Publish Date:Jul 19, 2022
అకాల వర్షాలతో వాగులు, వంకలూ పొంగి పొర్లుతూన్నవేళ, గ్రామాలు, కుగ్రామాల్లో ప్రజలు ప్రాణభీతితో వణుకుతున్నవేళ ఓ శిశువు జననం ఓ గ్రామాన్ని భయాందోళనల నుంచి ఆనందోత్సాహంలోకి తెచ్చింది. కన్నీళ్ల నుంచీ ఆనందభాష్పాలు పంచుకునేలా చేసింది. కష్టాల మనసుకు రవ్వంత ఊరటనిచ్చింది. గాంధారి వాగు దాటుతోన్నసమయంలో ఓ గర్భిణి ప్రసవించింది.
అసలే ఎడతెరిపిలేని వర్షాలతో వాగులూ అడవి బిడ్డలను ఖంగారెత్తిస్తున్నాయి. అనారోగ్యంతో ఉన్న వారి పరిస్థితి మరీ దారుణం.. ఆస్పత్రేలేవీ దగ్గరా దాపు ఉండవు. వాగులు దాటి వెళ్లాల్సిందే. ఈమధ్య భారీవర్షాలు అటుగా దాటి వెళ్లడానికీ చాలా ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితుల్లో ఉన్నా రంతా. సరిగ్గా ఈ పరిస్థితులు, ఈ ఆందోళన సమయంలోనే ఓ గర్భిణికి నొప్పులు వచ్చి ఆస్పత్రికి తీసికెళ్లాల్సి వచ్చింది. ఆమె ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ పంచాయతీ మామిడి గూడు గ్రామానికి చెందిన ఉయిక. ఆమెను గాంధారి వాగు దాటించి ఆస్పత్రికి తీసికెళ్లాలి. గ్రామస్థులు ఆమెను ఇంద్ర వెల్లి పీహెచ్సీకి తరలించేందుకు సిద్ధమయ్యారు.
వారిలో ఆమెను, బిడ్డను కాపాడగలమన్న ధైర్యం, వారిలో ఆ తల్లి ఆనందాన్ని చూడగలమన్న నమ్మకం.. వెరసి వాగును దాటడం పెద్ద కష్టమేమీ కాదన్న పదింతల ధైర్యాన్నిచ్చింది. అంతే రెండ డుగులు వేసారో లేదో ఆమెకు భరించలేని నొప్పులు ఆరంభమయ్యాయి. అంతే ఆమె మరుక్షణం గట్టు మీదనే ప్రసవించింది. సమాచారం అందుకున్న పిట్టబొంగరం పీహెచ్సీ హెచ్ఈవో అశోక్, వాల్గొండ ఏఎన్ఎం జానా బాయి, ఆశా కార్యకర్త మైనాబాయి వాగు దాటి వెళ్లారు.
గ్రామస్థుల సహాయంతో తల్లీ, బిడ్డలను క్షేమంగా వాగు దాటించారు. అంతేకాదు బాలింత ఆస్పత్రికి చేరేందుకు ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్లు నడిచింది. అక్కడినుంచి అంబులెన్స్లో ఇంద్రవెల్లి పీహెచ్ సీ కి తరలించారు. తల్లీ బిడ్డా క్షేమమని తెలిసి మామిడిగూడు గ్రామస్తుల్లో ఆనందం ఆకాశాన్నంటింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/baby-birth-on-lake-bank-25-140069.html
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!