Publish Date:May 30, 2025
బనకచర్లపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్ల ప్రాజెక్టు ఆగదని విస్పష్టంగా చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కేవలం రాజకీయ లబ్ధి కోసం విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కడప వేదికగా జరిగిన మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత ఆయన మాట్లాడారు.
కర్నూలు జిల్లా బనకచర్లలో నిర్మించే భారీప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ రెడీ అయ్యిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే కేంద్రంతో పలుమార్ల చర్చించినట్లు తెలిపారు. గోదావరి జలాలను పోలవరం ద్వారా మళ్లించి బనకచర్లలో నిల్వ చేసి కర్నూలు జిల్లా సహా సీమ ప్రాంత ప్రజలకు అందించడమే తన లక్ష్యం, సంకల్పం అని ప్రకటించారు. అంశాన్ని ప్రస్తావించారు. గోదావరి జలాలను పోలవరం ద్వారా.. మళ్లించి.. బనకచర్లలో నిల్వ చేసి.. కర్నూలు సహా రాయలసీమ ప్రాంత ప్రజలకు అందించాలన్నది తమ సంకల్పంగా చెప్పుకొచ్చారు. బనకచర్లపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్నదంతా దుష్ప్రాచారమేనని చెప్పిన ఆయన వృధాగా ఉప్పు సముద్రం పాలౌతున్న గోదావరి జిలాలను సద్వినియోగం చేసుకునేందుకుకే ఈ ప్రాజెక్టు కుట్టుకుంటున్నామన్నారు. దీనిని కూడా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలు సాగవని హెచ్చరించారు.
సముద్రంలో పోయే నీటిని వాడుకుంటే తప్పా? ప్రజలకు మేలు చేస్తే ఓర్చుకోలేరా? అని బీఆర్ఎస్ ను సభా ముఖంగా నిలదీశారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపాలని సూచించారు. బనకచర్ల ద్వారా తెలంగాణకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏ ప్రాజెక్టు కట్టినా.. దాని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనేదే తమ ఉద్దేశమని చంద్రబాబు పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/banakacharla-will-not-stop-25-198969.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.