ఆ మూడు పార్టీల పొత్తు పొడుపు ..కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు

Publish Date:May 24, 2022

Advertisement

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలే  ఉంటాయి. ఇది ముమ్మాటికి నిజం. ఇప్పటికే అనేక సందర్భాలలో రుజువైన వాస్తవం. ఆంధ్ర ప్రదేశ్’లో అధికార వైసీపీని ఓడించేందుకు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు, అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని, జనసేన అధినేత పవన్ కళ్యాన్ ప్రకటించినప్పుడు చాలా మంది అనుమానాలు వ్యక్త పరిచారు. అదెలా సాధ్యమని,అయ్యే పనికాదని పెదవి విరిచారు.అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం అక్కడితో ఆగిపోలేదు. బీజేపీ జాతీయ నాయకులతో ఆయన ఏమి మాట్లాడారో ఏమో కానీ, టీడీపీతో పొత్తుకు బీజేపీ ఒప్పించే బాధ్యతను కూడా తానే తీసుకున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించగలననే విశ్వాసం వ్యక్త పరిచారు. అయినప్పటికీ, రాష్ట్ర బీజేపే నాయకులు అందుకు విరుద్ధంగా ప్రకటనలు చేశారు. చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ మాట నిలబడుతుందా అనే అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతున్నాయి. 
అయితే, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ‘పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించారు. దేశ ప్రజలు,వాహనదారులపై భారాన్ని తగ్గించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర స్థాయి పన్నులను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పిలుపునివ్వడాన్ని కూడా చంద్రబాబు స్వాగతించారు. రాజస్థాన్, ఒరిస్సా, తమిళనాడు ప్రభుత్వాలు ఇంధనంపై తమ పన్నులను తగ్గించాయని, ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే బాటలో వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. 

నిజానికి, 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఇలా సానుకూలంగా ఎప్పుడూ స్పందించే లేదు. తొలిసారిగా ఆయన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అది కూడా పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్ పొత్తుల ప్రకటనకు కొనసాగిపుగానే చంద్రబాబు స్పందన ఉందని, ఇది ఆ మూడు పార్టీలు మళ్ళీ దగ్గరవుతున్నాయి అనేందుకు ఒక సంకేతమని విశ్లేషకులు అంటున్నారు.   

మరోవంక పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం నిర్ణయంపై అభినందనీయమంటూ ప్రసంసలు కురిపించారు,  'పెరుగుతున్న ధరలతో కష్టాల్లో ఉన్న ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుతో ఉపశమనం లభిస్తుందని నేను భావిస్తున్నాను. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వ అగ్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.9.50, రూ.7 చొప్పున తగ్గించడం అభినందనీయం' అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 
'బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో, కొంతమేరకు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉన్నందున, దిగువ-ఆదాయ వర్గాలు, మధ్యతరగతి ప్రజలు ఉపశమనం పొందవచ్చని నేను భావిస్తున్నాను.పీఎం ఉజ్వల్ యోజన పథకం కింద ఇస్తున్న గ్యాస్ సిలిండర్లపై రూ.200 తగ్గింపు కచ్చితంగా పేదలకు మేలు చేస్తుంది' అని అన్నారు పవన్ కళ్యాణ్. 

ఇలా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడం ద్వారా, బీజేపీకి స్నేహ హస్తం అందించారని అనుకోవచ్చని అంటునారు. నిజానికి, తెలుగు దేశం, చంద్రాబాబు నాయుడు, రాష్ట్ర పయోజనల దృష్ట్యా బీజేపీతో పొత్తుకు సిద్దంగా ఉన్న సంకేతాలు ఉండబట్టే, పవన్ కళ్యాణ్’ విపక్షాల ఓటు చీలకుండా చూస్తానాయి మాట ఇచ్చారని  జనసీన నాయకులు అంటున్నారు. అలాగే, టీడీపీతో పొత్తుకు బీజేపీ జాతీయ నాయకత్వం కోడా సిద్ధంగా ఉందని అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీని ఒప్పించే బాధ్యతను తీసుకున్నారని అంటున్నారు. అయితే, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని, అదే విధంగా చంద్రబాబు స్పందనకు బీజేపీ జాతీయ నాయకత్వం ఎలా స్పందిస్తుంది, అనే దానిపై పొత్తు పొడుపు ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

By
en-us Political News

  
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్  అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్..  రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం  4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.