గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ కధేమిటో?

Publish Date:Feb 12, 2013

Advertisement

 

ఒకప్పుడు సినిమాలలో కామెడియన్ గా చిన్నచిన్న వేషాలు వేసే బండ్ల గణేష్, అకస్మాత్తుగా ఒకరోజున పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి తెలుగు చిత్ర సీమలో ఉన్నఅందరు పెద్ద హీరోలు, అగ్ర దర్శకులతో భారీ బడ్జెట్ సినిమాలు తీయడం మొదలు పెట్టినప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిసి రావడంతో సినిమాలు తీయగలుగుతున్నానని ఆయన చెప్పినప్పటికీ, ఆయన వెనుక మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ఒకప్పుడు హైదరాబాదు శివార్లలో కోళ్ళ ఫారం నడుపుకొని బ్రతికే బండ్ల గణేష్, తరువాత కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకొన్నపుడు, తన భూములతో ఆ వ్యాపారంలో ప్రవేశించడం నిజమే అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీసేంత డబ్బు సంపాదించడం మాత్రం నిజం కాకపోవచ్చును.

 

ఆయన మొట్టమొదట రవితేజతో తీసిన ‘ఆంజనేయులు’ సినిమా బోర్లాపడినప్పటికీ, వెంటనే పవన్ కల్యాణ్ తో ‘తీన్ మార్’ అనే మరో భారీ బడ్జెట్ సినిమా తీసాడాయన. కానీ, అది కూడా ఫ్లాప్ అవడంతో ఇక ఆయన పని అయిపోయినట్లే అని అందరూ అనుకొంటున్నతరుణంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ తోనే ‘గబ్బర్ సింగ్’ సినిమా తీసి విజయం సాదించారు. అయితే, రెండు వరుస అపజయాలు తట్టుకొని నిలబడటమే గాకుండా, మళ్ళీ వెంటనే మరో భారీబడ్జెట్ సినిమా ఎలా తీయగలిగాడని సినిమారంగంలో ప్రతీ ఒక్కరికీ సందేహాలొచ్చాయి, కానీ, బొత్స సత్యనారాయణ పేరు చూచాయగా వినిపిస్తుండటంతో ఎవరూ నోరు మెదిపే సాహసం చేయలేకపోయారు.

 

‘గబ్బర్ సింగ్’ సినిమా మొదలు పెట్టిన వెంటనే, ఆయన జూ.యన్టీఆర్ తో ‘బాద్షా’ సినిమా, అల్లు అర్జున్ తో ‘ఇద్దరు అమ్మాయిలతో’ అనే మరో సినిమా కూడా మొదలు పెట్టడంతో, ఆదాయపన్ను శాఖ కళ్ళు బండ్ల గణేష్ పైన పడ్డాయి. నిన్న, ఆయన ఇల్లు, కార్యాలయాలపై ఒకేసారి దాడి జరిపిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఆయన ఇంటి నుండి కొన్ని కీలకపత్రాలు స్వాదీనం చేసుకొన్నట్లు సమాచారం. ఈ రోజు ఉదయం ఆయనను తమ కార్యాలయానికి పిలిపించుకొని వారు మరిన్ని వివరాలు సేకరించారు.

 

బండ్ల గణేష్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసినప్పుడు, అందరూ గణేష్ కి, బొత్స సత్యనారాయణకి మద్య ఏదయినా రహస్య ఒప్పందాలు జరిగి ఉంటే, అవి బయటపడవచ్చునని భావించారు. కానీ, ఆదాయపన్ను శాఖ అధికారులు మాత్రం అటువంటివేవి దొరికినట్లు ఇంతవరకు ప్రకటించలేదు. అందువల్ల, ప్రస్తుతం కేవలం బండ్ల గణేష్ మాత్రమే ఆదాయపన్ను సమస్యలలో చిక్కుకొన్నట్లు భావించవలసి ఉంటుంది. ఒక వేళ ఆదాయపన్ను శాఖ అధికారులు, బొత్స సత్యనారాయణ కూడా గణేష్ సినిమా వ్యవహారాల్లో ఉన్నట్లు కనిపెడితే మాత్రం అది బొత్సకు కొత్త సమస్యలు తేవడం ఖాయం.

By
en-us Political News

  
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.