గెలుపు దారి కానరాదేమి బాలినేని!

Publish Date:May 10, 2024

Advertisement

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం హవా జోరుగా ఉంది. జగన్ గాలి వీచిన 2019 ఎన్నికలలో కూడా ఈ జిల్లాలో తెలుగుదేశం నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఈ సారి తెలుగుదేశం కు జనసేన, బీజేపీల బలం తోడైంది. జగన్ సర్కార్ పై ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతతో ఆ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఇక ఒంగోలు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి, సీఎం జగన్ కు సమీప బంధువు బాలినేని అయితే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.  

ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా దామచర్ల జనార్ధన్ పోటీ చేస్తున్నారు.  2014 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన 2019 వరకూ ఒంగోలు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి ఇప్పుడు ఆయనకు బాగా కలిసి వస్తోంది. 2019 ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికలలో విజయం సాధించిన బాలినేని జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. అయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన చేసింది శూన్యం అన్న భావన ప్రజలలో వ్యక్తం అవుతోంది. అభివృద్ధి మాట అలా ఉంచితే ఆయన హయాంలో నియోజకవర్గంలో అరాచకం తాండవించింది. స్వయంగా బాలినేని కుమారుడిపైనే భూ కబ్జాలు, దాడుల ఆరోపణలు ఉన్నాయి. బాలినేని కుమారుడు, ఆయన అనుచరులు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో సిట్ దర్యాప్తునకు ఆదేశించాల్సి వచ్చిందంటే బాలినేని హయాంలో నియోజకవర్గంలో ఏ స్థాయిలో అరాచకత్వం రాజ్యమేలిందో ఊహించవచ్చు. 

అలాగే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సుబ్బారావు గుప్తాను వేధించిన ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్ంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  తాగునీటి పథకాలు, పోతురాజు కాలువ ప్రాజెక్టు విషయంలో బాలినేని వైఫల్యాలు నియోజకవర్గ ప్రజలలో బాలినేని ప్రతిష్టను మసకబార్చాయి. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్ధన్ కు ప్రజా మద్దతు పెరుగుతోంది. ప్రచారంలో దామచర్ల దూసుకుపోతుంటే.. బాలినేని సొంత పార్టీ క్యాడర్ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటూ ఎదురీదుతున్నారు. అలాగే ఒంగోలు  సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరడం, కూటమి బలపరిచిన అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున పోటీలో దిగడం కూడా బాలినేని విజయావకాశాలపై ప్రభావం చూపనుందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మాగుంట కుటుంబానికి ఒంగోలు, కొంండెపి నియోజకవర్గాలలో మంచి గుర్తింపు ఉంది. బైపాస్ రోడ్డు వంటి నిర్మాణాలతో ప్రజలలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుటుంబంపై నియోజకవర్గ ప్రజలల సానుభూతి వ్య్తఅవుతోంది. అదే సమయంలో ఉద్యోగులు, టీచర్లు, కాపు సామాజికవర్గం ఈ సారి బేషరతుగా తెలుగుదేశం పార్టీకి, దామచర్ల విజయానికి మద్దతు ప్రకటించారు  

By
en-us Political News

  
ఆమె కడుపులో ఒకటి కాదు.. రెండు కాదు.. పోనీ వంద కూడా కాదు.. ఏకంగా 570 రాళ్ళున్నాయి.
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు పెద్ద సమస్య వచ్చిపడింది. క్యాట్‌ తీర్పు ఇచ్చినా ఆయనకు పోస్టింగ్ దక్కలేదు. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినా స్పందన లేదు. ఈ నెల 31తో ఆయన పదవీకాలం పూర్తి కాబోతోంది. 2019 ఎన్నికల తర్వాత, ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ లేకుండా పోయింది
 తెలుగు మహిళ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. సప్త సముద్రాలు దాటిన ఈ వనిత భారత దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింజేసింది. 
 ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పొడిగించింది
ప్రస్తుతం జగన్ భయంతో వణికిపోతున్నారు. అధికారం పోయిన తర్వాత తన పరిస్థితి ఏమిటి? తన మీద వున్న కేసుల పరిస్థితి ఏమిటి? జైలుకు వెళ్ళక తప్పదా? హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికితే ఏం జరుగుతుంది. అయిదేళ్ళపాటు మహారాజులా బతికిన తాను జూన్ 4 నుంచి ఎలా బతకాలి...
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరగ్గా, పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. బదిలీ అయిన వారి స్థానంలో ఈసీ నేడు కొత్త నియామకాలు చేపట్టింది. డీఎస్పీలుగా ఐదుగురిని, ఇన్ స్పెక్టర్లుగా ఏడుగురిని నియమిస్తూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేక పరాజయం పాలై అధికారం కోల్పోతుందా వంటి ప్రశ్నలకు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సర్వేల మీద ఆధారడుతుంది.
ప్రభుత్వ అవినీతి, అక్రమాలతోపాటు ముఖ్య కారణంగా చెప్పుకోవలసింది ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ యాక్ట్ ద్వారా తమ భూములకు మొగుడై కూర్చుంటాడన్న భయం జనాన్ని వేధించింది. అందుకే అతన్ని సాగనంపేలా తీర్పు చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత కొన్ని ప్రాంతాలలో హింస చెలరేగింది. దీంతో ఆయా ప్రాంతాలలో పరిస్థితిని అదుపు చేయడానికి నిరవధికంగా 144వ సెక్షన్ విధించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజల తీర్పు ఎలా ఉందో చెప్పడానికి ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫలితం చూస్తే సరిపోతుందని అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఇదే ఓరవడి కొనసాగుతూ వస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరణ పొందిన పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఈ
 తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలు సోమవారం  నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత.. సుమారు 46 రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ... ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు.
పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేదీ సినిమాలో చివరి పంచ్ మనదైతే ఆ క్కిక్కే వేరప్పా అని ఓ డైలాగ్ ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ అలాంటి కిక్ నే ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.