Publish Date:Mar 22, 2025
ఆంధ్ర ప్రదేశ్ అవనిగడ్డలో ఐసిస్ డ్రగ్ కలకలం రేపింది. తాజాగా ఈగల్ టీం దాడుల్లో విస్తుకోల్పోయే నిజాలు వెల్లడయ్యాయి. ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలు వినియోగించే డ్రగ్స్ కృష్ణా జిల్లా అవనిగడ్డ వీధుల్లో లభ్యం కావడంతో అధికారుల ఫీజులు ఎగిరిపోయాయి. ఐసిస్ ఉగ్రవాద సంస్థ వినియోగించే ట్రెమడాల్ అనే సైకో ట్రోపిక్ సబ్ స్టెన్స్( మాదక ద్రవ్యం) ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. గత రెండేళ్ల కాలంలో 55,961 ట్రెమడాల్ ట్యాబ్లెట్లు, 2, 794 ఇంజక్షన్లు అనుమతి లేకుండానే విక్రయాలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అవనిగడ్డలోని భార్గవ్ మెడికల్ హాల్ ఈ చీకటి వ్యాపారాన్ని ప్రారంభించింది నిన్న మొన్న కాదు.2022 నుంచి అమ్మకాలుచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఈ అమ్మకాలను కట్టడి చేయలేకపోయింది. ఐసిస్ డ్రగ్ దందాను నడుపుతున్న భార్గవ్ మెడికల్ షాపుపై కేసు నమోదైంది. మెడికల్ షాప్ యాజమాని కొనకళ్ల రామ్మోహన్ తాను చేసిన నేరాన్ని అంగీకరించారు. చాలాకాలం నుంచి నిషేధిత డ్రగ్స్ అమ్ముతున్నట్లు చెప్పారు. ఈగల్ టీం అధికారులు దాడులు జరపడం ఇదే మొదటి సారి అని రామ్మోహన్ పేర్కొన్నారు.
ఫైటర్ డ్రగ్ గా పిలిచే ఐసిసి డ్రగ్ ను మిలిటెంట్లు శిక్షణ కాలం నుంచే వాడతారు. కొత్తగా రిక్రూట్ అయిన మిలిటెంట్ల కు శిక్షణ ఇచ్చే కాలంలో ఐసిస్ డ్రగ్ వినియోగిస్తే అలసట, నిద్ర రాకుండా ఉంటుందని అధికారులు తెలిపారు, ఎక్కువ సేపు ఉత్తేజంగా పనిచేయటానికి ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఉగ్రవాదులకు ఈ ట్రెమడాల్ మాత్రలను అందిస్తుంటాయి. అందుకే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ''ఐసిస్ డ్రగ్''గా పిలుస్తారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు దాడులుచేసి నిషేధిత డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ ఈగల్ ఐజి రవికృష్ణ తెలిపారు. ట్రెమడాల్ డ్రగ్ ను 2018లో కేంద్ర ప్రభుత్వం నిషేధిత డ్రగ్ జాబితాలో చేర్చింది. అంతే కాదు ఎన్ డిపిఎస్ చట్టం పరిధిలో చేర్చింది. ట్రెమడాల్ ను మాదక ద్రవ్యంగా గుర్తించి కాంబినేషన్, అనుమతించిన పరిమాణంలోనే వైద్యుల సలహా మేరకు వినియోగించాలన్న నిబంధన పెట్టింది.
అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో యువత ఎక్కువగా ఈ నిషేధిత డ్రగ్ వినియోగిస్తున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. వందలాది మంది యువకులు ఈ మత్తుకు బానిసలయ్యారు.ఎన్ డిపిఎస్ చట్టంలోని సెక్షన్ల క్రింద అవనిగడ్డ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
కాగా విశాఖ పట్నంలో కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్న ఐదు మెడికల్ షాపులను అధికారులు సీజ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/banned-isis-drug-racket-in-avanigadda-shocking-facts-in-the-raids-by-the-authorities-25-194830.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.