Publish Date:Apr 26, 2024
అందుకే ఆయన రాజకీయంగా ఆయన పరిస్థితి దిక్కుమాలిన స్థితికి చేరుకుంది. గురువారం నాడు వరంగల్ పార్లమెంట్ స్థానానికి వీల్ చైర్లో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఇంతకీ మీరు నామినేషన్ వేసింది ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగానేగా అని అడిగితే, ‘ఛ.. ఛ.. ఆ పార్టీలో నేనెనెప్పుడు చేరాను? కాఫీ తాగుదువుగాని రా అని కేఏ పాల్ పిలిస్తే వెళ్ళాను. ఆయన నాకు కండువా కప్పి వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించేశారు. కానీ నేను ఆ పార్టీలో చేరలేదు.. ఆ పార్టీ సభ్యుణ్ణి కూడా కాదు. ఆ పార్టీకి ఆరోజే టాటా చెప్పేశాను. స్థానిక ప్రజలు నన్ను నా స్వస్థలమైన వరంగల్ నుంచి పోటీ చేయాలని రిక్వెస్ట్ చేయడంతో నామినేషన్ దాఖలు చేశాను’ అని చెప్పుకొచ్చారు.
నిజానికి బాబూమోహన్ ప్రజాశాంతి పార్టీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నానని కె.ఎ.పాల్తో కలసి ప్రకటించారు. అప్పటి వరకు తాను వున్న బీజేపీకి గుడ్ బై చెబుతున్నట్టు కూడా ప్రకటించారు. మధ్యలో ఓసారి వరంగల్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బాబూమోహన్ బరిలో నిలిచే అవకాశం వుందని వార్తలు వచ్చినప్పుడు బాబూమోహన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తన పేరును బీఆర్ఎస్ పార్టీ ఇలా వాడుకుంటే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. నిజంగానే బీఆర్ఎస్ ఈయనకు టిక్కెట్ ఆఫర్ ఇచ్చినట్టే బిల్డప్పు ఇచ్చారు. చివరికి ఇప్పుడు ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బాబూమోహన్కి పిలిచి మరీ అందోల్ టిక్కెట్ ఇచ్చింది. మంత్రి పదవి కూడా కట్టబెట్టింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో వున్న సమయంలో బాబూమోహన్ నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బయటకి వచ్చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీలో కొంతకాలం కేసీఆర్తో స్నేహబంధం కొనసాగించారు. ఎప్పుడైతే కేసీఆర్ తనను దూరం పెట్టడం ప్రారంభించారో, పొమ్మనలేక పొగపెట్టడం మొదలుపెట్టారో బాబూమోహన్ పార్టీకి క్రమంగా దూరమవుతూ, చివరికి పార్టీలో నుంచి బయటకి వచ్చేశారు. ఈసారి మకాం బీజేపీలో వేశారు. మొన్నటి ఎన్నికలలో అందోల్ టిక్కెట్ కోసం తన కొడుకుతోనే గొడవపడి నానా రచ్చ చేశారు. ఆ తర్వాత ప్రజాశాంతి పార్టీకి చేరువై, ఆ తర్వాత దూరమై ఇప్పుడు ఇండిపెండెంట్గా మిగిలి, తనకు రాజకీయంగా కొత్త అయిన వరంగల్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నారు. రాజకీయంగా తన కెరీర్ ముగిసిన విషయాన్ని బాబూమోహన్ ఇంకా గ్రహించలేదు. ఏడుపదులు దాటిన బాబూమోహన్ ఇక రాజకీయాలకు స్వస్తి పలికి విశ్రాంతి బాటలో నడిస్తే బాగుంటుంది!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/babu-mohan-unstable-politics-39-174549.html
మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించిన ఆయనకు తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కమ్ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలను సెట్ చేసుకుంటే సరిపోతుందని ఆలోచన వచ్చింది.
తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందంటారు కేసీఆర్. ఎన్నికల్లో ఓటమి అనేది టెంపరరీ సెట్ బ్యాక్ మాత్రమే. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు నిబ్బరం ఉండాలి. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని కేసీఆర్ తన క్యాడర్కు హితబోధ చేస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఎవరు ఎంత అధికారంలో అయినా వుండవచ్చు... మా మాటకు ఎదురు లేదు.. మేం చేసిన దానికి తిరుగులేదు అనే ధీమాలో వుంటే వుండొచ్చు..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వారం రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీకి కొమ్ముకాస్తూ ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న అధికారుల జాబితాను రెడీ చేసుకున్న ఈసీ ఆ జాబితాలో ఒక్కొక్కరి పై బదిలీ వేటు వేస్తూ వస్తున్న. ఇప్పటికే పలువురు అధికారులపై బదిలీ వేటు వేసిన ఈసీ.. ఆదివారం (మే6) రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎపిలో నూతన డిజిపి నియామకమయ్యారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్ దూకుడు పెంచింది.
ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది.
‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు.
అబూజ్ మడ్ దట్టమైన అటవీ ప్రాంతం. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లలో 90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్లలో కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగాపోయింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు.
వైసీపీ నాయకుడు జగన్కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్కట్లో ‘నార్సి’ అంటారని,