బీసీ కుల‌ గ‌ణ‌నతో కాంగ్రెస్ బిగ్ స్కెచ్‌.. బీఆర్ఎస్‌కు షాక్ త‌ప్ప‌దా?

Publish Date:Nov 3, 2024

Advertisement

 

తెలంగాణ‌లో హ‌స్తం పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని బీసీ జ‌పంతో ఇప్ప‌టి నుంచే టార్గెట్ ఫిక్స్ చేసుకొని ప‌నిచేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ ప్ర‌కారం.. బీసీ కుల‌గ‌ణ‌న చేప‌ట్టేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కుల‌ గ‌ణ‌న పూర్తి చేసి తెలంగాణ నుంచి స‌రికొత్త పొలిటిక‌ల్ వార్ కు శ్రీ‌కారం చుట్టాల‌ని వ్యూహాలు ర‌చిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కుల‌ గ‌ణ‌న‌కు టాప్ ప్ర‌యారిటీ ఇస్తున్నారు. నిత్యం స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ స‌త్వ‌ర నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. తాజాగా హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్ర‌త్యేక క‌మిష‌న్ ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను సీఎం రేవంత్ ఆదేశించారు.

అయితే, కేవ‌లం కుల‌గ‌ణ‌న‌కే ప‌రిమితం కాకుండా రాష్ట్రంలోని బీసీ వ‌ర్గాలను కాంగ్రెస్ పార్టీ వైపున‌కు తిప్పుకొనేందుకు గ్రౌండ్ వ‌ర్క్ కూడా రేవంత్ టీం సిద్ధం చేసుకున్న‌ట్లు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతున్నది. వాస్త‌వానికి బీసీ కుల‌గ‌ణ‌న ద్వారా ఆ వ‌ర్గాల వారికి ల‌బ్ధి చేకూరుతుంది. ఈ క్ర‌మంలో ఆ వర్గాల్లోని మెజార్టీ ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ వైపు షిఫ్ట్ చేసుకునేందుకు ప‌క్కా ప్లాన్ ను కూడా కాంగ్రెస్ అమ‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, రేవంత్ స‌ర్కార్‌ వ్యూహం ఆ పార్టీకి ఏ మేర‌కు లాభిస్తుంద‌నే అంశంపైనా కాంగ్రెస్‌ వ‌ర్గాల్లో విస్తృత‌ చ‌ర్చ  జ‌రుగుతున్నది.

ఈ ఏడాది చివ‌రిలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు కాంగ్రెస్ ప్ర‌భ‌త్వం సిద్ధ‌మ‌వుతోంది. ఈ విష‌యంపై  రెండు రోజుల కిందట మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి   కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డిసెంబ‌ర్ నెల‌లో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని, సంక్రాంతి నాటికి కొత్త పాల‌క వ‌ర్గం కొలువుదీరుతుంద‌ని చెప్పారు. అదే క్ర‌మంలో  ఈనెల 6న బీసీ కులగ‌ణ‌న ప్రారంభించి ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ మేర‌కు కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకుంది. డిసెంబ‌ర్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తుండ‌గా.. ఆ ఎన్నిక‌ల్లో బీసీల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది. అదే స‌మ‌యంలో బీసీ గ‌ణ‌న ద్వారా బీసీల‌కు జ‌రిగే ల‌బ్ధిని ప్ర‌తీ గ్రామంలో తెలియ‌జేయాల‌ని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. గ్రామ క‌మిటీల ద్వారా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని జిల్లా స్థాయి నేత‌ల‌కు పార్టీ పెద్ద‌లు ఇప్ప‌టికే ఆదేశాలు ఇచ్చిన‌ట్లు తెలిసింది. మ‌రో వైపు గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. జ‌నాభాలో ఎక్కువ శాతం ఉన్న బీసీల‌కు ఆ స్థాయిలో ల‌బ్ధిచేకూరేలా చేస్తామ‌ని హామీ ఇచ్చారు. జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం బీసీల రిజ‌ర్వేష‌న్లు పెంచుతామ‌ని, నిధులు కూడా జ‌నాభా ప్ర‌కారం ఆ వ‌ర్గాల‌కు ఖ‌ర్చు పెడ‌తామ‌ని అన్నారు.

 బీసీ కుల‌గ‌ణ‌న‌తో రేవంత్ స‌ర్కార్ మ‌రో బిగ్ ప్లాన్ ను అమ‌లు చేయ‌బోతున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగు తున్నది. తెలంగాణ‌లో బీసీ వ‌ర్గాల్లోని ప్ర‌జ‌లు ఎక్కువ శాతం మంది బీఆర్ఎస్ కు మ‌ద్ద‌తుగా ఉన్నారు. కేసీఆర్‌ ప‌దేళ్ల పాల‌న‌లో బీసీల‌కు ప‌లు ప‌థ‌కాల‌ను అమ‌లు చేసి వారు ఆర్థికంగా బ‌లోపేతం అయ్యేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే, ఆ ప‌థ‌కాల ఫ‌లాలు కింది స్థాయిలో ల‌బ్ధిదారుల‌కు అందే విష‌యంలో కొంత గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. ముఖ్యంగా గొర్రెల పంపిణీ ప‌థ‌కం విష‌యంలో భారీ అవినీతి అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

ప్ర‌స్తుతం రేవంత్ స‌ర్కార్ ఆ ప‌థ‌కంలో అవినీతిపై విచార‌ణ జ‌రుపుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ మెజార్టీ బీసీలు బీఆర్ఎస్ వైపే మొగ్గుచూపారు. అయితే, వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి బీసీల్లోని 60శాతానికి పైగా ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మ‌ళ్లించేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో బీఆర్ఎస్ పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీల‌ను దూరం చేయ‌డం ద్వారా ఆ పార్టీని బ‌ల‌హీన ప‌రచాలన్నదే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది‌. తెలంగాణ‌లో మొద‌టి నుంచి ఎస్సీ సామాజిక వ‌ర్గం, రెడ్డి సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మెజార్టీ బీసీ ఓట‌ర్ల‌ను కాంగ్రెస్ పార్టీ వైపున‌కు తిప్పుకుంటే మ‌రోసారి అధికారంలోకి రావ‌డం ఈజీ అవుతుంద‌ని కాంగ్రెస్ పెద్ద‌లు భావిస్తున్నారు‌. మ‌రి హ‌స్తం పార్టీ నేత‌ల అంచ‌నాలు ఏమేర‌కు నిజ‌మ‌వుతాయో వేచి చూడాల్సిందే.

By
en-us Political News

  
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.