మీరసలు జర్నలిస్టులేనా? కొమ్మినేని, కృష్ణం రాజులపై బాలకోటయ్య ఫైర్.. రాష్ట్రబహిష్కరణకు డిమాండ్

Publish Date:Jun 7, 2025

Advertisement

అమరావతి  దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ ఒక చానెల్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కృష్ణం రాజు, ఆయనను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి ప్రాంతంలో ఎయిడ్స్ రోగులు ఎక్కువగా ఉన్నారంటూ'  జర్నలిస్ట్ మ్యాగజైన్ ఎడిటర్ వివిఆర్ కృష్ణంరాజు అమరావతి ప్రాంత మహిళలను అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది.  అలాగే అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య యాంకర్ కొమ్మినేని, అనలిస్ట్ కృష్ణం రాజులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.  

ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కంచల జయరాజ్, దాసరి నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఐజేయు కౌన్సిల్ సభ్యులు ఎస్ కే బాబు, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు జీ.రఘురాం, నాగ మల్లేశ్వర రావులు ఒక సంయుక్తలో ఖండించారు.  ఒక పత్రికకు ఎడిటర్ గా ఉన్న కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పాత్రికేయ సమాజానికి తలవొంపులు తెచ్చేలా ఉన్నాయని విమర్శించారు. అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లోని మహిళలపై  విషం కక్కిన కృష్ణం రాజు   తక్షణమే అమరావతి ప్రాంత మహిళలకు, రాష్ట్ర ప్రజలకు బే షరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య అయితే యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, విశ్లేషకుడు కృష్ణం రాజులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 

పిచ్చి కుక్కల్ని, ఊర పందుల్ని, కాటేసే పాముల్ని వన్య ప్రాణుల సంరక్షణ పేరిట అలా వదిలేస్తే  ప్రమాదకరమని, పిచ్చి కుక్కల్ని తాళ్ళతో కట్టెయాలని, ఊరపందుల్ని ఊళ్ళ నుంచి తరిమేయాలని, బుసలు కొట్టే పాములను  కోరలు పీకి బుట్టల్లో బంధించాలని పేర్కొన్నారు.  ఈ మేరకు ఆయన శనివారం (జూన్ 8) విడుదల చేసిన ప్రకటనలో యాంకర్ గా  కొమ్మినేని శ్రీనివాసరావు, విశ్లేషకుడు కృష్ణంరాజు ప్రజా రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొనడం క్షమించరాని నేరమన్నారు. ఆ వ్యాఖ్యలపై  ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  రాజధానిపై ఇప్పటివరకు వైకాపా నాయకులు చేసిన అశుద్దపు ప్రచారాలకు ఇది పరాకాష్ట అన్న బాలకోటయ్య.. పురాణాల్లో దేవతల రాజధాని అమరావతి అని, ఆంధ్రప్రదేశ్ లో రైతుల భాగస్వామ్యం కలిగిన ప్రజా రాజధాని కూడా అలాంటిదేనన్నారు.  అటువంటి ప్రజారాజధానిపై  ఇష్టారీతిగా దూషణలు చేయటం పాత్రికేయ వృత్తికే కళంకం అని పేర్కొన్నారు.  రాజధాని పొడ గిట్టని  ఇలాంటి వారిని  రాష్ట్ర బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రభుత్వం స్పందించి 24 గుంటల్లోగా కొమ్మినేని, కృష్ణం రాజులపై చర్యలు తీసుకోవాలని బాలకోటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలను కించపరుస్తూ, రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణిస్తూ కొమ్మినేని, కృష్ణంరాజుల వ్యాఖ్యలపై తాను  స్వయంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేయనున్నట్లు  తెలిపారు.  

By
en-us Political News

  
ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 471 పరుగులకు ఆలౌటైంది.
బనకచర్ల ప్రాజెక్ట్‌ వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని సీపీఐ నేత నారాయణ కొరారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం ఈ నెల 27వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది.
పాడి పంట. ఈ జంట వ్యవస్థల్లో పశువులు సుభిక్షంగా ఉంటే చాలు.. పంటలు, పల్లెలు, రైతు కుటుంబాలు యథాతథంగా బాగుంటాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను తొలిగించాలని ఎయిరిండియాను ఆదేశించింది.
ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ పేరు మార్చాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ కేబీఆర్ పార్కు వద్ద ఆయన ధర్నా చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు పుష్ప మూవీ డైలాగ్ ప్లకార్డులు ప్రదర్శించారు. 2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్" అంటూ మాజీ మంత్రి హారీశ్‌రావు, ఫోటోలతో ప్లకార్డులు రూపోందించారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ‌చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థత గురైనట్లు తెలుస్తోంది.ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.. స్వయంగా మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వివాదాస్పద వాక్యాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం లేపుతున్నాయి.
డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్, భార‌తీయ కుబేరుల్లో ఒక‌డైన క‌ళానిధి మార‌న్ కి మ‌ధ్య ఆస్తి చిచ్చు మొద‌లైందా? అంటే అవున‌ని తెలుస్తోంది. 2003లో తండ్రి ముర‌సోలి మార‌న్ మ‌ర‌ణించారు. స‌రిగ్గా ఆ టైంలో బీజం వేసుకుందీ ఆస్తి త‌గాదా.
బీఆర్‌ఎస్ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కి తరలించారు.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఆయుష, ఆరోగ్యశాఖ ఆథ్వర్యంలో ఘనంగా నిర్వహించాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.