Publish Date:Dec 31, 2019
2019 ఇక కాలగర్భంలోకి వెళ్తోంది...2020 రాబోతుంది. 2019లో దేశంలో ఊహించని మార్పులు తీసుకువచ్చింది. బ్యాంకింగ్, పార్లమెంట్, ఉగ్రవాదం, ఎన్నికలు, సుప్రీంకోర్టు తీర్పులు కీలక అంశాలుగా నిలిచాయి. ఒక్కో ముఖ్యమైన ఘటన దేశంపై తనదైన రీతిలో ప్రభావాన్ని కనబర్చింది. ముఖ్యంగా 2019 ముఖ్యమైన ఆర్థికపరమైన సంఘటనలకు వేదికైంది. దేశ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసే రీతిలో పలు ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలు చోటు చేసుకున్నాయి. దేశ బ్యాంకింగ్ రంగాన్ని ప్రభావితం చేసే కొన్ని ప్రధాన నిర్ణయాలు 2019లో తీసుకున్నారు. జనవరిలో మొదలైన బ్యాంకుల విలీన ప్రక్రియ ఏడాది చివరి వరకూ కొనసాగింది.
ఒకప్పుడు నాటి ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ తరహా చరిత్రాత్మక నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. పది ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనంచేసి నాలుగు పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. 2017లో 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండగా విలీనాల తరువాత వాటి సంఖ్య 12కు తగ్గిపోయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమైపోయాయి. దాంతో, దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా పీఎన్ బీ రూపుదిద్దుకుంది. ఇండియన్ బ్యాంక్ లో అలహాబాద్ బ్యాంక్ విలీనం కానుంది. కెనరా బ్యాంక్ లో సిండికేట్ బ్యాంక్ కలసిపోయింది. దాంతో, నాలుగో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా కెనరా బ్యాంక్ మారింది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ రెండూ కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యాయి. దీంతో దేశంలో ఐదో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా యూనియన్ బ్యాంక్ నిలిచింది.
మొత్తానికి బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులకు 2019 వేదికైంది. మొత్తం దేశ బ్యాంకింగ్ రంగమే ప్రభావితమయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందిర తర్వాత బ్యాంకింగ్ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రధానిగా మోడీ నిలిచారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/banking-report-2019-india-25-92754.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.