బాలయ్యకు సాధ్యమైంది..పవనయ్యకు ఎందుకు కాదు?

Publish Date:Jul 27, 2025

Advertisement

 

బాలకృష్ణ కూడా సినీ పొలిటీషియనే. ఆయనా హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. ఇటు రాజకీయాల్లో ఉంటూనే అటు వరుస సినిమాలు చేస్తున్నారు. బాలకృష్ణ లాస్ట్ హిట్ మూవీస్ ఏంటో చూస్తే.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్. అఖండ 2 ఫీవర్ లో ఉన్నారాయన అభిమానులు. తర్వాత కూడా మరో చిత్రానికి సంబంధించి కథా చర్చలు నడుస్తున్నాయి. హెక్ టిక్ బిజీ షెడ్యూల్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయాలేంటని చూస్తే నాలుగు సినిమాలు- నాలుగు వరుస సెంచురీలు. అఖండ నుంచి డాకూ వరకూ వంద కోట్లు క్రాస్ చేసిన సినిమాలే.

ఇంత పక్కా ప్లానింగ్ ఎలా సాధ్యం? అని చూస్తే బాలకృష్ణ ఇటు సినిమాలు, అటు రాజకీయాలను ఇంత వయసులోనూ సమన్వయం చేసుకోవడంలో ఆరితేరిపోయారనే చెప్పాలి. అదే పవన్ అలాక్కాదు.. పుష్కరకాలంగా రెండు పడవలపై కాళ్లు. వాటిలో రాజకీయాల్లో పడుతూ లేస్తూ ఎలాగోలా నేడు ఆయన తొలిసారి గెలవడం మాత్రమే కాకుండా డిప్యూటీ సీఎం, ఆపై నాలుగు మంత్రిత్వాలు నెరుపుతున్నారు. కాదనడం లేదు. టైం లేదు. బిజీ బీజీ. ఉదయాన్నే ఎక్కిన హెలికాప్టర్ రాత్రి దిగే హెలికాప్టర్ మధ్య విమానయానం.. నానా రకాల హంగామా. ఈ బిజీ పొలిటికల్ షెడ్యూల్లో ఆయన సినిమాలకు ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు.

అదే బాలయ్య అలాక్కాదు. మొన్న మహానాడును కూడా వదులుకుని అఖండ 2 షూట్ కోసం ఫారిన్ టూర్ వెళ్లారు. అంటే కొంత రాజకీయ త్యాగం చేస్తున్నారన్నమాట. మాములుగా అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ నాయకత్వంలోని కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత కడపలో పెట్టిన మహానాడు. ఆ కిక్కే వేరుగా ఉంటుంది. దాన్ని ఆస్వాదించాలని ఎవరికైనా ఉంటుంది. కానీ బాలయ్య బాబు అలాక్కాదు. ఆయన దేనికి ఎప్పుడు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వాలో ఇవ్వడం బాగా తెలుసని అంటారు ఆయన అభిమానులు.

ఇదిలా ఉంటే పవన్, బాలయ్య లా ఒక పార్టీ ఎమ్మెల్యే మాత్రమే కాదు. జనసేనకు అన్నీ తానే. ఈ విషయంలో పవన్ కి ఉన్న వర్క్ లోడ్, బాలకృష్ణకు ఉండకపోవచ్చు. అయితే అందుకంటూ కూడా కొంత ప్లానింగ్ అవసరమే. రాజకీయాల్లో ఉంటూ కూడా ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ వంటి హిట్స్ ఇచ్చారు. ఇక బాలకృష్ణ సింహ నుంచి ఊపందుకున్న సెకండ్ ఇన్నింగ్స్ తర్వాతి కాలంలో తన స్థాయికి తగ్గట్టు హిట్లు నమోదు చేస్తూనే వస్తున్నారు. అదే పవన్ విషయంలో ఆయనకొక హిట్టు పడి.. పుష్కర కాలం దాటింది. అంటే 12 ఏళ్లు పూర్తి. అత్తారింటికి దారేది తర్వాత హిట్టే లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వరుసగా ఆరు ఫ్లాప్ లు. వీటిలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి కొన్ని మెరుపులున్నా.. అవేం అంత పెద్ద మేజర్ హిట్స్ కావు. 

