కూడారాని అద్భుత ఆలోచన మమతా బెనర్జీకి వచ్చింది. ఎంపీ కాకుండానే పార్లమెంటరీ పార్టీ నాయకురాలయ్యారు.ఒకటనేముంది, పార్టీలోని అన్ని కీలక పదవులు ఆమె గుప్పిట్లోనే ఉంచుకున్నారు. ఒకప్పుడు ఇందిరా గాంధీ మంత్రివర్గంలో ఆమె ఒక్కరే మగాడు మిగిలిన వాళ్ళంతా అంతే అనే జోక్ ప్రచారంలో ఉండేది. ఇప్పుడు ఆ జోక్ మమతా దీదీకి సరిపోతుంది. 

మమతా బెనర్జీ అడుగులు మెల్ల మెల్లగా జాతీయ రాజకీయాల వైపు పడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.ఇందులో భాగంగానే మమతా బెనర్జీ ఈ నెల (జులై) 28 న ఢిల్లీ చేరుతున్నారు. అదే రోజున ప్రధాని నరేంద్ర  మోడీతో అధికార సమావేశంలో పాల్గొంటారు. ఇక అక్కడినుంచి నుంచి మోడీతో, ‘ఢీ’ కొనే ఆట మొదలవుతుందని, ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతా కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్న దీదీ, ఆ ఎన్నికల తర్వాత తోలి సారిగా ఢిల్లీ వస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా అన్నిపార్టీలను ఏకం చేయడమే దీదీ ఢిల్లీ దండయాత్ర  ప్రధాన అజెండాగా పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె   వివిధ పార్టీల అగ్రనాయకులతో సమావేశమవుతారు. ఇలా అన్ని పార్టీల నాయకులను సమన్మయ పరిచే బాధ్యతను, మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరంకు అప్పగించారు. ఆమె ఢిల్లీ వచ్చేసరికి, పవార్, చిదంబరం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారని, ఆపై వ్యవహారం అంతా మమతా బెనర్జీ చుకుకుంటారని అంటున్నారు.  ఒక విధంగా చూస్తే మమతా బెనర్జీ, ప్రతిపక్ష నాయకురాలిగా, ప్రతిపక్షాల ప్రదాని అభ్యర్ధిగా తనను తాను ప్రకటించుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే పని మీద తృణమూల్ ప్రధాన కార్యదర్శి, మమతా దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, రాజకీయ వ్యూహకర్త, ఈ మొత్తం వ్యవహారం సూత్రధారీ ప్రశాంత్ కిశోర్, నాలుగు రోజుల ముందుగా, జులై 22 నే ఢిల్లీ చేరుకున్నారు. మరోవంక మమతా బెనర్జీ కొందరు ముఖ్య నాయకులతో ఆన్లైన్ మంతనాలు కూడా సాగించినట్లు సమాచారం. ఈ సమావేశానికి కొనసాగింపుగా, 28 సమావేశం ఉంటుంది. అయితే, ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, హస్తం పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా వాద్రా హాజరవుతారా లేదా అనేది తేల లేదు. అయితే సోనియా గాంధీతో మమతా బెనర్జీ భేటీ అవతారని అంటున్నారు. బీజేపీ మాజీ మిత్రపక్షం  శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ కూడా, బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. 

మొత్తానికి, మోడీని ఓడించేందుకు మూడేళ్ళ ముందుగానే జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కాకలు  తీరిన రాజాకీయ ఉద్దండులు అంతా, ప్రశాంత్ కిశోర్ కు జీ హుజూర్ అనడం కొంచెం విద్దురంగా ఉందని, రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తపరిస్తున్నారు. అలాగే, ప్రశాంత్ కిశోర్ ఎవరి తరపున ఈ రాజకార్యం చేస్తున్నారు, అనేది కూడా అనుమానాలకు తావిస్తోందనే మాట కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. 

By
en-us Political News

  
నార్సీ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఫస్ట్ పార్ట్.లో చెప్పడం జరిగింది. ఈ మానసిక వ్యాధిగ్రస్థులకి వుండే మరికొన్ని లక్షణాలను చూద్దాం.
మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే . గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ సిఎం మనీష్ సిసోడియాకు ఇంత వరకు బెయిల్ లభించలేదు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు స్వరూపం ఏమిటో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ బట్టబయలు చేశారు. ఆ యాక్ట్ ను తీసుకువచ్చేసి.. ఇంకా అమలులోకి రాలేదు. పరిశీలనలో ఉంది అంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనల డొల్ల తనాన్ని ఆయన ఒకే ఒక్క ట్వీట్ తో బయటపెట్టేశారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ దొడ్డిదారి యవ్వారాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
జగన్‌కి వున్న మానసిక వ్యాధి గుట్టు రట్టయింది.. ఆ వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’, షార్ట్‌కట్‌లో ‘నార్సీ’ అంటారు.
హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలత తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. ప్రత్యర్థి బిజెపి అభ్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాలని నిర్ణయించాయి.
ఒక నాయకుడు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే వారి మనస్సులు గెలవాలి. అయితే ఇంట్లోనే ఆయన తీరుకు, వైఖరికీ నిరసన వ్యక్తం అవుతుంటే..సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి తమ వారిని నమ్మొద్దని చెబుతుంటే ఆ నేతను జనం ఎలా నమ్ముతారు. ఎందుకు విశ్వసిస్తారు. ముందు ఇంట గెలు.. ఈ తరువాత రచ్చగెలవడం గురించి ఆలోచించు అంటారు కదా?
చంద్రబాబు చండ్ర నిప్పులు చెరిగారు. తన స్వభావానికి విరుద్ధంగా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. స్కిల్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేసిన్పుడు కూడా ఆయన శాంతంగానే ఉన్నారు. న్యాయస్థానాలలోనే తేల్చుకుంటానని, తనపై కేసే తప్పంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఎక్కడా ఆగ్రహం ప్రదర్శించలేదు. జనాలకు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎ వేటు వేసింది. అయితే ఇప్పటికే ఆలస్యమైపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎన్నికల సంఘం తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఫిర్యాదులు, ఆరోపణలకు పూచికపుల్ల విలువ ఇవ్వకుండా ఎన్నికల సంఘం వ్యవహరించిందని అంటున్నారు.
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటిదని చెప్పవచ్చు. పార్టీకి వ్యతిరేక పవనాలు వీచిన 2019 ఎన్నికలలో కూడా ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం విజయం సాధించింది. అయితే దర్శినియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఒకింత భిన్నంగా మారాయి.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (మే6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
డాక్టర్ గౌతమ్ అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ వెంకట మనోజ్ఞకు భర్త. ఈ మేరకు ఆయన ఆదివారం నాడు ఒక షాకింగ్ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన... ‘‘నాపేరు డాక్టర్ గౌత్. నేను సిట్టింగ్ ఎమ్మెల్యే, మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుడిని.
కాపులందరికీ తానే ప్రతినిధినని చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుమార్తె క్రాంతి తీసి అవతల పారేసిన విషయం తెలిసిందే
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కేంద్ర ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించింది. రేపో ఎల్లుండో కొత్త డీజీపీ నియామకం జరగబోతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.