Publish Date:May 23, 2023
బందరు పోర్టు శంకుస్థాపన చివరికి ఒక ప్రహసనంగా తయారైంది. ఇప్పటికే రెండు సార్లు పునాదిరాయి పడిన బందరు పోర్టుకు మళ్లీ పునాదిరాయి పడింది. ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేసినా నిర్మాణానికి నోచుకోకపోవడం బందరు పోర్టు ప్రత్యేకత. బందరు పోర్టు శంకుస్థాపన కథ కొంత విచిత్రంగానే ఉంటుంది. బందరులో పోర్టు నిర్మాణానికి తీర ప్రాంతం అనువైనదని వందల సంవత్సాల ముందే నిర్ణయించారు.
అయితే తూర్పు తీర ప్రాంతంలో అనేక మేజర్ పోర్టులు ఉండటంతో బందరు పోర్టు ఆలస్యమవుతూ వచ్చింది. 2009 ఎన్నికలకు ఏడాది ముందు అంటే 2008 ఏప్రియల్ 23వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బందరు పోర్టుకు శంకుస్థాపన చేశారు. 2009 ఎన్నికలలో గెలిచిన వైఎస్ఆర్ అదే సంవత్సరం సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అనంతరం జరిగిన పరిణామాల్లో మరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బందరు పోర్టుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2014 ఎన్నికల ముందు జరిగిన హడావుడి పోర్టు నిర్మాణం వైపు సాగలేదు. పోర్టుకు సంబంధించిన స్థల సేకరణకు చర్యలు తీసుకోలేదు.
ఆ సమయంలో కృష్ణపట్నం పోర్టు కార్యకలాపాలు, అక్కడ నుంచి ముడి ఇనుప ఖనిజం ఎగుమతులు భారీగా జరుగుతూ ఉండడంతో మిగిలిన పోర్టుల జోలికి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లలేకపోయింది. రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం హయాంలో తిరిగి పోర్టుల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో 2019 ఫిబ్రవరి 7వ తేదీన అప్పటి ముఖ్యమం్రతి చంద్రబాబునాయుడు బందర్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. అదే సంవత్సరం జరిగిన ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల పాటు పోర్టు పనులను అటకెక్కించింది. సంక్షేమం పేరుతో డబ్బులు పంచడమే పాలన అంటూ ఖజానా ఖాళీ చేసిన జగన్ ప్రభుత్వం బందరు పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్టు వంటి భారీ ప్రాజెక్ట్ ల గురించి ఆలోచించలేకపోయింది. వేల కోట్ల ఖర్చు అయ్యే ఇలాంటి ప్రాజెక్ట్ లు ప్రారంభించడం జగన్ సర్కార్ కు అసాధ్యమే అయింది.
అయితే మే 22వ తేదీన బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన జగన్ గత ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా పోర్టు పేరెత్తని జగన్ ఎన్నికల ముందు పోర్టు పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. గతంలో జరిగిన శంకుస్థాపనలకు ప్రత్యక్ష సాక్షి అయిన పేర్ని నాని ఈ సారి కూడా జగన్ త బందర్ పోర్టు పనులను మరోసారి ప్రారంభించారు.
అయితే 2008లో ప్రారంభించిన వైఎస్ఆర్ ప్రమాదంలో మరణించగా, 2014లో పనులు పర్యవేక్షించిన కిరణ్ కుమార్ రెడ్డి పదవికి దూరమయ్యారు. 2019లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు అనంతర ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. తాజాగా అదే పోర్టును శంకుస్థాపన చేసిన జగన్ కు రానున్న ఎన్నికలలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అని రాజకీయ విశ్లేషకులు ఆలోచనలో పడ్డారు. ఏది ఏమైనా బందరు సెంటిమెంట్ ఈ సారి కూడా పని చేస్తుందని తెలుగుదేశం నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bandar-port-sentiment-loose-power-39-155788.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.