బీఆర్ఎస్ నుంచి సస్పెండైన కల్వకుంట్ల కవిత దీటుగా స్పందించారు. పార్టీకీ, పార్టీద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేశారు. తన సస్పెన్షన్ తరువాత తొలి సారిగా బుధవారం (సెప్టెబర్ 3) మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత తన రాజీనామా ప్రకటన చేశారు. అంతే కాకుండా బీఆర్ఎస్ పైనా, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసుకుని ఓ రేంజ్ లో విమర్శలు కురిపించారు.
పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ, ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ తాను ఒకేలా ఉన్నానని చెప్పిన కవిత.. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా తనను ప్రతిపక్ష ఎంపీగానే చూశారనీ, పార్టీలో ఆరడుగులు బుల్లెట్ గా హరీష్ చెప్పుకుంటారనీ, ఆ ఆరడుగుల బుల్లెట్టే తనను గాయపరిచిందన్నారు. హరీష్ రావు వంటి వారి వల్లనే విజయశాంతి, ఈటల, మైనంపల్లి వంటి పలువురు నాయకులు బీఆర్ఎస్ ను వీడారని కవిత అన్నారు. తనకు పదవులపై ఆశ లేదన్న కవిత పార్టీలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపినందుకే తనపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు.
జన్మజన్మల పుణ్యం కారణంగానే తాను కేసీఆర్ కుమార్తెగా పుట్టానని కవిత అన్నారు. అటువంటి కేసీఆర్ ను, ఆయన పెట్టిన పార్టీనీ ఇబ్బంది పెట్టాలని తాను కలలో కూడా అనుకోనన్నారు. బీఆర్ఎస్ ఉంటే ఎంత.. పోతే ఎంత అని తాను అనలేదని వివరణ ఇచ్చారు. కేసీఆర్ ను ఇబ్బందుల పాలు చేస్తున్న పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని మాత్రమే తాను అన్నానని చెప్పారు. హరీష్ వంటి వారి వల్ల కేసీఆర్ నాయకత్వానికే కాదు.. తన అన్న కేటీఆర్ కు కూడా ముప్పు ఉందని కవిత పేర్కొన్నారు. పార్టీలో జరుగుతున్న తప్పులన్నిటినీ కేసీఆర్ పై మోపుతున్నారని కవిత ఆరోపించారు. ఈ విషయంలో కేటీఆర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పార్టీలో తనపై కుట్రలు జరుగుతుంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరేం చేశారని కవిత కేటీఆర్ ను నలిదీశారు. తాను స్వయంగా తనపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా కూడా కేటీఆర్ స్పందించలేదని ఆరోపించారు. కొందరు కల్వకుంట్ల కుబుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన కవిత.. అందుకే తనను పార్టీ నుంచి బయటకు పంపేశారని కవిత పేర్కొన్నారు. పార్టీని హస్తగతం చేసుకోవాలన్న కొందరు పకడ్బందీగా తనను పార్టీ నుంచి బయటకు పంపారనీ, రేపు ఇదే కేసీఆర్ కు, కేటీఆర్ కు జరుగుతుందన్నదే తన ఆవేదన, బాధ అని కవిత చ చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/beeing-kcr-daughter-is-my-luck-says-kavitha-25-205546.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.