పవన్ కన్నా చిన్న చిన్న వాళ్లు.. మరీ ముఖ్యంగా ఆ కాంపౌండ్ లోని అల్లు అర్జున్ పానిండియా స్టార్ గా తన కంటి ముందు ఎదుగుతూ వెళ్తున్నాడు. ఇటీవలి పుష్ప2 కూడా కాస్త డివైడ్ టాక్ వచ్చినా.. అది 2 వేల కోట్ల మేర వసూళ్లు సాగించిన చిత్రంగా టాలీవుడ్ రికార్డులకెక్కింది. 

ప్రస్తుతం పవన్ హరి హర వీరమల్లు విషయానికి వస్తే.. ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఫ్లాప్ షోగా భావిస్తున్నారు. ఆచార్య, భోళాశంకర్, మట్కా, గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లు.. అంటూ క్రోనాలజీ చెబుతున్నారు. ఇక నిర్మాత ఏఎం రత్నం అయితే ఏం సార్ మీరు హ్యాపీయేనా? అనడిగిన ప్రశ్నకు.. పాపం ఆయన మింగలేక కక్కలేక నానా అవస్తలు పడుతున్న దృశ్యం మెగా ఫ్యాన్స్ ని డైలమాలో పడేస్తోంది. మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో ఒక ఫ్లాగ్ షిప్ కెప్టెన్సీ నిర్వహిస్తున్న పవన్ నుంచి తాము ఇలాంటి ఫలితాలను ఆశించడం లేదని కుండబద్ధలు కొడుతున్నారు కొందరు. 

అంతేనా బాలయ్యను చూసి నేర్చుకోమని కూడా సూచిస్తున్నారు కొందరు. బాలయ్య బాబు మీ అంత బిజీగా లేకున్నా.. ఆయన కూడా సేమ్ టూ సేమ్ ఇటు సినీ కథానాయకుడు, అటు రాజకీయ నాయకుడే. మధ్యలో ఫ్యామిలీ ఎఫైర్స్, ఆపై బసవతారకం ట్రస్ట్, ఇంకా హిందూపూర్ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎంతో చక్కగా హ్యాండిల్ చేస్తున్నారు. సినిమా తీయడం విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఆపై కథలను కూడా పర్ఫెక్ట్ గా ఎంపిక చేసుకుంటున్నారు. అలాంటి ఫ్లో మెయిన్ టైన్ చేయాల్సింది పోయి.. మనమేం మాట్లాడినా వర్కవుట్ అవుతోంది కదాని చెప్పి.. ఎలా పడితే అలా సినిమా చూస్తారనడానికి లేదన్న హెచ్చరికలు అందుతున్నాయ్. ఇది పోతే పోయింది ఓజీ, ఉస్తాద్ ఉన్నాయని లైట్ తీస్కోడానికి లేదనీ.. చేస్తే పక్కాగా సినిమాలు చేయడం.. లేదంటే వాటిని పక్కన పెట్టి సీరియస్ పాలిటిక్స్ మీద దృష్టి సారించడం చేయాలన్న సలహా సూచనలు, స్వయానా ఆయన సైనికులు, వీర మహిళల నుంచే అందుతున్నాయ్..

లేకుంటే ఏంటీ రభస? పవన్ సినిమా కోసం ర్యాలీలు తీయడమేంటి? సినిమా చూడమని కూడా బలవంత పెట్టడమేంటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అయితే సినిమా టికెట్ ఫ్రీ పథకం ప్రవేశ పెట్టడంతో సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్ అవుతోంది. ఇదేంటి పవనన్నా.. సినిమా చూడ్డం ఏమీ స్కూలుకెళ్లడం లాంటి నిర్బంధ వ్యవహారం కాదే అని నిలదీస్తున్నారు.. కొందరు అభిమానులు. పవన్ సినిమా హిట్ చేయడం వల్ల లాభాలను ఏకరవు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక వేళ మీరు ఈ సమాజానికి ఏదైనా లబ్ధి చేకూర్చి పెట్టాలంటే నేరుగానే చేయవచ్చు. సినిమా రూపంలో దాన్ని చేయాల్సిన అవసరం లేదన సలహాలు అందుతున్నాయ్. మరి చూడాలి పవన్ ఇటు బాలకృష్ణలాంటి వారి నుంచి ఏదైనా నేర్చుకుంటారా? లేక సినిమాలు పక్కన పెట్టి సీరియస్ పాలిటిక్స్ మీద ఫోకస్ పెడతారా? తేలాల్సి ఉందంటున్నారు సైనికులు.
 

By
en-us Political News

  
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.